Maoist Vs Police: భారీ ఎన్‌కౌంటర్‌.. నలుగురు మావోలు మృతి!

ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్ జిల్లా చోటేతుంగాలి అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

New Update
Maoist Vs Police: భారీ ఎన్‌కౌంటర్‌.. నలుగురు మావోలు మృతి!

Encounter At Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. బీజాపూర్‌ జిల్లాలోని చోటే తుంగాలి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి పోలీస్ అధికారులు వెల్లడించారు. భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకోవడంతో ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టింది. ఆ ప్రాంతంలో ఇంకా ఎవరైనా మావోయిస్టులు దాగి ఉన్నారా? అనే అనుమానంతో సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. ఎలాంటి అనుమానాస్పద కదలికలు కనిపించినా వదలకుండా గాలిస్తున్నారు పోలీసులు.

ALSO READ: బీజేపీలోకి వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి

చోటే తుంగాలి అటవీ ప్రాంతంలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్, CRPF జవాన్లు ఉదయం 11 గంటలకు జాయింట్ ఆపరేషన్ చేశారు. ఈ క్రమంలోనే జంగ్లా పోలీస్ స్టేషన్ పరిధిలో భద్రతా బలగాలకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో పోలీసుల నుంచి తమను తాము కాపాడుకునేందుకు వారు కాల్పులు చేశారని పోలీసులు మీడియాకు తెలిపారు. దీంతో తాము కూడా ఎదురుకాల్పులు జరిపినట్లు తెలిపారు. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులను మృతి చెందినట్లు పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఘటనాస్థలం నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మృతదేహాలను కూడా గుర్తించినట్లు తెలిపారు.

సోమవారం పోలీసులకు ఓ మావోయిస్టు లొంగిపోయాడు. ఆ మరుసటి రోజే ఈ ఎన్‌కౌంటర్ జరగడం ఎన్నో అనుమానాలకు దారి తీసింది. లొంగిపోయిన మావోయిస్ట్‌పై రూ.8 లక్షల రివార్డు ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఇక ఇటీవల సుక్మా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒకరు చనిపోగా.. ఆ తర్వాత ఆదివారం కాంకేర్ జిల్లాలో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో మరో ముగ్గురు హతమైనట్లు పోలీసులు మీడియాకు వివరించారు. బుర్కలంక అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, డీఆర్‌జీ జవాన్లకు మధ్య ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్ట్ చనిపోయాడని అన్నారు.

ఆదివారం రోజు ఉదయం కాంకేర్‌ జిల్లాలోలోని కోయలిబేడా అటవీ ప్రాంతంలో డిస్ట్రిక్ట్ రిజర్వ్‌ గార్డ్స్‌ , బీఎస్‌ఎఫ్‌ జవాన్లు గాలింపు చర్యలు చేపట్టగా.. మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. దీంతో ముగ్గురు మావోయిస్టులు మరణించారని జిల్లా ఎస్పీ ఇందిర కల్యాణ్‌ తెలిపారు. సంఘటనా స్థలంలో ముగ్గురి మృతదేహాలతోపాటు 2 తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ ముగ్గురు మృతి చెందడంపై వారి కుటుంబ సభ్యులు మాత్రం వేరే వాదనను వినిపిస్తున్నారు. అసలు ఆ ముగ్గురు మావోయిస్టులే కాదని వారి కుటుంబాలు చెప్పడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలీసులు ఫేక్ ఎన్‌కౌంటర్ చేసి.. సామాన్యులను కాల్చి చంపి.. అది నక్సల్స్ ఏరివేత అని చెబుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు. దీంతో అసలు వాళ్లు మావోయిస్టులా లేక సాధారణ పౌరులా అని చర్చకు అక్కడ జోరందుకుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు