MS DHONI: ధోనీ డీజిల్ ఇంజన్ లాంటివాడు..ఏబీ డివిలయర్స్!

భారత మాజీ కెప్టెన్ మహీంద్ర సింగ్  ధోనీ డీజిల్ ఇంజన్ లాంటివాడని, అది ఎప్పటికీ ఆగదని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ కొనియాడారు.

New Update
MS DHONI: ధోనీ డీజిల్ ఇంజన్ లాంటివాడు..ఏబీ డివిలయర్స్!

IPL 2024: భారత మాజీ కెప్టెన్ మహీంద్ర సింగ్  ధోనీ డీజిల్ ఇంజన్ లాంటివాడని, అది ఎప్పటికీ ఆగదని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ అభివర్ణించారు.

భారత్ క్రికెట్ కు ఇప్పటి వరకు నాలుగు వరల్డ్  కప్పులు అందించిన సారథిగా ఎంఎస్ ధోనీ నిలిచాడు. క్రికెట్ లో ధోనీ అరంగ్రేటం చేసిన తర్వాత ఒక నవశకాన్ని తీసుకువచ్చాడు. మాజీ లు బ్యాటింగ్ ఆడుతున్నప్పటికి ఫీల్టింగ్ లో వీక్ గా ఉన్నారని చాలా మంది మాజీలను అతను టీం నుంచి తప్పించాడు. జట్టులో అవకాశం కావాలంటే ఫీల్డింగ్ లో చురుకుగా ఉన్నవారికి  జట్టులో అవకాశం ఉంటుందని యువ క్రికెటర్లకు  తెలియజేశాడు.కురాళ్లకు అవకాశాలు ఇస్తూ స్వదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా తన మార్క్ ను చూపించి టీమిండియా కు అనేక విజయాలను అందించాడు.

2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి చెన్నై సూపర్ కింగ్స్ కు ఇప్పటి వరకు ధోనీ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇప్పటి వరకు జట్టును 5 సార్లు విజేతలుగా నిలిపాడు. 2019 వరల్డ్ కప్ ఓటమి తర్వాత ధోనీ క్రికెట్ కు వీడ్కోలు పలికారు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం జరిగే ఐపీఎల్ లో ధోనీ ఆడుతూ తన అభిమానులను అలరిస్తూ వస్తున్నారు. కాని కొన్నిసీజన్లకు ముందే తాను ఐపీఎల్ కు రిటైడ్ మెంట్ ప్రకటిస్తున్నట్టు చెప్పుకొచ్చాడు.ఐపీఎల్ 2024కి ఫిట్‌గా ఉండేందుకు ఎంఎస్ ధోనీ మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. శస్త్ర చికత్స అనంతరం ఐపీఎల్ లో ధోనీ భవిష్యత్తుపై ఊహాగానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది.మార్చి 22 నుంచి ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ధోనీ నాయకత్వం వహించనున్నాడు.

దక్షిణాఫ్రికా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ బ్యాట్స్‌మెన్ ఎ.బి. డివిలియర్స్ ధోనీ నీ ప్రశంసించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ధోనీ ని డీజిల్ ఇంజిన్‌తో పోల్చాడు. ప్రముఖ టీ20 లీగ్ ఐపీఎల్ లో  42 ఏళ్ల వయసులో కెప్టెన్ గా అద్భుతంగా     రాణిస్తున్నాడని ఏబీడీ కొనియాడారు.

ఇదే అతని చివరి సీజన్ అవుతుందా? ఎవ్వరికి తెలియదు. అతను ఈ డీజిల్‌లాగా ఎప్పటికీ అయిపోడు. అతను పరుగు కొనసాగిస్తున్నాడు. " అద్భుతమైన ఆటగాడు, ఎంత అద్భుతమైన కెప్టెన్," అని ఏబీడీ అన్నారు.

.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

CSK VS LSG: ఎట్టకేలకు చైన్నైను వరించిన విజయం..దగ్గరుండి గెలిపించిన కెప్టెన్ మహీ

హమ్మయ్య పాయింట్ల పట్టికలో అట్టుగ ఉండి విజయం కోసం తపిస్తున్న జట్టును కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ విజయతీరాలకు నడిపించాడు. చివర్లో వరుసగా ఫోర్లు, సిక్స్ లు కొడుతూ మ్యాచ్ గెలిచేలా చేశాడు. ఐదు వరుస ఓటముల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ ఈరోజు ఎల్ఎస్జీ మీద గెలిచింది.

author-image
By Manogna alamuru
New Update
ipl

CSK VS LSG

గెలిచింది...గెలిచింది...చెన్నై సూపర్ కింగ్స్ మొత్తానికి మ్యాచ్ గెలిచింది.  పేలవమైన ప్రదర్శనతో అందరినీ నిరాశకు గురి చేస్తున్న సీఎస్క్ కు ఈరోజు మంచి విజయం దక్కింది. లక్నో సూపర్ జెయింట్స్ మీద 5 వికెట్ల తేడాతో చెన్నై గెలిచింది. వరుసగా ఐదు ఓటములను మూట గట్టకున్న సీఎస్కో ఎట్టకేలకు కాస్త ఊపిరి పీల్చుకుంది. స్వయంగా కెప్టెన్ ధోనీనే మ్యాచ్ ను గెలిపించడం ఈ మ్యాచ్ లో మరొక విషయం. ముందు బ్యాటింగ్ చేసిన ఎల్ఎస్జీ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని 19.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. చెన్నై బ్యాటర్లలో శివమ్‌ దూబె (43*), రచిన్‌ రవీంద్ర (37), షేక్‌ రషీద్‌ (27), ధోనీ (26*) రాణించారు. లఖ్‌నవూ బౌలర్లలో రవి బిష్ణోయ్‌ 2, అవేశ్‌ ఖాన్‌, మార్‌క్రమ్‌, దిగ్వేశ్‌ ఒక్కో వికెట్‌ తీశారు.  

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగి..

ఈరోజు మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన లక్నో నిర్దేశించిన 20 ఓవర్లలో లక్నో జట్టు 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రిషభ్ పంత్ చెలరేగిపోయాడు. 49 బంతుల్లో 63 పరుగులు సాధించి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఓపెనర్లుగా క్రీజ్‌లోకి వచ్చిన మార్క్‌రమ్, నికోలస్ పూరన్ మొదటి నుంచి దూకుడుగా ఆడారు. కానీ ఇద్దరూ ఎక్కువ సమయం క్రీజ్‌లో నిలవలేకపోయారు. తొలి ఓవర్‌ ముగిసేసరికి లక్నో 1 వికెట్ నష్టానికి 6 పరుగులు చేసింది. 

చెలరేగిన పంత్..

ఆ తర్వాత క్రీజ్‌లోకి మిచెల్ మార్ష్ వచ్చాడు. అక్కడనుంచి మార్ష్, పూరన్ భారీ షాట్లు ఆడుతూ పరుగులు రాబట్టారు. కానీ పూరన్ దూకుడు తక్కువ సమయానికే పరిమితం అయింది. నికోలస్ పూరన్ (8) పరుగులకే ఔట్ అయ్యాడు. దీంతో లఖ్‌నవూ రెండో వికెట్ కోల్పోయింది. అన్షుల్ కాంబోజ్ వేసిన నాలుగో ఓవర్‌లో చివరి బంతికి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత మిచెల్ మార్ష్‌ దూకుడుగా ఆడుతూ పరుగులు రాబట్టాడు.  దీంతో లక్నో జట్టు 5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 34 పరుగులు సాధించింది. ఇక పంత్, మార్ష్‌ నిలకడగా ఆడుతున్న సమయంలో మరో బిగ్ షాక్ తగిలింది. మార్ష్‌ (30) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో లక్నో జట్టు 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 78 పరుగులు సాధించింది. ఆ తర్వాత పంత్ చెలరేగిపోయాడు. వరుస ఫోర్లు, సిక్సర్లతో దుమ్ము దులిపేశాడు. 49 బంతుల్లో 63 పరుగులు రాబట్టాడు. అలాగే బడోని 17 బంతుల్లో 22 పరుగులు, అబ్దుల్ సమద్ 11 బంతుల్లో 20 పరుగులు చేశారు. ఇలా మొత్తంగా 20 ఓవర్లలో 166 పరుగులు రాబట్టారు.  
 

today-latest-news-in-telugu | IPL 2025 | csk-vs-lsg 

Also Read: Waqf Act Protest: బెంగాల్ చల్లబడటం లేదు..మళ్ళీ నిరసనలు, పోలీస్ వాహనానికి మంటలు..

Advertisment
Advertisment
Advertisment