Meghalaya: మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత!

మేఘాలయ మాజీ ముఖ్యమంత్రి సాల్సెంగ్‌ . సి. మారక్‌ (82) శుక్రవారం కన్నుమూశారు.వృద్దాప్య సమస్యలతో బాధపడుతూ..తురా సివిల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.మాజీ ముఖ్యమంత్రి మృతికి నివాళులర్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది.

New Update
Meghalaya: మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత!

Meghalaya: మేఘాలయ మాజీ ముఖ్యమంత్రి సాల్సెంగ్‌ . సి. మారక్‌ (82) శుక్రవారం కన్నుమూశారు. ఈ సీనియర్‌ కాంగ్రెస్ నాయకుడు వృద్దాప్య సమస్యలతో బాధపడుతూ..తురా సివిల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. సాల్సెంగ్ రెండు సార్లు ముఖ్యమంత్రి పదవిని నిర్వహించారు.

1993లో ఐదు సంవత్సరాల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నప్పుడు మొదటి ముఖ్యమంత్రిగా... 1998లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని సంకీర్ణం కుప్పకూలినప్పుడు 12 రోజుల ముఖ్యమంత్రి పదవిని కూడా నిర్వహించారు. 2003లో రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్‌గా కూడా చేశారు. మాజీ ముఖ్యమంత్రి మృతికి నివాళులర్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది.

మారక్ మృతి పట్ల ముఖ్యమంత్రి కాన్రాడ్ కె సంగ్మా సంతాపం ప్రకటించారు. “మాజీ సీఎం సాల్సెంగ్ సీ మారక్ మరణవార్త తెలిసి చాలా బాధపడ్డాను. మేఘాలయ అభివృద్ధికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆయన కుటుంబసభ్యులకు, ఆత్మీయులకు నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి కలగాలి.” అని ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేశారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కూడా మారక్ మృతికి సంతాపం తెలిపారు.

Also Read:  ఉదయ్‌పూర్ లో 24 గంటల పాటు ఇంటర్నెట్ సేవలు బంద్‌..ఎందుకంటే!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA: 90 రోజులు టారీఫ్ లకు బ్రేక్..అంతా ఒట్టిదే..వైట్ హౌస్

ట్రంప్ టారీఫ్ ల దెబ్బకు ప్రపంచ మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. దీంతో అమెరికా అధ్యక్షుడు సుంకాలను ఆపేస్తారనే వార్తలు వచ్చాయి. అయితే వాటిని వైట్ హౌస్ కొట్టిపడేసింది. టారీఫ్ లను ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. 

New Update
us

White House

 ప్రతీకార సుంకాలను ఆపేది లేదని తేల్చి చెప్పారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, వైట్ హౌస్. ఏది ఏమైనా టారీఫ్ లను కొనసాగిస్తామని చెప్పారు. మా విధానంలో ఎటువంటి మార్పూ ఉండదు అన్నారు. అయితే ఏ దేశమైనా టారీఫ్ ల మీద చర్చకు వస్తే తాము సుముఖంగా ఉన్నామని ట్రంప్ స్పష్టం చేశారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త సుంకాలను 90 రోజుల పాటు నిలిపివేయాలని ఆలోచిస్తున్నారనే వార్తలను వైట్ హౌస్ ఖండించింది. దానిపై వస్తున్న వార్తలన్నీ నకిలీవి అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అన్నారు. 

 

ఒక్క పోస్ట్ తో అంతా తారుమారు..

నిన్న ఎక్స్ లో వాల్టర్ బ్లూమ్ బెర్గ్, నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ డైరెక్టర్ కెవిన్ హాసెట్,  అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా మినహా అన్ని దేశాలకు 90 రోజుల సస్పెన్షన్ గురించి ఆలోచిస్తున్నారని పోస్ట్ లు వచ్చాయి. దీంతో మార్కెట్లో గందరగోళం మొదలైంది.  ఈ ఒక్క పోస్ట్ తో స్టాక్ మార్కెట్ హెచ్ థగ్గులకు గురైంది. దీని గురించే ఈరోజు వైట్ హౌస్  మాట్లాడింది. హాసెట్ చెప్పినదాన్ని జనాలు తప్పుగా అర్ధం చేసుకున్నారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అన్నారు. ట్రంప్ కు అలాంటి ఆలోచన లేదని స్పష్టం చేశారు. అయితే అసలు ఈ చర్చ అంతా బిలియనీర్ హెడ్జ్ ఫండ్ పెట్టుబడిదారుడు, ట్రంప్ మద్దతుదారుడు అయిన బిల్ అక్మాన్ ఆదివారం ట్రంప్ అసమాన సుంకాల ఏర్పాట్లను పరిష్కరించడానికి, దేశానికి గణనీయమైన పెట్టుబడులను ఆకర్షించడానికి "90 రోజుల గడువు" అమలు చేయాలని సూచించిన తర్వాత చర్చ ప్రారంభమైంది.

 today-latest-news-in-telugu | usa | donald trump tariffs | white-house

Also Read: RCB VS MI: ముంబయ్ గెలుస్తుంది అనుకుంటే...బెంగళూరు తన్నుకుపోయింది

Advertisment
Advertisment
Advertisment