MP Elections: ఎంపీ ఎన్నికల్లో తెలంగాణలో ఆ పార్టీదే జోరు.. ఇండియా టుడే సర్వే

లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని ఇండియా టుడే 'మూడ్ ఆఫ్ ది నేషన్' సర్వే అంచనా వేసింది. ఇప్పుడు ఎన్నికలు జరిగితే 10 స్థానాలు కాంగ్రెస్, మూడు స్థానాలు బీఆర్ఎస్, మూడు స్థానాలు బీజేపీ, ఒక స్థానం ఎంఐఎం పార్టీలు కైవసం చేసుకుంటాయని అంచనా వేసింది.

New Update
MP Elections: ఎంపీ ఎన్నికల్లో తెలంగాణలో ఆ పార్టీదే జోరు.. ఇండియా టుడే సర్వే

Mood Of The Nation Telangana: ఎన్నికల సర్వేలు మళ్లీ మొదలైయ్యాయి. ఇండియా టుడే సంస్థ (INDIA TODAY) 'మూడ్ ఆఫ్ ది నేషన్' సర్వే (Mood Of The Nation) దేశవ్యాప్తంగా నిర్వహించింది. దేశవ్యాప్తంగా చేపట్టిన ఈ సర్వ్ లో రాబోయే లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని అంచనా వేసింది. తాజాగా తెలంగాణలో ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి అత్యధిక సీట్లను కైవసం చేసుకుంటుందో తెలిపింది.

Also Read: రోజా పెట్టిన చేపల పులుసు తిని.. కేసీఆర్‌పై సీఎం రేవంత్ చురకలు

హస్తానికి హ్యాట్రిక్..

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ (Congress) అదే ఉత్సాహాన్ని త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో కొనసాగించాలని యోచిస్తోంది. ఈ క్రమంలో గెలిచే గుర్రాలకే టికెట్లు కేటాయించాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా ఇండియా టుడే సంస్థ లోక్ సభ ఎన్నికలపై తెలంగాణలో నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో మొత్తం 17 స్థానాల్లో 10 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని పేర్కొంది. కాంగ్రెస్‌కు 41.2 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది. ఇదే జరిగితే.. జాతీయ రాజకీయాల్లో ఇండియా కూటమికి బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి.

కారు, కమలానికి చేరి మూడు

తెలంగాణను పదేళ్లు పాలించిన గత టీఅర్ఎస్ ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీకి (BRS) ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు షాక్ ఇచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఏమైనా లోక్ సభ ఎన్నికల్లో 16 స్థానాల్లో గులాబీ జెండా ఎగురవేయాలని భావిస్తోన్న బీఆర్ఎస్ పార్టీకి.. అలాగే అన్ని స్థానాల్లో కాషాయ జెండా ఎగవేయాలని భావిస్తోన్న బీజేపీకి (BJP) ఇండియా టుడే 'మూడ్ ఆఫ్ ది నేషన్' సర్వే మరో షాక్ ఇచ్చింది. ఇప్పుడు ఎంపీ ఎన్నికలు జరిగితే తెలంగాణలో బీఆర్ఎస్ మూడు స్థానాల్లో, బీజేపీ కూడా మూడు స్థానాల్లో విజయం సాధిస్తాయని అంచనా వేసింది. ఇక ఎంఐఎం ఒక స్థానానికే పరిమితం అవనున్నట్లు వెల్లడించింది.

ఇక ఏపీలో.. ఫ్యాన్ గాలి తగ్గింది..

లోక్ సభ ఎన్నికల్లో ఏపీలో సీఎం జగన్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందని ఇండియా టుడే చేపట్టిన సర్వే నివేదికలు చెబుతున్నాయి. ఏపీలో మొత్తం 25 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఒకవేళ ఇప్పుడే లోక్ సభ ఎన్నికలు జరిగితే టీడీపీకి 17 సీట్లు, వైసీపీకి 8 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అలాగే ఏపీ కాంగ్రెస్ పార్టీకి వోట్ షేర్ పెరుగనున్నట్లు తెలిపింది. బీజేపీకి మాత్రం వోట్ షేర్ గత లోక్ సభ ఎన్నికలతో పోలిస్తే ఏం పెరగదు అని అంచనా వేసింది.

ఇది కేవలం సర్వే మాత్రమే.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో ఎంపీ ఎన్నికల ఫలితాల రోజున తెలుసుకుందాం.. ఈ సర్వేలు నమ్మి బెట్టింగ్ లు పెట్టి మీ కుటుంబాలను రోడ్లపైకి తీసుకరాకండి

                                                                                    - RTV యాజమాన్యం

DO WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు