Namrata: 'ఇకపై కుటుంబానికి దూరంగా..' నమత్ర ఎమోషనల్ పోస్ట్.!

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు భార్య నమత్ర ఇన్ స్టాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం కొడుకు గౌతమ్ ఘట్టమనేని ఇకపై కుటుంబానికి దూరంగా ఉండబోతున్నాడని తెలిపారు. న్యూయార్క్ యూనివర్సిటీలో చేరేందుకు వెళుతున్న కొడుకు ఫొటోను షేర్ చేశారు.

New Update
Namrata: 'ఇకపై కుటుంబానికి దూరంగా..' నమత్ర ఎమోషనల్ పోస్ట్.!

Namrata Emotional Post : టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు(Mahesh Babu) కొడుకు గౌతమ్ ఘట్టమనేని(Gautham) ఉన్నత విద్యా కోసం విదేశాలకు వెళ్లుతున్నాడు. దీంతో, కొడుకు గురించి సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు మహేశ్ భార్య నమ్రత. గౌతమ్ ఇకపై కుటుంబానికి దూరంగా ఉండబోతున్నాడని తెలిపారు.

publive-image

న్యూయార్ యూనివర్సిటిలో చేరేందుకు వెళ్లుతున్న కొడుకు ఫొటోను షేర్ చేస్తూ..కొత్త అధ్యాయం ప్రారంభించబోతున్నందుకు గౌతమ్ కు శుభాకాంక్షలు తెలిపారు.' నీ హార్డ్ వర్క్, ఫ్యాషన్, సంకల్పం చూస్తుంటే నాకు గర్వంగా ఉందని. నువ్వు మరింత ఎత్తుకు ఎదగాలి' అంటూ కామెంట్ చేశారు.


దీంతో, నమ్రత చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. గౌతమ్ ఏం చదవబోతున్నాడు అని కొందరు.. ఆల్ ది బెస్ట్ అని మరికొందరూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు త్వరగా స్టడీస్ కంప్లీట్ చేసుకుని హీరోగా ఎంట్రీ ఇవ్వాలని రకరకాలుగా పోస్టులు పెడుతున్నారు.

publive-image

కాగా, గౌతమ్ లండన్ లో ప్లస్ 2 పూర్తి చేసి ఉన్నత విద్యా కోసం న్యూయార్క కు వెళ్లాడు. అయితే, మహేశ్ బాబు ఫ్యాన్స్ మాత్రం గౌతమ్ ను ఎప్పుడెప్పుడు హీరోగా చుద్దామా? అని ఎదురు చూస్తున్నారు.

publive-image

కానీ, గౌతమ్ కు మాత్రం సినిమాలపై ఆసక్తి లేదనే టాక్ వినిపిస్తోంది. మహేశ్ బాబు కూతురు సితార మాత్రం పీఎంజే జ్యుయెలర్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారి ఇప్పటికే సెలబ్రెటి అయింది.

Also Read: బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పై కేసు.. అరెస్టు తప్పదా..?

#mahesh-babu #namrata-sirodkar
Advertisment
Advertisment
తాజా కథనాలు