Nagababu : పవన్ నిర్ణయమే ఫైనల్.. గీత దాటితే వేటే: నాగబాబు వార్నింగ్

జనసేన పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ దే అంతిమ నిర్ణయం అన్నారు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు. పవన్ నిర్ణయం కాదని ఎవరైనా గీత దాటితే వేటు తప్పదని హెచ్చరించారు.

New Update
Naga Babu: జగన్ శవ రాజకీయాల్లో ఆరితేరారు.. నాగబాబు ఘాటు విమర్శలు

Nagababu : జనసేన పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ దే అంతిమ నిర్ణయం అన్నారు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు. పవన్ నిర్ణయం కాదని ఎవరైనా గీత దాటితే వేటు తప్పదని హెచ్చరించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో పార్టీ ప్రధాన కార్యవర్గంతో చర్చించిన అనంతరం పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయానికి వస్తారని తెలిపారు. అనే విషయం అందరూ అర్థం చేసుకోవాలని సూచించారు.జనసేన అధ్యక్షులు ఒకసారి నిర్ణయం తీసుకున్న తరవాత అందుకు విరుద్ధంగా బహిరంగ వేదికలు, మీడియా, సామాజిక మాధ్యమాలలో మాట్లాడితే అది పార్టీ వ్యతిరేక చర్యగా పరిగణించాల్సి వస్తుందంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇటువంటి అంశాలపై పార్టీ కాన్ ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ విభాగం బాధ్యులతో చర్చించి, సంబంధిత వ్యక్తులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు నాగబాబు.

ఇది కూడా చదవండి: కుటుంబంతో కలిసి తిరుమలకు రామ్ చరణ్..!

Advertisment
Advertisment
తాజా కథనాలు