MEA: అమెరికా మత స్వేచ్ఛ నివేదికపై భారత్ కీలక వ్యాఖ్యలు అమెరికా అంతర్గత వ్యవహారాల శాఖ విడుదల చేసిన మత స్వేచ్ఛ రిపోర్టు 2023పై భారత్ స్పందించింది. ఇది పూర్తిగా పక్షపాత వైఖరితో కూడిందని.. ఈ నివేదికను తిరస్కరిస్తున్నట్లు పేర్కొంది. By B Aravind 28 Jun 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి అమెరికా అంతర్గత వ్యవహారాల శాఖ విడుదల చేసిన మత స్వేచ్ఛ రిపోర్టు 2023పై భారత్ స్పందించింది. ఇది పూర్తిగా పక్షపాత వైఖరితో కూడిందని.. ఈ నివేదికను తిరస్కరిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాలశాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. భారత్లో ఉన్న సామాజిక కూర్పును అర్థం చేసుకోకుండా.. కేవలం ఓట్బ్యాంక్ రాజకీయాల ఆధారంగా మాత్రమే ఆ రిపోర్టు తయారు చేసినట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. Also Read: నీట్ పేపర్ స్కామ్.. విద్యార్థులకు రాహుల్ కీలక సందేశం ఆ రిపోర్టులో పొరపాట్లు ఉన్నట్లు తెలిపారు. ఎంపిక చేసుకున్న అంశాలను వాళ్లకి కావాల్సిన చోట అన్వయించుకున్నారని.. దీన్ని పక్షపాత వైఖరితోనే తయారు చేసినట్లు ఆరోపించారు. భారత వ్యతిరేక కథనాన్ని చూపించేందుకు కొన్ని ఘటనలను మాత్రమే ఆ నివేదిక ప్రస్తావించిందని.. చట్టాలు, నిబంధనల చెల్లుబాటును ప్రశ్నించిందని పేర్కొన్నారు. భారత కోర్టులు ఇచ్చిన పలు తీర్పుల విశ్వసనీయతను కూడా ఇది సవాలు చేసేలా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. #religious-freedom #mea #religion #usa #india సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి