National: నెహ్రూ తర్వాత ఆ ఘనత మోడీకే దక్కింది.. ఈటల రాజేందర్!

మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్న నరేంద్ర మోడీపై ఈటల రాజేందర్ ప్రశంసలు కురిపించారు. నెహ్రూ తర్వాత వరుసగా 3వ సారి ప్రధాని పదవి చేపట్టే ఘనత మోడీకే దక్కిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ అన్నారు.

New Update
National: నెహ్రూ తర్వాత ఆ ఘనత మోడీకే దక్కింది.. ఈటల రాజేందర్!

Etala Rajender: మూడోసారి మోడీ ప్రధాని కాబోతున్న సందర్భంగా బీజేపీ నాయకుడు, మల్కాజ్ గిరి ఎంపీగా గెలుపొందిన ఈటల రాజేందర్ శుభాకాంక్షలు తెలిపాడు. పార్లమెంట్ ఫలితాలపై మీడియాతో మాట్లాడిన ఈటల.. నెహ్రూ తర్వాత మూడోసారి ప్రధాని కాబోతున్న మోడీపై ప్రశంసలు కురిపించారు. తెలంగాణలో బీజేపీ బలం భారీగా పెరిగింది. మొత్తంగా రాష్ట్రంలో బీజేపీ ఓటు బ్యాంకు 35 శాతానికి పెరిగింది. సీఎం రేవంత్ రెడ్డి సిట్టింగ్ సీటు, సొంత జిల్లా సీటు కూడా పోయింది. ఎంత కష్టపడినా, పదుల సంఖ్యలో సభలు పెట్టినా రేవంత్ భంగపాటు తప్పలేదు. కేవలం కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకతతోనే కాంగ్రెస్‌కు ప్రజలు అధికారం ఇచ్చారు. తమకు బాధ్యత గల ప్రతిపక్ష హోదాను ప్రజలు ఇచ్చారు. దానిని సక్రమంగా నిర్వర్తిస్తాం. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేసేవరకు ఊరుకోం. వెంటపడి మరీ అమలు చేయిస్తాం. తెలంగాణలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహాయం ఉంటుందని భరోసా ఇచ్చారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు