AP: ఏపీలో మైనర్ బాలికపై ఆటోడ్రైవర్ హత్యాచారం

మైనర్ బాలికపై లైంగిక దాడి చేసి దారుణంగా చంపేసిన సంఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగింది. రమేష్ అనే ఆటో డ్రైవర్ బలవంతంగా రేప్ చేయడంతోపాటు తన స్నేహితుడు సీతన్నతో రెండోసారి లైంగిక దాడికిపాల్పడ్డాడు. అనుమానం రాకుండా దూలానికి ఉరేసి చంపేశారు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

New Update
AP: ఏపీలో మైనర్ బాలికపై ఆటోడ్రైవర్ హత్యాచారం

AP: ఏపీలో మరో దారుణం జరిగింది. కామాంధుల చేతిలో మరో బాలిక బలైంది. పట్టుమని పదిహేనేళ్లు కూడా లేని అమ్మాయి ఇంట్లో ఒంటరిగా ఉండటం గమనించి ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా ఆమె ఎవరికైనా చెబుతుందోమోనని భయంతో ఘోరానికి పాల్పడ్డాడు. తన స్నేహితుడితో కలిసి రెండోసారి అత్యాచారం చేసి చివరికి అనుకున్నంత పనిచేశారు. ఈ భయంకరమైన సంఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటుచేసుకుంది.

బలవంతంగా తీసుకెళ్లి..
ఈ మేరకు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి అదనపు ఎస్పీ ప్రతాప్‌శివకిషోర్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గూడెంకొత్తవీధి మండలంలోని మారుమూల గ్రామానికి చెందిన బాలిక పేరెంట్స్ జనవరి 2న వ్యవసాయ పనులకు వెళ్లారు. అయితే ఇదే ప్రాంతంలో ఉంటున్న ఆటో డ్రైవర్‌ పాంగి రమేశ్‌(19) ఆమెను బెదిరించి ఓ ఇంట్లోకి బలవంతంగా తీసుకెళ్లి తనపై లైంగికదాడి చేసినట్లు బాలిక తన బంధువుకు వివరించింది. అక్కడ ఆడుకుంటున్నచిన్నారులు కూడా దీనిని గమనించినట్లు చెప్పారు.

ఇది కూడా చదవండి : Health Tips : చలికాలం రూమ్‌ హీటర్‌ని ఎక్కువగా వాడుతున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

ఆ భయంతోనే రెండోసారి.. 
ఈ విషయం గ్రామంలో అందరికీ తెలిసిపోతుందని భయపడ్డ రమేశ్‌.. తన స్నేహితుడైనా మరో ఆటోడ్రైవర్‌ సీతన్న దగ్గర ఓపెన్ అయ్యాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు ఇంటికి వచ్చేలోగా ఆమెను చంపేద్దామని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో రమేశ్‌, కొంతసేపటి తర్వాత సీతన్న ఇంట్లోకి వెళ్లారు. ఎలాగూ ప్రాణాలు తీస్తున్నాం కదా అని ఇద్దరూ కలిసి మరోసారి ఆమెపై అత్యాచారం చేశారు. అనంతరం చీరతో తన గొంతుకు ముడి వేసి హత్య చేశారు. ఆత్మహత్యగా చిత్రీకరించేలా తనని దూలానికి వేలాడదీసి పారిపోయారు. సాయంత్రం ఇంటికి వచ్చిన బాలిక తల్లిదండ్రులు తమ కుమార్తె చనిపోవడంతో కన్నీరుమున్నీరయ్యారు.

డెడ్ బాడీపై గాయాలు..
అయితే మరుసటి రోజు అంత్యక్రియల్లో భాగంగా మృతురాలికి స్నానం చేయిస్తున్న సమయంలో శరీరంపై గాయాలైనట్లు గుర్తించారు. తల్లిదండ్రులకు అనుమానం వచ్చినా మృతదేహాన్ని ఖననం చేసి.. జనవరి 5న గూడెంకొత్తవీధి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని సీఐ అశోక్‌కుమార్‌, ఎస్సై అప్పలసూరి తెలిపారు. దీంతో వెంటనే ఆ గ్రామానికి వెళ్లి అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టి.. ఖననం చేసిన మృతదేహాన్ని రెవెన్యూ అధికారులు, వైద్యుల సమక్షంలో బయటకు తీయించి పోస్టుమార్టం పూర్తి చేశారు. ఇంతలో తమ పేర్లు బయటకు వస్తాయని భావించిన నిందితులిద్దరూ వీఆర్వో సాయంతో పోలీసుల ఎదుట లొంగిపోయారు. నిందితులపై పోక్సోతోపాటు అత్యాచారం, హత్య కేసులు నమోదు చేసినట్లు ఏఎస్పీ వెల్లడించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు