NASA Jobs : నాసాలో ఉద్యోగం కావాలా? చదువు అవసరం లేదు..ఈ ఒక్క పని వస్తే చాలు..!!

అమెరికన్ అంతరిక్ష సంస్థ నాసా చదువుతో సంబంధం లేకుండా మార్స్ పై ఏడాది పాటు ఉద్యోగం చేసేందుకు దరఖాస్తు కోరుతుంది. అంగారక గ్రహంపైకి వెళ్తే అక్కడేం చేస్తామో దాన్ని భూమిపైన్నే చేస్తున్నట్లు నటించాలి. ఇలాంటి నలుగురి కోసం నాసా వెతుకుతోంది. జీతం కూడా భారీగానే చెల్లిస్తుందట.

New Update
NASA Jobs : నాసాలో ఉద్యోగం కావాలా? చదువు అవసరం లేదు..ఈ ఒక్క పని వస్తే చాలు..!!

NASA Jobs : అనేక దశాబ్దాలుగా అంతరిక్ష శాస్త్రంలో ప్రపంచం గొప్ప పురోగతి సాధించింది. వేల సంఖ్యలో ఉపగ్రహాలను ప్రయోగించి, చంద్రునిపై మానవులను దింపారు. అంతేకాదు ఇప్పుడు అంగారకుడిపై జీవరాశిని అన్వేషిస్తున్నారు. ఈ విషయంలో ఇంకో అడుగు ముందుకేసిన భారత్(India) సూర్యుని గురించి పరిశోధనలు చేయడం ప్రారంభించిది. ఇందులో భారత అంతరిక్ష సంస్థ ఇస్రో(India), అమెరికా ఏజెన్సీ నాసా(America Agency NASA) ఎన్నో విజయాలను తమ ఖాతాలో వేసుకున్నాయి. ఇప్పుడు అంగారకుడిపైకి వెళ్లేందుకు సిద్ధమవుతున్న నాసా..అందరూ ఆశ్చర్యపోయే ఓ విశిష్టమైన పనిని తెరపైకి తెచ్చింది.నాసాలో పనిచేసేందుకు నలుగురు ఉద్యోగుల కోసం వెతుకుతుంది. ఈ ఉద్యోగం ఎవరికి దక్కుతుందో వారికి భారీ జీతాన్ని కూడా చెల్లిస్తుందట.

పలు నివేదికల ప్రకారం.. నాసా అంగారక గ్రహం(Mars)పై ఇళ్లను నిర్మించాలని ప్లాన్ చేస్తోంది. అంగారకుడిపై వెళ్లి ఇళ్లు కడితే.. అక్కడి వాతావరణానికి ప్రజలు ఎలా అలవాటు పడతారు..వారి ఆహారం నుంచి రాత్రి పడుకునేంత వరకు ఎలా ఉంటుందో తెలుసుకోవానుకుంటుంది. అయితే దీన్ని తెలుసుకునేందుకు అంగారకుడి మీదకి వెళ్లాల్సిన అవసరం లేదు. భూమిపైనే అంగారకుడి మాదిరి సెట్ తయారు చేసి అక్కడ ఇల్లును నిర్మిస్తున్నారు. ఈ ఇంట్లో అంగారక గ్రహం మీద ఎలాంటి వాతావరణం ఉంటుందో అచ్చం అలాగే ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఇంటికి 'సిమ్యులేటెడ్ మార్స్ హాబిటాట్' అని పేరు పెట్టారు.

అయితే టెస్ట్ చేసేందుకు ఆ ఇంట్లో కొంతమందిని ఉంచాలని నాసా ప్లాన్ చేస్తోంది. ఇందులో సెలక్ట్ అయినవారికి భారీగానే జీతాన్ని కూడా ప్రకటించింది. 1700 చదరపు అడుగులున్న సిమ్యులేషన్ హౌస్‌లో 4 మంది నివసించవచ్చని నాసా తెలిపింది. ఈ ఇంట్లో ఉండడంతో పాటు..స్పేస్ వాక్‌కి వెళ్లే అవకాశం లభిస్తుంది. ఇది కాకుండా, ఇండోర్ మార్టిన్ వాతావరణంలో పంటలను పండించాల్సి ఉంటుంది. రోబోటిక్స్‌(Robotics) తో పని చేయాల్సి ఉంటుంది. ఈ మిషన్‌కు క్రూ హెల్త్ అండ్ పెర్ఫార్మెన్స్ ఎక్స్‌ప్లోరేషన్ అనలాగ్ అని పేరు పెట్టారు.

ఈ ఉద్యోగానికి ఎవరు అర్హులు?
ఈ మిషన్ వచ్చే ఏడాది అంటే 2025లో ప్రారంభమవుతుందని నాసా(NASA) తెలిపింది. ఇందుకోసం ఏప్రిల్ 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 30 నుండి 55 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థి తప్పనిసరిగా అమెరికన్ పౌరుడు లేదా అమెరికాలో శాశ్వత నివాసి అయి ఉండాలి. అతనికి ఇంగ్లీషు తెలిసి ఉండాలి. ఆల్కహాల్, ధూమపానం చేయకూడదు.

ఇది కూడా చదవండి : సమంత వర్క్ ఔట్స్.. ఆ సినిమా కోసమే.. వైరలవుతున్న పోస్ట్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

All India Civil Services ఇప్పటివరకు ఫోన్ వాడలేదు.. ఆల్ ఇండియా సివిల్స్ లో తెలంగాణ అమ్మాయికి 11వ ర్యాంకు

వరంగల్ కి చెందిన సాయి శివాని అనే విద్యార్థిని ఆల్ ఇండియా సివిల్స్ లో 11వ ర్యాంకు సాధించి సత్తాచాటింది. రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది. ఇటీవలే తెలంగాణ గ్రూప్ 1 ఫలితాల్లోనూ సాయిశివాని రాష్ట్రస్థాయిలో 21వ ర్యాంకు, జోనల్ 1లో 11వ ర్యాంకు సాధించింది.

New Update

All India Civil Services సాధారణంగా చాలామంది సివిల్స్ క్లియర్ చాలా కష్టమని భావిస్తారు. కానీ కస్టపడి చదివితే సాధ్యం కానిది ఏదీ ఉండదు అని మరో సారి నిరూపించింది ఈ అమ్మాయి. తెలుగు తేజం సాయిశివాని ఆల్ ఇండియా సివిల్స్ లో 11వ ర్యాంకు సాధించి సత్తాచాటింది. రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది. 

Also Read: Viral News: ఫోన్ తీసుకుందని.. టీచర్‌ను చెప్పుతో కొట్టి, ల*జే అంటూ దాడిచేసిన విద్యార్థిని: (వీడియో)

సివిల్స్ లో ఆల్ ఇండియా 11వ ర్యాంకు 

వరంగల్ కి చెందిన సాయి శివాని ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది. కడప జిల్లా ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీలో బీటెక్ పూర్తిచేసిన సాయి శివాని.. ఆ తర్వాత సివిల్స్ కోసం ప్రిపేర్ అవడం మొదలు పెట్టింది. కలెక్టర్  కలతో అహర్నిశలు కష్టపడింది. ప్రణాళికతో రోజుకు 12 గంటలు చదివింది. మొదటి సారి విఫలమైనా.. నిరాశ చెందలేదు. మళ్ళీ కష్టపడి చదివింది. రెండో ప్రయత్నంలో ఆల్ ఇండియా స్థాయిలో  11వ ర్యాంకు సాధించి సత్తాచాటింది. రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది.  2023లో ఐదు మార్కులతో సాయిశివాని ప్రిలిమ్స్ మిస్సయింది. తిరిగి 2025లో తన కల నెరవేర్చుకుంది. 

Also Read: Pahalgam Attack: పహల్గాంలో నా బర్త్ డే వేడుకలు, షూటింగ్ కూడా.. విజయ్ దేవరకొండ సంచలన ట్వీట్!

ఈ సందర్భంగా సాయిశివాని మాట్లాడుతూ.. ఇంతవరకు ఫోన్ వాడకపోవడం.. సోషల్ మీడియాకు దూరంగా ఉండడమే తన కల నెరవేరడానికి కారణమని తెలిపింది. కలెక్టర్ కావాలనే లక్ష్యంతో కఠోర సాధన చేశాను. రోజుకు 12 గంటలు చదివాను. ఒత్తిడిని జయించడానికి యోగా, భగవద్గీత చదివేదాన్ని. ఈ విజయంలో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సహకారం మరువలేనిది అని చెప్పింది. 

latest-news

Also Read: AP 10th Result: ఏపీ టెన్త్ ఫలితాల్లో అరుదైన రికార్డ్.. 600 కు 600 మార్కులు!

Also Read: Viral Video అందరి ముందు భుజం పై నుంచి విజయ్ చేయి తీసేసిన విద్యార్ధి.. ఏం జరిగిందంటే

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు