Murder Case : వీడని మిస్టరీ.. ఇంటర్ విద్యార్థి వాహీద్ను చంపిందెవరు? ఏపీ ఆత్మకూరుకు చెందిన ఇంటర్ విద్యార్థి వాహీద్ మర్డర్ కేసు మిస్టరీ కొనసాగుతూనే ఉంది. లవ్ ఇష్యూలో బాలిక పేరెంట్స్ కిడ్నాప్ చేయించి చంపించారని వాహీద్ పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. తమకు సంబంధం లేదని బాలిక కుటుంబం చెబుతోంది. పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. By srinivas 16 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Waheed Murder Case : ఏపీ (AP) లోని నంద్యాల జిల్లా (Nandyala District) ఆత్మకూరుకు చెందిన ఇంటర్ విద్యార్థి (Inter Student) వాహీద్ మర్డర్ కేసు కీలక మలుపులు తిరుగుతోంది. గత మూడు రోజుల క్రితం కాలేజీకి వెళ్లిన వాహీదును లవ్ ఇష్యూలోనే ఓ నలుగురు యువకులు కిడ్నాప్ చేసి కొట్టి చంపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో వాహీద్ తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసుల విచారణలో మరో రెండు కొత్త కోణాలు బయటపడ్డాయి. వహీద్ ఆచూకికోసం గాలిస్తున్న పోలీసులు ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని ఆరాతీస్తున్న క్రమంలోనే అనూహ్యంగా ఆత్మకూరుశివారులో ఓ భావి దగ్గర వాహీద్ డెడ్ బాడీ దొరికింది. దీంతో యువకుడిని కిడ్నాప్ (Kidnap) చేసినా వ్యక్తులే చంపేశారంటూ పేరెంట్స్ కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ క్రమంలోనే వాహీద్ ప్రేమ వ్యవహారం కూడా బయటపడటంతో అమ్మాయి పేరెంట్స్ తమ కొడుకును కిడ్నాప్ చేయించి చంపించారని ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై స్పందించిన సదరు బాలిక తల్లిదండ్రులు.. వాహీదును మందలించి నాలుగు దెబ్బలు కొట్టి వదిలేసింది నిజమే. కానీ తాము చంపలేదని వాదిస్తున్నారు. మరోవైపు ఆ యువకులు కిడ్నాప్ చేసి కొట్టారనే అవమానంతో తీవ్ర మనస్థాపానికి గురై వాహాద్ సూసైడ్ చేసుకున్నాడంటూ మృతుడి బంధువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజుకో మలుపు తిరుగుతున్న ఈ కేసు పోలీసులకు సవాల్ గా మారగా.. త్వరలోనే అసలైన నిందుతులను పట్టుకుంటామని పోలీస్ అధికారులు చెబుతున్నారు. Also Read : సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు #murder-case #love-issue #ap-nandyal #inter-student-waheed సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి