Cyber Crime: సైబర్ క్రైమ్ లో రష్యా టాప్..భారత్ ఎన్నో స్థానంలో ఉందో తెలుసా?

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ క్రైమ్, సైబర్ నేరాలు, మోసాలపై సైబర్ క్రైమ్ నిపుణులు ఓ సర్వే నిర్వహించారు. సైబర్ నేరాల్లో రష్యా టాప్ లో ఉండగా.. భారత్ 10వ స్థానంలో ఉంది. క్రెడిట్ కార్డ్ దొంగతనంతో సహా 100 దేశాలు సైబర్ క్రైమ్ వివిధ వర్గాల ప్రకారం ర్యాంక్ చేసింది.

New Update
Cyber Crime: సైబర్ క్రైమ్ లో రష్యా టాప్..భారత్ ఎన్నో స్థానంలో ఉందో తెలుసా?

Cyber Crime: ప్రపంచవ్యాప్తంగా సైబర్ క్రైమ్ నిపుణులను సర్వే చేసిన పరిశోధన ప్రకారం సైబర్ నేరాల్లో రష్యా అగ్రస్థానంలో ఉంది. ఈ జాబితాలో భారత్ 10వ స్థానంలో ఉంది. పరిశోధకుల బృందం 'వరల్డ్ సైబర్ క్రైమ్ ఇండెక్స్'లో ఈ విషయాన్ని పేర్కొంది. దాదాపు 100 దేశాలు ransomware, క్రెడిట్ కార్డ్ దొంగతనంతో సహా వివిధ రకాల సైబర్ నేరాల ప్రకారం ర్యాంక్ చేసినట్లు పేర్కొంది. ఈ జాబితాలో ఉక్రెయిన్ రెండో స్థానంలో ఉంది. చైనా మూడో స్థానంలో ఉంది. దీని తరువాత అమెరికా, నైజీరియా, రొమేనియా ఉన్నాయి. PLOS వన్ జర్నల్‌లో ప్రచురించిన పరిశోధన ప్రకారం, ఉత్తర కొరియా ఏడవ స్థానంలో, బ్రిటన్ ఎనిమిదో స్థానంలో, బ్రెజిల్ తొమ్మిదో స్థానంలో ఉన్నాయి.

సర్వే ద్వారా, వర్చువల్ ప్రపంచంలో జరుగుతున్న నేరాల పరంగా వివిధ దేశాల గురించి నిపుణుల అభిప్రాయాన్ని పరిశోధకులు తీసుకున్నారు. దీని ఆధారంగా ఈ ర్యాంకింగ్‌ను విడుదల చేసింది.ransomware, హ్యాకింగ్, క్రెడిట్ కార్డ్‌లతో సహా డేటా దొంగతనం, అడ్వాన్స్ ఫీజు మోసం, మనీ లాండరింగ్ వంటి దోపిడీ వంటి సైబర్ నేరాల ప్రధాన వర్గాలు గుర్తించాయి. ఒక్కో సైబర్ క్రైమ్ కేటగిరీ కింద టాప్ టెన్ దేశాల్లో మొదటి 6 దేశాలు ఒక మోస్తారు స్థాయి సైబర్ క్రైమ్ రకాల్లో ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తుండగా... మిగతా దేశాలు మాత్రం అటు హైటెక్, ఇటు లోటెక్ నేరాల్లోను దూకుడుగా వ్యవహరిస్తున్నాయి.

ఇక భారత్ లో కూడా సైబర్ నేరాలు జరుగుతున్నాయి. మన దేశం సమతుల్య హబ్ గా ఉన్నట్లు సర్వేలో తేలింది. ఇక్కడ ఓ మోస్తారు స్థాయి సాంకేతిక నేరాలు చోటు చేసుకున్నట్లు సర్వేలో పేర్కొన్నారు. రొమేనియా ,యూకే లో మాత్రం హైటెక్, లోటెక్ నేరాలు జరుగుతున్నట్లు సర్వే వెల్లడించింది.

ఇది కూడా చదవండి: ఇన్ స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్..అలాంటి ఫొటోలు పంపితే బ్లర్ అవుతాయి.!

Advertisment
Advertisment
తాజా కథనాలు