MMTS Trains: రెండు రోజుల పాటు ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు!

దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషనలో జరుగుతున్న అభివృద్ది పనుల కారణంగా శని, ఆదివారాల్లో వెళ్లాల్సిన కొన్ని ఎంఎంటీఎస్‌ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.రైల్వే ప్రయాణికులు ఇతర రవాణా మార్గాలను ఎంచుకోవాలని అధికారులు తెలిపారు.

New Update
MMTS Trains: రెండు రోజుల పాటు ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు!

MMTS Trains: దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషనలో జరుగుతున్న అభివృద్ది పనుల కారణంగా శని, ఆదివారాల్లో వెళ్లాల్సిన కొన్ని ఎంఎంటీఎస్‌ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో రైల్వే ప్రయాణికులు ఇతర రవాణా మార్గాలను ఎంచుకోవాలని అధికారులు తెలిపారు. సోమవారం నుంచి ప్రయాణికులకు యథావిధిగా ఎంఎంటీఎస్‌ రైళ్లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు

అధికారులు రద్దు చేసిన ఎంఎంటీఎస్‌ రైళ్లు వివరాలు ఇలా ఉన్నాయి. రైలు నం. – 47177 (రామచంద్రపురం – ఫలక్‌నుమా), రైలు నెం – 47156 (ఫలక్‌నుమా – సికింద్రాబాద్), రైలు నం. – 47185 (సికింద్రాబాద్ – ఫలక్‌నుమా), రైలు నెం. – 47252 (ఫలక్‌నుమా – సికింద్రాబాద్)
రైలు నం. – 47243 (సికింద్రాబాద్ – మేడ్చల్), రైలు నం. – 47241 (మేడ్చల్ – సికింద్రాబాద్), రైలు నెం – 47250 (సికింద్రాబాద్ – ఫలక్‌నుమా), రైలు నెం – 47201 (ఫలక్‌నుమా – హైదరాబాద్), రైలు నెం – 47119 (హైదరాబాద్ – లింగంపల్లి), రైలు నెం – 47217 (లింగంపల్లి – ఫలక్‌నుమా), రైలు నెం. – 47218 (ఫలక్‌నుమా – రామచంద్రపురం) ఈ వివరాలను ప్రయాణికులు గుర్తించాలని అధికారులు తెలిపారు.

Also read: పవన్‌కు మావోయిస్టుల ముప్పు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Komatireddy Raj Gopal Reddy : నా మంత్రి పదవిని అడ్డుకుంటున్నది జానారెడ్డే...రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కొంతకాలం నుంచి తనకు మంత్రి పదవి వస్తుందని ఆశిస్తోన్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఈ రోజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఎట్టి పరిస్థితుల్లో మంత్రి పదవి రాకుండా కొందరు ఢిల్లీస్థాయిలో కుట్రలకు తెర లేపారన్నారు.

New Update
Telangana Elections: అందుకే కాంగ్రెస్‌లోకి పోతున్నా.. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

Komatireddy Raj Gopal Reddy

MLA Komatireddy Raj Gopal Reddy :గత కొంతకాలం నుంచి తనకు మంత్రి పదవి వస్తుందని వస్తుందని ఆశిస్తోన్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఈ రోజు సంచలన వ్యాఖ్యలు చేశారు.  చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పదవిపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ఎట్టి పరిస్థితుల్లో మంత్రి పదవి రాకుండా కొందరు ఢిల్లీస్థాయిలో కుట్రలకు తెర లేపారని ఆరోపించారు. మంత్రి పదవి ఇస్తానని పార్టీ హామీ ఇచ్చిందని. తన మంత్రి పదవి విషయంలో కొందరు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
జానారెడ్డి వంటివారు ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారన్నారు.జానారెడ్డి 30 ఏళ్లపాటు మంత్రి పదవి అనుభవించారు.రంగారెడ్డి, హైదరాబాద్‌కు పదవి ఇవ్వాలని ఇప్పుడు గుర్తుకొచ్చిందా? అంటూ ప్రశ్నించారు.

Also Read :  కల్యాణ్‌రామ్‌ ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ ట్రైలర్‌ చూశారా? కెవ్ కేక

 అధిష్టానం వద్ద తనకు మంత్రి పదవి ఖాయమైనా.. కావాలనే జానా పదేపదే అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. 25 ఏళ్లు మంత్రి పదవిలో జానారెడ్డి ఉన్నది సరిపోదా అని ధ్వజమెత్తారు. అధిష్టానం తనపై నమ్మకం ఉంచి మంత్రి పదవి ఇస్తే.. దాన్ని బాధ్యతగా భావిస్తానని కామెంట్ చేశారు. మంత్రి పదవి కోసం తాను ఎన్నడూ అడుక్కోలేదని.. మంత్రి పదవి అడుక్కుంటే వచ్చేది కాదు, అన్నదమ్ములు మంత్రులుగా ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. సమర్థత ఉన్న నాయకులకు మాత్రమే మంత్రి పదవులు ఇవ్వాలంటూ రాజగోపాల్ రెడ్డి ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. కాగా తనకు మంత్రి పదవి అనగానే కొంతమంది భయపడుతున్నారని ఆయన అన్నారు. తనకు అధిష్ఠానం మంత్రి పదవి ఇస్తానంటే పార్టీలోని కొందరు సీనియర్ నేతలకు చెమటలు పడుతున్నాయన్నారు. 

Also Read :  'చూపుల్తో గుచ్చి గుచ్చి’ మాస్ జాతర ప్రోమో సాంగ్ అదిరిపోయిందిగా..!
 
అయితే మంత్రి వర్గ విస్తరణపై సీనియర్ నేత జానారెడ్డి అధిష్ఠానానికి లేఖ రాశారు. మంత్రివర్గ కూర్పులో సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకోవాలని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. మంత్రి పదవుల ఎంపికలో అనుభవం, ఆయా నాయకుల సామర్థ్యాన్ని ప్రామాణికంగా తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జానారెడ్డిపై సంచలన కామెంట్స్ చేశారు.

Also Read :  ట్రెడిషనల్ లుక్ తో కట్టిపడేసిన మిల్కీబ్యూటీ..

అధిష్టానం తనపై నమ్మకం ఉంచి మంత్రి పదవి ఇస్తే.. దాన్ని బాధ్యతగా భావిస్తానని కామెంట్ చేశారు. మంత్రి పదవి కోసం తాను ఎన్నడూ అడుక్కోలేదని.. అన్నదమ్ములు మంత్రులుగా ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. సమర్థత ఉన్న నాయకులకు మాత్రమే మంత్రి పదవులు ఇవ్వాలంటూ రాజగోపాల్ రెడ్డి ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. కాగా తనకు మంత్రి పదవి అనగానే కొంతమంది భయపడుతున్నారని ఆయన అన్నారు.

Also Read :  'సూర్య 45'లో మలయాళ బ్యూటీ అనఘా రవి

Advertisment
Advertisment
Advertisment