Cricket: ఎమ్మెల్యే రికార్డ్ బ్రేక్ చేసిన సిరాజ్.. పోస్ట్ వైరల్

టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌ను హుజారాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కలిశారు. సోషల్ మీడియా వేదికగా సిరాజ్ తో దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. తెలంగాణలో ఫాస్టెస్ట్ బౌలర్‌గా తన పేరు మీద ఉన్న రికార్డును సిరాజ్‌ బ్రేక్‌ చేయడం సంతోషంగా ఉందని కౌశిక్ రెడ్డి అన్నారు.

New Update
Cricket: ఎమ్మెల్యే రికార్డ్ బ్రేక్ చేసిన సిరాజ్.. పోస్ట్ వైరల్

Mohammed Siraj: హుజారాబాద్ బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే (MLA) పాడి కౌశిక్ రెడ్డి (kaushik-reddy) టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌ (siraj)ను కలిశారు. ఈ సందర్భంగా తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కౌశిక్ రెడ్డి ఎమోషనల్ అయ్యారు. సిరాజ్‌ని చూస్తుంటే తనను తాను చూసుకున్నట్లు అనిపిస్తోందని, తెలంగాణలో ఫాస్టెస్ట్ బౌలర్‌గా తన రికార్డును సిరాజ్ బద్ధలు కొట్టాడని తెలిసి చాలా సంతోషించానంటూ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు.

తెలంగాణలో ఫాస్టెస్ట్ బౌలర్‌..
'మహ్మద్ సిరాజ్‌ను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. తెలంగాణలో ఫాస్టెస్ట్ బౌలర్‌గా ఉన్న నా రికార్డును సిరాజ్‌ బ్రేక్‌ చేయడం సంతోషకరం. సిరాజ్‌ విజయం, ఆయన ప్రయాణం చూస్తుంటే నాకు గర్వంగా ఉంది. నా చిన్నతనాన్ని తలుచుకుంటే చాలా సంతోషంగా అనిపిస్తోంది. @mdsirajofficial విజయం నా క్రికెట్ ప్రయాణాన్ని గుర్తు చేస్తుంది. మీ కోరిక ఏమిటో.. అది ఎలా ఉంటుందో.. మీ సంకల్పం కూడా అలాగే ఉండాలి. నీ చిత్తం ఎలా ఉంటుందో.. నీ కర్మ కూడా అలాగే ఉంటుంది. మీ కర్మ ఎలా ఉందో.. మీ విధి కూడా అలాగే ఉంటుంది' అంటూ సిరాజ్ ను అప్యాయంగా హత్తుకున్న ఫొటోను షేర్ చేయగా ఇరువురి అభిమానులు మురిసిపోతున్నారు. ఇద్దరిని పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు.

publive-image

ఇక ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి ఒకప్పుడు మంచి క్రికెటర్‌ ప్లేయర్. హైదరాబాద్‌ జట్టు తరఫున 2004 నుంచి 2007 వరకు 15 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన ఆయన.. అప్పట్లో బౌలింగ్ లో అదరగొట్టారు. ఎంతటి బ్యాట్స్ మెన్ అయినా కౌశిక్ రెడ్డి బాల్ పట్టాడంటే హడలెత్తిపోయేవారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TG Congress Politics: మీనాక్షికి బిగ్ షాక్ ఇచ్చిన సీనియర్లు.. హైకమాండ్ కు కంప్లైంట్!

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ ను తొలగించాలని హైకమాండ్ కు కాంగ్రెస్ సీనియర్ నేతలు కంప్లైంట్ ఇచ్చారు. HCU అంశంపై మీనాక్షి వ్యవహరించిన తీరు పార్టీ, ప్రభుత్వానికి ఇబ్బందిగా మరిందంటూ ఫిర్యాదు చేశారు.

New Update

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్‌ మీనాక్షి నటరాజన్‌కు సీనియర్ నేతలు బిగ్‌షాక్ ఇచ్చారు. ఆమెను తొలగించాలంటూ ఏఐసీసీకి ఫిర్యాదు చేశారు. ఆమె వ్యవహారశైలితో పార్టీకి నష్టం జరుగుతుందంటూ హైకమాండ్ కు మొరపెట్టుకున్నారు. ముఖ్యంగా HCU అంశంపై మీనాక్షి వ్యవహరించిన తీరు పార్టీ, ప్రభుత్వానికి ఇబ్బందిగా మరిందంటూ కంప్లైంట్ చేశారు. దీంతో ఇప్పుడు మీనాక్షి నటరాజన్ ను ఇన్‌ఛార్జిగా కొనసాగిస్తారా? లేక తప్పిస్తారా? అన్న అంశం తెలంగాణ పాలిటిక్స్ లో ఆసక్తికరంగా మారింది. HCU భూముల విషయంలో మీనాక్షి నటరాజన్ ఏకంగా సెక్రటేరియట్లోని భట్టి విక్రమార్క ఛాంబర్ లో సమీక్ష నిర్వహించిన అంశంపై విమర్శలు వచ్చాయి. అనంతరం యూనివర్సిటీకి వెళ్లి స్టూడెంట్స్ తో భేట కావడం ప్రతిపక్షాలకు అస్త్రంగా మారింది. 

అందుకే సీనియర్లకు కోపం?

పార్టీలో అందరూ ఒకటే అనే సిద్ధాంతంతో మీనాక్షి పని చేస్తున్నారు. ఇది సీనియర్లకు మింగుడు పడడం లేదని తెలుస్తోంది. తమ సిఫారసులను పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు గాంధీభవన్ లో చర్చ సాగుతోంది. రాహుల్ గాంధీ టీమ్ లో మీనాక్షి కీలకంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర బాధ్యతలు అప్పగించారన్న ప్రచారం ఉంది.

ఇక్కడ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని.. ఈ క్రమంలో పార్టీని బలోపేతం చేయడం, నిజమైన కార్యకర్తలకు న్యాయం చేయడం అన్న లక్ష్యంగా మీనాక్సి నటరాజన్ ను తెలంగాణ ఇన్ఛార్జిగా నియమించింది హైకామాండ్. అయితే.. ప్రస్తుతం సీనియర్లు ఆగ్రహంగా ఉన్న ఈ తరుణంలో ఆమెను కొనసాగిస్తారా? లేక పక్కకు పెడతారా? అన్న అంశంపై తెలంగాణ పాలిటిక్స్ లో ఉత్కంఠగా మారింది.

(telugu-news | latest-telugu-news | telugu breaking news)

Advertisment
Advertisment
Advertisment