Nagar Kurnool: సీరియల్ కిల్లర్ సత్యం అరెస్ట్.. తీర్థం పేరుతో నోట్లో యాసిడ్ పోసి..?

తాంత్రిక పూజల పేరుతో వరుస హత్యలు చేసిన కిల్లర్ సత్యం అరెస్ట్ అయ్యాడు. 11 మందిని బలితీసుకున్నాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గుప్త నిధుల పేరుతో మోసాలు, తీర్థం పేరుతో నోట్లో యాసిడ్ పోసి హత్య చేసినట్లు తెలుస్తోంది.

New Update
Nagar Kurnool: సీరియల్ కిల్లర్ సత్యం అరెస్ట్.. తీర్థం పేరుతో నోట్లో యాసిడ్ పోసి..?

Nagar Kurnool: తాంత్రిక పూజల పేరుతో వరుస హత్యలు చేసిన సీరియల్ కిల్లర్ సత్యం అరెస్ట్ అయ్యాడు. నాగర్‌ కర్నూల్‌ జిల్లా కేంద్రానికి చెందిన రామెట్టి సత్యనారాయణ యాదవ్‌ కొన్నేళ్లుగా తనకు మంత్రాలు, మాయలు తెలుసునంటూ అమాయక వ్యక్తులను నమ్మిస్తూ మోసాలకు పాల్పడ్డాడు. తన మంత్రశక్తితో గుప్తనిధులను వెలికితీస్తానని, కుటుంబ కలహాలు, సమస్యలను పరిష్కరిస్తానంటూ తనకు పరిచయం అయిన వారిని నమ్మించి వాడు. ఈ క్రమంలో వారి పేరిట ఉన్న భూములు, ఇతర ఆస్తిపాస్తులను తన పేరిట, అనుయాయుల పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటాడు. ఎవరైనా తిరగబడి ప్రశ్నించితే వారిని అతి దారుణంగా హత్య చేసేవాడు. ఇలా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఓ కుటుంబంలోని నలుగురికి విషమిచ్చి చంపాడని. తీర్థం పేరుతో నోట్లో యాసిడ్ పోసి హత్యలు చేసేవాడని తెలుస్తోంది.

Also Read: రాజీనామాలపై అలర్ట్ అయిన వైసీపీ..దేవన్ రెడ్డి వెనక్కి తగ్గినట్టేనా?

పోలీసుల విచారణలో భాగంగా నిందితుడు సత్యనారాయణ యాదవ్‌ ఇప్పటివరకు 11 మంది అమాయకులను హత్య చేసినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది.  తెలంగాణ, ఏపీ, కర్ణాటకలో సత్యం ఇప్పటివరకు 8కేసుల్లో నిందితుడుగా ఉన్నాడని సమాచారం. హైదరాబాద్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణలో భాగంగా సత్యనారాయణ యాదవ్‌ బాగోతం బయటకు వచ్చినట్టు తెలుస్తోంది.  నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎక్కడెక్కడ ఎవరెవరిని మోసం చేశాడని వివరాలు తెలుసుకన్నారు.

Also Read: హైదరాబాద్ తో పాటు ముగ్గురు సీపీలు ఔట్.. లా అండ్ ఆర్డర్‌లో రేవంత్ మార్క్!

Advertisment
Advertisment
తాజా కథనాలు