Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్ లో విరిగిపడిన కొండ చరియలు..ఆరుగురు మృతి

కొండచరియలు, చెట్లు విరిగి వాహనాలపై పడడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలోని కులు సమీపంలో ఉన్న పర్యాటక ప్రాంతంలో ఆదివారం సాయంత్రం బలమైన గాలులు వీచాయి. అదే సమయంలో అటు నుంచి వెళుతున్న వాహనాలపై చెట్లు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు.

New Update
Himachal Pradesh landslide

Himachal Pradesh landslide

Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్ లోనీ కులు లో  కొండ చరియలు విరిగి పడి ఆరుగురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. హిమాచల్ ప్రదేశ్‌ కులులోని గురుద్వారా మణికరణ్ సాహిబ్ ఎదురుగా ఉన్న పిడబ్ల్యుడి రోడ్డు సమీపంలో ఆదివారం సాయంత్రం కొండచరియలు విరిగిపడడంతో ఈ ప్రమాదం జరిగింది. మరణించిన ఆరుగురిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఈ సంఘటనలో అనేక మంది గాయపడ్డారు.

Also Read: ''నెక్ట్స్‌ చంపేది నిన్నే''.. ఆ పార్టీ నేతకు ఫోన్‌ చేసి బెదిరించిన బిష్ణోయ్‌ గ్యాంగ్

కొండచరియలు, చెట్లు విరిగి వాహనాలపై పడడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలోని కులు సమీపంలో ఉన్న పర్యాటక ప్రాంతంలో ఆదివారం సాయంత్రం బలమైన గాలులు వీచాయి. అదే సమయంలో అటు నుంచి వెళుతున్న వాహనాలపై చెట్లు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద కొందరు స్థానికులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వారిని కాపాడేందుకు రెస్కూ బృందం సహాయక చర్యలు చేపట్టింది. మృతుల గుర్తింపు వివరాలపై ఇంకా స్పష్టత లేదని పోలీసులు పేర్కొన్నారు. వీరిని పర్యాటకులుగా గుర్తించినట్లు తెలిపారు. 

ఇది కూడా చూడండి: Ugadi: ఉగాది పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?

  కులులోని ADM అశ్వనీ కుమార్ ప్రకారం, ఈ సంఘటనపై పోలీసులు,జిల్లా పరిపాలన సహాయక బృందాలు వెంటనే స్పందించాయి. గాయపడిన వారిని చికిత్స కోసం జారిలోని స్థానిక కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. సమాచారం ప్రకారం, మృతుల్లో రోడ్డు పక్కన ఉన్న ఒక వ్యాపారి, ఒక కారు రైడర్ మరియు అక్కడికక్కడే ఉన్న ముగ్గురు పర్యాటకులు ఉన్నారు. జారి నుండి అగ్నిమాపక శాఖ బృందం కూడా ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకుంటోంది. మృతుల గుర్తింపులను పోలీసులు ఇంకా నిర్ధారించలేదు.

ఇది కూడా చూడండి: Ugadi: ఉగాది పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

Muda scam: MP, MLAల స్పెషల్‌ కోర్టులో ముడా స్కామ్‌పై ED పిటిషన్

ముడా స్కామ్‌లో లోకయుక్తా పోలీసులు కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు క్లీన్ చీట్ ఇవ్వడాన్ని ఈడీ MP, MLAల స్పెషల్‌ కోర్టులో సవాలు చేసింది. ప్రత్యేక ప్రజాప్రతినిధుల కోర్టులో 8 పేజీల పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ త్వరలోనే కోర్టు విచారించనుంది.

New Update
muda scam case

muda scam case Photograph: (muda scam case)

ముడా కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు షాక్ ఎదురైంది. మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ భూముల స్కామ్‌లో దర్యాప్తు చేసిన లోకాయుక్త పోలీసులు క్లీన్ చీట్ ఇచ్చారు. లోకాయుక్తా పోలీసుల ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్‌ను రద్దు చేయాలని ఈడీ ఎమ్మెల్యే, ఎంపీల కోర్టును ఆశ్రయించింది. ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో ఈడీ 8 పేజీల పిటిషన్ దాఖలు చేసింది. లోకాయుక్త నివేదికలో ఆయన నిర్దోషి అని తప్పుగా పేర్కొన్నారని వాదిస్తూ, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన కుటుంబంపై అనేక ఆరోపణలు చేసింది ED. ముడా కేసులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య , ఆయన భార్య పార్వతి, బావమరిది మల్లికార్జున స్వామి, ఇతరులపై పిటిషన్‌లో తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి.

Also read: Loan waiver: లివర్ రూ.90 వేలు, కిడ్నీ రూ.75వేలు.. అప్పు తీర్చలేక అవయవాలు అమ్మకోడానికి రైతు

ED పిటిషన్‌ను ప్రత్యేక ప్రజాప్రతినిధుల కోర్టు విచారిస్తోంది. లోకాయుక్త నివేదికను అంగీకరించాలా వద్దా అనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకోనుంది. కర్ణాటక హైకోర్టు గతంలో ED సమన్లను రద్దు చేసింది. కానీ ఇప్పుడు దర్యాప్తు కోసం ఒత్తిడి మళ్లీ పెరుగుతున్న విషయం తెలిసిందే. 2021లో మైసూరులోని విజయనగర ప్రాంతంలో 14 ప్లాట్లను ముడా సిద్ధరామయ్య భార్య పార్వతికి కేటాయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనికి ప్రతిస్పందనగా, కేసరే గ్రామంలో పార్వతి యాజమాన్యంలోని 3.16 ఎకరాల భూమిని ముడా స్వాధీనం చేసుకుందనే ఆరోపణపై ED దర్యాప్తు చేస్తోంది. ఈ కేసునే ముడా స్కామ్‌గా కొనసాగుతుంది. ఈడీ విచారణలో సిద్ధరామయ్య తప్పు చేశారని వెల్లడైంది.  కానీ 2025 ఫిబ్రవరిలో లోకయుక్త పోలీసులు ఆయన కుటుంబం నిర్థోషి అని క్లీన్ చీట్ ఇచ్చింది. ఈ విషయంపై ఈడీ ఎమ్మెల్యే, ఎంపీల స్పెషల్ కోర్టుకు వెళ్లింది.

Also read : Forbes Billionaires List 2025: 3లక్షల కోట్లు ఆమె సొంతం.. దేశంలో అత్యంత సంపన్నురాలు ఎవరో తెలుసా..?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు