Wayanad Landslides: వాయనాడ్ లో మాటలకందని విషాదం.. 42కు పెరిగిన మృతుల సంఖ్య!

కేరళలోని వయనాడ్‌ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున భారీ కొండచరియలు విరిగిపడిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు కనీసం 42 మంది మృతి చెందినట్లు స్థానిక మీడియా కథనాలు తెలిపాయి. ఇంకా కొన్ని వేల మంది మట్టి దిబ్బల కింద చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

New Update
Wayanad Landslides: వాయనాడ్ లో మాటలకందని విషాదం.. 42కు పెరిగిన మృతుల సంఖ్య!

Wayanad Landslides: కేరళలోని వయనాడ్‌ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున భారీ కొండచరియలు విరిగిపడిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు కనీసం 42 మంది మృతి చెందినట్లు స్థానిక మీడియా కథనాలు తెలిపాయి. ఇంకా కొన్ని వేల మంది మట్టి దిబ్బల కింద చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం, అగ్నిమాపక బృందం, ఎన్డీఆర్‌ఎఫ్‌ ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సమీపంలోని ప్రాంతాల నుంచి అదనపు బృందాలు సైతం వయనాడ్‌ కు చేరుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. కొండ చరియల కింద చాలా మంది ప్రజలు చిక్కుకుపోయి ఉంటారని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది.

ఇప్పటి వరకు 70 మందిని సహాయక బృందాలు కాపాడి ఆసుపత్రికి తరలించినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. మెప్పాడి ముండకైలో ప్రాంతాల్లో ఇప్పటి వరకు ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇక్కడ వందలాది వాహనాలు కొట్టుకుపోయాయి. చురుల్మల పట్టణంలో కొంత భాగం తుడిచి పెట్టుకుపోయినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇంత పెద్ద విపత్తును వయనాడ్‌ ఎన్నడూ చూడలేదని స్థానికులు తెలిపారు.

ఈ ప్రమాదం పై ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ స్పందించారు. సంబంధిత ప్రభుత్వ సంస్థలు , ఇతరత్రా యంత్రాంగమంతా సహాయక చర్యల్లో నిమగ్నమైనట్లు వెల్లడించారు. వయనాడ్‌ జిల్లా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. తొండర్‌నాడ్‌ గ్రామంలో నివసిస్తున్న నేపాలీ కుటుంబానికి చెందిన ఓ చిన్నారి ఈ ప్రమాదంలో మరణించింది.

Also read: అమెరికా మహిళను అడవిలో గొలుసుతో కట్టేసి..!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

🔴Live News Updates: పాత వాహనాలకూ కొత్త రిజిస్ట్రేషన్ నంబర్లు

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

New Update
Live News Updates in Telugu

Live News Updates in Telugu

🔴Live News Updates:

TS: పాత వాహనాలకూ కొత్త రిజిస్ట్రేషన్ నంబర్లు

తెలంగాణలో నెంబర్ ప్లేట్లు మార్చాల్సిన టైమ్ వచ్చేసింది. పాతదే అయినా హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ తప్పనిసరి చేసింది రవాణాశాఖ. సెప్టెంబర్ 30వ తేదీని గడువుగా నిర్ణయించింది. 

ts
High Security number plate

 

మీ వెహికల్ 2019 ఏప్రిల్ 1వ తేదీ కన్నా ముందు తయారైందా...అయితే అర్జంటుగా వెళ్ళి నంబర్ ప్లేట్ మార్చుకోండి.  పై తేదీ కన్నా ముందు తయారైన వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ బిగించుకోవాల్సిందేనని తెలంగాణ రవాణాశాఖ చెప్పింది.  దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. వాహన రకాన్ని బట్టి నంబర్‌ ప్లేట్‌కు కనిష్ఠంగా రూ.320.. గరిష్ఠంగా రూ.800గా ఛార్జీలను ఖరారు చేసింది. నకిలీ నంబర్‌ ప్లేట్లకు అడ్డుకట్ట వేయడం, దొంగతనాలను అరికట్టడం, వాహనాలు రహదారి భద్రతలను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు చేస్తున్నామని రవాణాశాఖ చెబుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మరకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. 

కచ్చితంగా మార్చాల్సిందే..

పాత వాహనాలకు నంబర్ ప్లేట్ మార్చాల్సి బాధ్యత యజమానిదే అని తేల్చి చెప్పింది రవాణాశాఖ. హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ మార్చుకోకపోతే వాహనాలను అమ్మాలన్నీ, కొనాలన్నా సాధ్యం కాదని తెలిపింది. అలాగే బీమా, పొల్యూషన్ సర్టిఫికేట్ లాంటివి కూడా లభించవు. పైగా సెప్టెంబర్ తర్వాత కొత్త నంబర్ ప్లేట్లు కనిపించకపోతే కేసులు కూడా నమోదు చేయనున్నారు.  ఇక ఈ నంబర్ ప్లేట్లు వాహన తయారీ సంస్థలు తమ డీలర్ల దగ్గర కూడా చేయించుకోవచ్చును. దీనికి సంబంధించిన సమాచారం, నంబర్ ప్లేట్ ధరలు డీలర్ దగ్గర కనిపిచేలా చేయనున్నారు. వాహనదారులు ఈ ప్లేట్‌ కోసం www.siam.in వెబ్‌సైట్‌లో ..వాహన వివరాలు నమోదు చేసి బుక్‌ చేసుకోవాలి. కొత్త ప్లేట్‌ బిగించాక ఆ ఫొటోను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి.

Also Read: Sai Sudarshan: చెండాడేశాడు భయ్యా.. చుక్కలు చూపించిన సుదర్శన్- ఎంత స్కోర్ చేశాడంటే?

Also Read:  Badminton: ఆసియా ఛాంపియన్ షిప్ లో పీవీ సింధు మొదటి విజయం

Advertisment
Advertisment
Advertisment