Malla Reddy Agriculture University : మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్రిక్తత! మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. ఆగస్టు 8 2024 అరుణ్ అనే విద్యార్ధి అనుమానాస్పద రీతిలో మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. ఎన్ఎస్యూఐ, ఏబీవీపీ, విద్యార్థి సంఘాలు కాలేజీలోకి ప్రవేశించి నిరసనలు తెలిపాయి. By Bhavana 10 Aug 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి BRS MLA Malla Reddy : బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే మల్లారెడ్డికి సంబంధించిన మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ (Malla Reddy Agriculture University) లో ఉద్రిక్తత నెలకొంది. ఆగస్టు 8 2024 అరుణ్ అనే విద్యార్ధి అనుమానాస్పద రీతిలో మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. ఎన్ఎస్ యూఐ, ఏబీవీపీ, విద్యార్థి సంఘాల నేతలు కాలేజీలోకి ప్రవేశించి నిరసనలు తెలిపారు. విద్యార్థి మరణంపై కాలేజీ యాజమాన్యం స్పందించాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీ ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం చేశారు. క్లాసులను నిలిపివేసి విద్యార్థులతో కలిసి గ్రౌండ్ లో భైఠాయించారు. విద్యార్థి తల్లిదండ్రులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాలేజీ వద్దకు చేరుకున్న పేట్ బాషీరాబాద్ పోలీసులు విద్యార్థి సంఘ నేతలను మందలించే ప్రయత్నం చేశారు. ఘటనపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. Also Read : ప్రకంపనలు సృష్టిస్తోన్న RTV కథనాలు.. Euro Exim Bankపై ఆర్థిక శాఖకు లేఖ! #hyderabad #protest #malla-reddy-agriculture-university సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి