/rtv/media/media_files/2025/04/12/y2C1WGJMzCbXOyMrplet.jpg)
TTD Chairman Reaction Over Cows Death
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని నిర్వహించబడుడున్న ఎస్వీ గోశాలలో దాదాపు 100 గోవులు మృతి చెందాయని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి నిన్న ఆరోపించిన విషయం తెలిసిందే. అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఆ ఆవులు చనిపోతున్నాయని.. ఇది మహా అపచారం అని ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన ఆవులకు సంబంధించిన ఫొటోలను సైతం కరుణాకర్ రెడ్డి విడుదల చేశారు. ఈ అంశంపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. కరుణాకర్ రెడ్డి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇలాంటి కల్పిత ఆరోపణలు అత్యంత విషాదకరమన్నారు. శ్రీవారి సేవలో నిమగ్నమై, హిందూ ధర్మ పరిరక్షణకు అంకితభావంతో టీటీడీ ట్రస్ట్ బోర్డు చేపడుతున్న పుణ్య కార్యక్రమాల పట్ల కంటకింపుతో ఈ తరహా చర్యలకు దిగడం చాలా బాధాకరమనర్నారు.
టిటిడి ఎస్వీ గోశాలలో గోవులు మృతి చెందాయంటూ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ప్రచారం చేస్తున్న అవాస్తవాలు, కల్పిత ఆరోపణలు అత్యంత విషాదకరం. శ్రీవారి చరణాల సేవలో నిమగ్నమై, హిందూ ధర్మ పరిరక్షణకు అంకితభావంతో టిటిడి ట్రస్ట్ బోర్డు చేపడుతున్న పుణ్య కార్యక్రమాల పట్ల కంటకింపుతో ఈ తరహా…
— B R Naidu (@BollineniRNaidu) April 12, 2025
గోమాతకు హిందూ ధర్మంలో ఉన్న ప్రాముఖ్యత అనన్య సాధారణమన్నారు. వేదకాలం నుంచే గోమాతను దేవతలతో పూజిస్తూ వస్తున్నామన్నారు. ఏ ఒక్క గోవు యొక్క మృతి కూడా సామాన్యంగా తీసుకోలేమన్నారు. కానీ సహజంగా తప్పని అనారోగ్యం, వృద్ధాప్యం, ప్రమాదాలు వంటి కారణాల వల్ల గోవుల మృతి జరిగే అంశాన్ని రాజకీయంగ, అబద్ధ ప్రచారానికి వాడుకోవడం అత్యంత అధర్మమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇతర ప్రాంతాల్లోని ఫొటోలను ఇక్కడివిగా..
ఇంకా దుర్మార్గంగా, ఇతర ప్రాంతాల్లో చనిపోయిన గోవుల ఫోటోలను టీటీడీ గోశాలకు చెందినవిగా చిత్రీకరించి ప్రజలను మోసగించేందుకు చేస్తున్న కుట్ర బాధాకరమన్నారు. ఇలాంటి వదంతులను ప్రజలు గుర్తించి, అవాస్తవాలపై నమ్మకం కలిగి మోసపోవద్దని కోరారు. గోసేవా అంటేనే గోదేవి సేవ అని అన్నారు. ఈ పవిత్రమైన సేవను రాజకీయ లబ్ధి కోసం మచ్చలేసే ప్రయత్నాలను భక్తులందరూ తిరస్కరించాలన్నారు. శ్రీవారి ఆశీస్సులతో, హిందూ ధర్మ పరిరక్షణలో టీటీడీ చేపడుతున్న గోరక్షణ, గోపోషణ కార్యక్రమాలపై భక్తుల విశ్వాసం మరింత బలపడాలని ఆకాంక్షించారు.
(br naidu ttd chairman | telugu-news | latest-telugu-news | telugu breaking news)
Telangana: ఎన్టీఆర్ శిష్యుడు కేసీఆర్.. హ్యాట్రిక్ కొట్టడం ఖాయం.. కేటీఆర్ ఇంట్రస్టింగ్ కామెంట్స్..
ఎంతమంది నాయకులు వచ్చినా నందమూరి తారక రామారావుకు(NTR) సాటిలేరని.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ఎన్టీఆర్ ఆదర్శమని వ్యాఖ్యానించారు కేటీఆర్(KTR). ఎన్టీఆర్ శిష్యుడు కేసీఆర్ తెలంగాణ అస్తిత్వాన్ని యావత్ దేశానికి చాటి చెప్పారని అన్నారు.
Minister KTR Comments on NTR: ఎంతమంది నాయకులు వచ్చినా నందమూరి తారక రామారావుకు(NTR) సాటిలేరని.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ఎన్టీఆర్ ఆదర్శమని వ్యాఖ్యానించారు కేటీఆర్(KTR). ఎన్టీఆర్ శిష్యుడు కేసీఆర్ తెలంగాణ అస్తిత్వాన్ని యావత్ దేశానికి చాటి చెప్పారని అన్నారు. ఖమ్మం జిల్లా నగరంలోని లకారం ట్యాంక్ బండ్ వద్ద రూ.1.37 కోట్లతో నిర్మించిన ఎన్టీఆర్ పార్క్, విగ్రహాన్ని మంత్రి అజయ్ కుమార్తో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన కేసీఆర్. ఎన్టీఆర్ పై ప్రశంసల జల్లు కురిపించారు. రాముడు, కృష్ణుడు ఎలా ఉంటారో మనకు తెలియదు కానీ, ఎన్టీఆర్ లాగానే ఉంటారని మనమంతా అనుకుంటాం అన్నారు. తనకు ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
ఇదే సమయంలో ఎన్టీఆర్ శిష్యుడు కేసీఆర్ అంటూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు మంత్రి కేటీఆర్. ఎన్టీఆర్ సీఎంగా హ్యాట్రిక్ కొట్టలేకపోయారని, ఆయన శిష్యుడు సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొడతారని ధీమా వ్యక్తం చేశారు. తద్వారా గురువు చేయలేని పనిని శిష్యుడు కేసీఆర్ సాధ్యం చేయబోతున్నారని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. తారకరామారావు అనే పేరులోనే ఏదో శక్తి ఉందన్నారు. అయితే, ఎన్టీఆర్ విగ్రహాన్ని ఖమ్మం నగరంలో ఏర్పాటు చేయడం.. దీన్ని ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొని ఎన్టీఆర్పై ప్రశంసల జల్లు కురిపించడం ఇటు తెలంగాణతో పాటు అటు ఏపీ రాజకీయాల్లోనూ హాట్ టాపిక్గా మారింది. అంతకు ముందు మంత్రి కేటీఆర్ ఖమ్మం జిల్లాలో కొణిజర్ల మండలం అంజనాపురం వద్ద ఆయిల్పామ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు.
సత్తుపల్లిలో బహిరంగ సభలో పాల్గొన్న మంత్రి కేటీఆర్..
Also Read:
Nara Bhuvaneshwari: భువనేశ్వరి నిరాహార దీక్ష.. బాలకృష్ణ సంచలన ప్రకటన
Ktr: తెలంగాణ ఎన్నికల కోసం కర్నాటకలో కాంగ్రెస్ పన్ను.. కేటీఆర్ సంచలన ట్వీట్
TTDలో నిజంగానే 100 ఆవులు చనిపోయాయా?: చైర్మన్ బీఆర్ నాయుడు కీలక ప్రకటన!
TTD ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలలో 100 ఆవులు చనిపోయాయన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని చైర్మన్ BR నాయుడు స్పష్టం చేశారు. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
Aghori - Sri Varshini: ఏంటి భయ్యా ఈ అరాచకం.. అఘోరీతో సె*క్స్.. ఆపుకోలేక మొత్తం చెప్పేసిన వర్షిణీ!
అఘోరీతో సె**క్స్పై వర్షిణీ షాకింగ్ విషయాలు పంచుకుంది. ‘‘నాకు సె**క్స్ పై ఎలాంటి ఫీలింగ్స్ లేవు.. రావు కూడా. నాకు దానికి అస్సలు ఇంట్రెస్ట్ లేదు. Short News | Latest News In Telugu | వైరల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
BIG BREAKING: తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా!
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీలో ఆయన చేశారు. అధ్యక్షుడు జయంత్ చౌదరి సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
Aghori - Sri Varshini Marriage: అనుకున్నదే అయింది.. అఘోరీకి వర్షిణీకి పెళ్లైంది - వీడియో
అందరూ అనుకున్నట్లుగానే అఘోరీ - వర్షిణీ వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని వర్షిణీ స్వయంగా తెలిపింది. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
🔴Live News Updates: గుజరాత్కు మరో షాక్.. టోర్నీ నుంచి మరో ఆల్రౌండర్ ఔట్!
Stay updated with the Latest News In Telugu! Get breaking news, politics క్రైం | టెక్నాలజీ | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
IPL 2025: గుజరాత్కు మరో షాక్.. టోర్నీ నుంచి ఆల్రౌండర్ ఔట్!
ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్ను గాయలబెడద వేధిస్తోంది. ఇప్పటికే కీలక పేసర్ కగిసో రబాడ జట్టుకు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
TGPSC : గ్రూప్-1పై ఆరోపణలు.. బీఆర్ఎస్ నేతకు TGPSC నోటీసులు
Earthquake: భారీ భూకంపం.. ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని ప్రజలు పరుగే పరుగు- ఎక్కడంటే?
USA-China: అమెరికా టారిఫ్ ఎఫెక్ట్.. ఎగుమతి సవాళ్లు ఎదుర్కొంటున్న చైనా
Maharashtra Ra*pe Case | అత్యా*చారం చేసి గొం*తు కో*సి | 10-Years Girl Incident In Thane | RTV
TTDలో నిజంగానే 100 ఆవులు చనిపోయాయా?: చైర్మన్ బీఆర్ నాయుడు కీలక ప్రకటన!