Andhra Pradesh : ఏపీకి పెట్రోల్ రిఫైనరీ పరిశ్రమ.. చంద్రబాబుతో బీపీసీల్ ప్రతినిధుల భేటీ..!

నేడు సీఎం చంద్రబాబుతో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ప్రతినిధులు సమావేశం కానున్నారు. ఏపీలో పెట్రోల్ రిఫైనరీ పరిశ్రమ ఏర్పాటుపై సీఎంతో చర్చలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ.60 వేల కోట్లతో రిఫైనరీ ఏర్పాటు చేసే అంశంపై బీపీసీఎల్ తో ప్రభుత్వం సంప్రదింపులు జరుపనుంది.

New Update
Andhra Pradesh : ఏపీకి పెట్రోల్ రిఫైనరీ పరిశ్రమ.. చంద్రబాబుతో బీపీసీల్ ప్రతినిధుల భేటీ..!

AP CM Chandrababu Meeting With BPCL Representatives : నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) తో బీపీసీఎల్ (BPCL) ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణకుమార్, సంస్థ ప్రతినిధులు భేటీ జరుగనుంది. వెలగపూడి సచివాలయంలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ప్రతినిధులు సీఎంతో సమావేశం కానున్నారు. ఏపీలో పెట్రోల్ రిఫైనరీ పరిశ్రమ ఏర్పాటుపై సీఎంతో చర్చలు జరుపనున్నారు.

Also Read: పాఠశాలకు తాళాలు వేసిన గ్రామస్తులు.. పట్టించుకోని అధికారులు..!

దాదాపు రూ.60 వేల కోట్లతో రిఫైనరీ ఏర్పాటు చేసే అంశంపై బీపీసీఎల్ తో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపనుంది. ఉమ్మడి కృష్ణా జిల్లా మచిలీపట్నం (Machilipatnam) లో రిఫైనరీ పరిశ్రమ ఏర్పాటు చేయాలని బీపీసీల్ ప్రతినిధులు అలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు