Rahul Gandhi : అప్పుడెక్కడికి వెళ్లారు మీరంతా.. మీడియాకు రాహుల్ కౌంటర్..

మీడియా తీరుపై రాహుల్ గాంధీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 150 మంది ఎంపీలను బయటకు పంపిస్తే మీడియాలో కనీసం చర్చ లేదన్నారు. ఉపరాష్ట్రపతిని ఎవరూ ఎమీ అనలేదని క్లారిటీ ఇచ్చారు రాహుల్. ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని మీడియాకు సూచించారు రాహుల్.

New Update
Rahul Gandhi : అప్పుడెక్కడికి వెళ్లారు మీరంతా.. మీడియాకు రాహుల్ కౌంటర్..

Congress MP Rahul Gandhi : మీడియా తీరుపై కాంగ్రెస్(Congress) అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 150 మంది ఎంపీలను బయటకు పంపిస్తే.. మీడియాలో చర్చ లేదు కానీ.. సంబంధం లేని అంశంపై చర్చ పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఆవరణలో బుధవారం నాడు మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. ఈ సందర్భంగా మిమిక్రీ వివాదంపై స్పందించారు. ఎవరూ ఎవరిని కించపరచలేదని క్లారిటీ ఇచ్చారు. ఉపరాష్ట్రపతిని ఎవరూ అవమానించలేదని స్పష్టం చేశారు. సస్పెన్షన్‌కు నిరసనగా విపక్ష ఎంపీలు పార్లమెంట్ ముందు కూర్చుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. దానిని నేను నా మొబైల్‌లో వీడియో చిత్రీకరించాను. ఆ వీడియో నా ఫోన్‌లో ఉంది. కానీ, మీడియా దీనిని మరో రకంగా చూపించే ప్రయత్నం చేసిందంటూ అసహనం వ్యక్తం చేశారు. ఎవరూ ఎవర్నీ ఏమీ అనలేదన్నారు.

మీడియా కూడా పక్షపాతం వహించడం ప్రజాస్వామ్యానికి క్షేమం కాదని చురకలంటించారు రాహుల్ గాంధీ(Rahul Gandhi). సభ నుంచి 150 మంది ఎంపీలను బయటకు గెంటేసినా మీడియా కనీసం పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. ఇంత భారీ స్థాయిలో సస్పెన్లు చేయడం పార్లమెంట్ చరిత్రలో తొలిసారి అని, దీనిపై మీడియాలో కనీసం చర్చ లేదని విమర్శించారు. 'దేశానికి నష్టం చేసే అంశాలపై చర్చ ఉండదు.. అదానిపై చర్చ లేదు.. రాఫెల్‌పై చర్చ లేదు.. నిరుద్యోగంపై చర్చ లేదు.. మా ఎంపీలు నిరుత్సాహపడి బయట కూర్చున్నారు. కానీ, మీరు కేవలం మిమిక్రీని హైలైట్ చేస్తూ చర్చలు పెడుతున్నారు. ఇదే పద్ధతి. విపక్షను వీడండి. పక్షపాతం సరికాదు.' అని పేర్కొన్నారు రాహుల్ గాంధీ.

Also Read: రాత్రి 9 తరువాత బోజనం చేస్తున్నారా? ఎంత ప్రమాదో తెలుసా?

లోక్‌సభలో భద్రతా వైఫల్యంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ విపక్ష పార్టీల ఎంపీలు గత కొద్ది రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే, సభలో నిరసన వ్యక్తం చేసిన దాదాపు 150 మందికి పైగా ఎంపీలను సస్పెండ్ చేశారు. దీంతో సస్పెన్షన్‌కు గురైన సభ్యులంతా పార్లమెంట్ బయట కూర్చుని ప్రొటెస్ట్ చేశారు. ఈ సందర్భంలో విపక్ష ఎంపీలు మాక్ పార్లమెంట్ నిర్వహించారు. అయితే, రాజ్యసభ చైర్మన్‌ అయిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్‌ను ఇమిటేట్ చేశారు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ. అది కాస్తా ఇప్పుడు వివాదాస్పదం అయ్యింది. ఆయన చర్యను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సహా అధికారపక్షం నేతలంతా ఖండించారు. ఇది దురహంకార చర్యగా పేర్కొన్నారు.

Also Read: సరిగా నిద్రపోవడం లేదా? క్యాన్సర్‌ను ఏరికోరి తెచ్చుకున్నట్లే..!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

India: పాకిస్తానీయులకు ముగిసిన డెడ్ లైన్..537 మంది వెనక్కు..

టెంపరరీ వీసాలతో భారత్ కు వచ్చిన పాక్ పౌరులకు భారత ప్రభుత్వం ఇచ్చిన గడువు ఈ రోజు తో ముగిసింది. దీంతో ఇప్పటి వరకు 537 మంది అట్టారీ-వాఘా సరిహద్దు మార్గంలో పాకిస్థాన్‌కు వెళ్ళారని తెలుస్తోంది. వీరిలో తొమ్మది మంది దౌత్య వేత్తలు, అధికారులు ఉన్నారు.

New Update
pak

Pakistan People

పాకిస్తానీయులు ఇండియాలో ఉండటంపై భారత ప్రభుత్వం సీరియస్ గా ఉంది. పహల్గామ్ లో దాడి జరిగిన తర్వాత పాక్ పౌరులు తమ దేశం నుంచి వెళ్ళిపోవాలని ఆదేశాలను జారీ చేసింది. ఏప్రిల్ 24న ఈ ఉత్తర్వులను ఇచ్చింది. దీంతో పాకిస్తానీయులు దేశం విడిచి వెళ్ళడం ప్రారంభించారు. ఇప్పటివరకు నాలుగు రోజుల్లో 537 మంది అట్టారీ-వాఘా సరిహద్దు మార్గంలో పాకిస్థాన్‌కు  వెళ్లిపోయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఒక్క ఆదివారం రోజునే 287 మంది వెళ్ళారని సమాచారం . ఇందులో తొమ్మిది మంది దౌత్యవేత్తలు, అధికారులు ఉన్నట్లు చెప్పారు. కొంతమంది ఫ్లైట్స్ ద్వారా వెళ్ళారని..అయితే నేరుగా పాక్ కు విమాన సర్వీసులు లేవు కాబట్టి..ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళిపోయి ఉండవచ్చని చెప్పారు. ఇదే సరిహద్దు ద్వారా 850 మంది భారతీయులు పాకిస్థాన్‌ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చినట్లు చెప్పారు.

మూడు లక్ష జరిమానా..

పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్‌లో ఉంటున్న పాకిస్థానీయులను నిర్ణీత గడువులోగా వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించి ఎవరైనా గడువు దాటినా కూడా ఇంకా భారత్‌లోనే ఉంటే చట్టం ప్రకారం వాళ్లని అరెస్టు చేయవచ్చు. దీనిపై దర్యాప్తు చేపట్టి.. మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.3 లక్షల జరిమానా, లేదా రెండు విధించే ఛాన్స్ కూడా ఉంటుంది.  సార్క్‌ వీసాల కింద ఇండియాలో ఉంటున్న పాకిస్థానీయులు ఏప్రిల్ 26లోగా దేశం విడిచి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే మెడికల్ వీసాల కింద వచ్చినవాళ్లకు మాత్రం ఏప్రిల్ 29 వరకు గడువు ఇచ్చింది. స్టూడెంట్, బిజినెస్, విజిటర్ తదితర 12 విభాగాల్లో వీసాలు ఉన్నవాళ్లు మాత్రం ఏప్రిల్ 27 నాటికి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఏప్రిల్ 4 నుంచి ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్‌ యాక్ట్‌-2025 అమల్లోకి వచ్చింది. 

 today-latest-news-in-telugu | india | pakistan 


Also Read: Sitakka: నీ బిడ్డ కార్లలో తిరిగితే.. మా ఆడబిడ్డలు బస్సులో కూడా తిరగొద్దా?: కేసీఆర్ కు సీతక్క స్ట్రాంగ్ కౌంటర్!

Advertisment
Advertisment
Advertisment