IPL: క్రికెట్ లో ఆయనొక తండ్రిలాంటివాడు.. పతిరన ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

ఎంఎస్ ధోనీ వ్యక్తిత్వంపై శ్రీలంక యువ క్రికెటర్ మతీశా పతిరన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. క్రికెట్ లో ధోనీ తనకు తండ్రిలాంటివాడు అన్నాడు. 'మా నాన్నలాగే ధోనీ నన్ను బాగా చూసుకుంటారు. నా పట్లనే కాదు ఆటతీరుకు సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు' అని ప్రశంసలు కురిపించాడు.

New Update
IPL: క్రికెట్ లో ఆయనొక తండ్రిలాంటివాడు.. పతిరన ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Phirana: భారత సారథి, రెండు ప్రపంచకప్ లు అందించిన హీరో ఎంఎస్ ధోనీపై శ్రీలంక యువ క్రికెటర్ ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం చెన్నై టీమ్ కు ఆడుతున్న మతీశా పతిరన రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. యువ క్రికెటర్ల సత్తాను వెలికితీసి ప్రోత్సహించడంలో ధోనీ ఎల్లప్పుడూ ముందుంటాడన్నాడు.


తండ్రి తర్వాత తండ్రి.. 
ఈ మేరకు పతిరన మాట్లాడుతూ.. ‘నా తండ్రి తర్వాత క్రికెట్‌ జీవితంలో అలాంటి పాత్ర పోషిస్తున్న వ్యక్తి ధోనీ. మా నాన్నలాగే ధోనీ నన్ను బాగా చూసుకుంటారు. ఎల్లవేళలా నాపట్ల జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు నడిపిస్తున్నాడు. మైదానంలోనే కాదు బయట కూడా ‘అలా చెయ్‌.. ఇలా చెయ్‌’ అంటూ విసిగించరు. అవసరమైన విషయాలను మాత్రమే సూటిగా చెబుతారు. ఆ మాటలే నాలో ఆత్మవిశ్వాసం పెంచుతున్నాయి. నాకు ఏ అనుమానం ఉన్నా ధోనీని అడుగుతా. సందేహాలకు కచ్చితంగా సమాధానం చెబుతారు' అంటూ చెప్పుకొచ్చాడు. ఇటివరకు ఐపీఎల్‌లో 20 మ్యాచుల్లోనే 34 వికెట్లు పడగొట్టాడు పతిరన.

Advertisment
Advertisment
తాజా కథనాలు