Amit Shah: మణిపుర్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. అమిత్‌ షా కీలక నిర్ణయం

మణిపుర్‌లో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. అక్కడ శాంతిభద్రతలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే అక్కడికి అదనపు బలగాలను తరలించనున్నట్లు సమాచారం.

New Update
amit shahh

మణిపుర్‌లో గత కొంతకాలంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అయితే తాజా పరిస్థితులపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. అక్కడ శాంతిభద్రతలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే త్వరలోనే 50 కంపెనీల బలగాలను కేంద్ర ప్రభుత్వం మణిపుర్‌కు తరలించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి మంత్రిత్వ శాఖలో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.    

Also Read: ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం..107 విమాన సర్వీసులు ఆలస్యం!

ఎన్‌కౌంటర్లు, హత్యలు

అలాగే మంత్రిత్వశాఖ బృందం కూడా త్వరలోనే మణిపుర్‌లో పలు కీలక ప్రాంతాలను సందర్శించనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు మణిపుర్‌లో కుకీలు, మెయిటీల మధ్య వైరం ఇంకా జరుగుతూనే ఉంది. అయితే ఇటీవల నెలకొన్న పరిస్థితులు మరింత హింసాత్మకంగా మారాయి. ఇటీవల సీఆర్‌ఎపీఎఫ్‌ ఎన్‌కౌంటర్‌లో 10 మంది మృతి చెందారు. అలాగే కూకీ మిలిటెంట్లు మెయిటీ వర్గానికి చెందిన ముగ్గురు చిన్నారులు, ముగ్గురు మహిళలను కిడ్నాప్ చేసి హత్య చేయడం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి. 

Also Read: భార్యను ఉద్యోగం మానేయమని బలవంతం చేయడం క్రూరత్వమే!

ఈ క్రమంలోనే మణిపుర్ సీఎం బీరేన్ సింగ్‌తో పాటు ముగ్గురు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేల నివాసాలపై నిరసనాకారులు దాడులకు పాల్పడ్డారు. వాళ్ల ఇళ్లల్లోకి చొరబడి ఫర్నిచర్, వాహనాలు, ఇతర సామాగ్రిని తగలబెట్టేశారు. దీంతో అక్కడి పరిస్థితులపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సమీక్ష చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే త్వరలో మణిపుర్‌కు తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. 

Also Read: ఒకేసారి 99 మంది ఉద్యోగులను తీసేసిన CEO.. కారణం తెలిస్తే షాకే!

Also Read: వార్తా సంస్థలకు సోషల్ మీడియా సంస్థలు డబ్బులు చెల్లించాల్సిందే: అశ్వినీ వైష్ణవ్

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

భార్యతోపాటు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్ పర్యటన.. షెడ్యూల్ ఇదే

అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్, భార్యతోపాటు భారత్‌ను సందర్శించనున్నారు. ఉషా వాన్స్‌ భారతీయ సంతతికి చెందిన వారు. జేడీ వాన్స్ ఫ్యామిలీతో కలిసి ఏప్రిల్ 18 నుంచి 24 వరకు ఇటలీ, ఇండియాలో పర్యటించనున్నారు. ఇండియాలో ప్రధాని మోదీతో సమావేశం అవ్వనున్నారు.

New Update
JD vance

JD vance

అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్ భారత్‌ను సందర్శించనున్నారు. ఉషా వాన్స్‌ భారతీయ సంతతికి చెందిన వారు. వచ్చే వారం భారతదేశాన్ని సందర్శించనున్నట్లు ఆయన కార్యాలయం బుధవారం ప్రకటించింది. జేడీ వాన్స్ ఫ్యామిలీతో కలిసి ఏప్రిల్ 18 నుంచి 24 వరకు ఇటలీ, ఇండియా పర్యటన ఫిక్స్ అయ్యింది. ఆయా దేశాల ఆర్థిక, భౌగోళిక రాజకీయ ప్రాధాన్యతల గురించి చర్చిస్తారని వైస్ ప్రెసిడెంట్ ఆఫీస్ నుంచి ఓ ప్రకటన విడుదల అయ్యింది.

Also read: bihar fire accident: ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు పిల్లలు మృతి

ఇండియాలో ఆయన ప్రధాని మోదీని కలపనున్నారు. అమెరికా పర్యటనలో మోదీ జెడి వాన్స్‌ ఫ్యామిలీని కలిశారు. అప్పుడే ఆయన్ని ఇండియాకు ఆహ్వానించారు మోదీ. న్యూఢిల్లీ, జైపూర్, ఆగ్రాలను వారు సందర్శించనున్నారు. అలాగే రోమ్‌లో ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని, వాటికన్ విదేశాంగ కార్యదర్శి కార్డినల్ పియట్రో పరోలిన్‌తో కూడా సమావేశమవుతారు.

Also read: Donald Trump: ట్రంప్ టార్గెట్ హార్వర్డ్.. యూనివర్సిటీపై తన స్టైల్లో జోకులు

Advertisment
Advertisment
Advertisment