Rape: ఏడేళ్ల బాలికపై అత్యాచారం.. నాంపల్లి కోర్టు సంచలన తీర్పు! ఏడేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన కేసులో నాంపల్లి 12వ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడు గాలి తరుణ్ కు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.5 వేల రూపాయల జరిమానా విధిస్తూ జడ్జి అనిత బుధవారం తీర్పును వెలువరించారు. By srinivas 20 Mar 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి Hyderabad: ఏడేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.5 వేల రూపాయల జరిమానా విధిస్తూ 12వ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి అనిత బుధవారం తీర్పును వెలువరించారు. బాధితురాలికి రూ.4 లక్షల ఆర్థిక సాయం అంద చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఇంట్లో టీవీ చూస్తుండగా.. ఇక ఈ కేసు పూర్తి వివరాల్లోకి వెళితే.. 2021 నవంబర్ 21న సైఫాబాద్ పోలీస్టేషన్ పరిధిలో నివాసముంటున్న 7 ఏళ్ల బాలిక తన ఇంటి ఓనర్ ఇంట్లో టీవీ చూస్తుండగా పక్కన ఉండే గాలి తరుణ్ (20) మ్యాజిక్ చూపిస్తానని బాలికను అతని ఇంటికి తీసుకెళ్లాడు. బలవంతంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అదే సమయంలో ఇంటి యజమాని కుమారుడు రాకేశ్ గమనించి బాలికను రక్షించాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో సైఫాబాద్ ఏసీపీ వేణుగోపాల్ రెడ్డి కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టుకు ఛార్జిషీట్ సమర్పించగా.. బుధవారం ఈ కేసును విచారించిన న్యాయస్థానం తీర్పును వెలువరించింది. #7-year-old-girl #rape-case #nampally-court సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి