Maldives: మాల్దీవుల అధ్యక్షుడి యూటర్న్‌‌–భారత్ తమకు ముఖ్యం అంటూ వ్యాఖ్యలు

మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు మరోసారి యూటర్న్ తీసుకున్నారు. ఇంతకు ముందంతా అంటీ ముట్టనట్టుగా ఉన్న ఆయన ఇప్పుడు సడెన్‌గా..తమ సన్నిహిత దేశాల్లో భారత్ ఒకటి అంటూ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు తమకు ముఖ్యభాగస్వామి అని కూడా అన్నారు.

New Update
Maldives: మాల్దీవుల అధ్యక్షుడి యూటర్న్‌‌–భారత్ తమకు ముఖ్యం అంటూ వ్యాఖ్యలు

Mohammad Muizzu:  భారత విదేశాంగ మంత్రి జై శంకర్ ప్రస్తుతం మాల్దీవుల్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జుని కలిశారు. ఈ సందర్భంగా వారు అనేక అంశాల మీద చర్చలు జరిపారు. తర్వాత మీడియాతో మంత్రి జైశంకర్ మాట్లాడుతూ తమ ప్రజలు, ఈ ప్రాంత ప్రయోజనాల కోసం భారత్‌-మాల్దీవుల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయన్నారు.

మరోవైపు ఇదే విషయం మీద మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు మాట్లాడుతూ...భారత మంత్రి జైశంకర్‌‌ను కలవడం ఆనందంగా ఉందని చెప్పారు. తమ సన్నిహిత దేశాల్లో భారత్ ఒకటని అన్నారు. ఆర్ధికంగా భారత్‌ తమ దేశానికి ముఖ్యభాగస్వామి అని చెప్పారు. తమ దేశం అవసరంలో ఉన్నప్పుడల్లా సాయం చేయడంతో భారత్‌ ముందు ఉంటుందని చెప్పుకొచ్చారు. భారత్‌తో ఉన్న సన్నిహిత సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటామని ముయిజ్జు వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు అంటీముట్టనట్టుగా ఉన్న మాల్దీవుల దేశాధ్యక్షుడు ఒక్కసారిగా ఇలా యూటర్న్‌ తీసుకోవడం..రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.

ప్రధాని మోదీ లక్షదీవులను పర్యటించి, వాటిని ప్రమోట్ చేశాక..మాల్దీవులకు, భారత్‌కు మధ్య మాటల యుద్ధం నడిచింది. మాల్దీవులకు చెందిన మంత్రులు భారతదేశం గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో రెండు దేశాల మధ్య దూరం పెరిగింది. మయిజ్జు రెండోసారి మాల్దీవులకు అధ్యక్షుడు అయిన తర్వాత కూడా అంటీముట్టనట్లుగానే ఉన్నారు. అయితే భారత్‌తో గొడవ జరిగిన తర్వాత మల్దీవుల ఆర్ధిక పరిస్థితి బాగా దెబ్బతింది. మాల్దీవుల పర్యాటక రంగంపై ఇది తీవ్ర ప్రభావం చూపించింది. ఈ నేపథ్యంలో మాల్దీవుల ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. అందుకే ఇప్పుడు ముయిజ్జు ఇలా మాట్లాడుతున్నారని అంటున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA: 90 రోజులు టారీఫ్ లకు బ్రేక్..అంతా ఒట్టిదే..వైట్ హౌస్

ట్రంప్ టారీఫ్ ల దెబ్బకు ప్రపంచ మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. దీంతో అమెరికా అధ్యక్షుడు సుంకాలను ఆపేస్తారనే వార్తలు వచ్చాయి. అయితే వాటిని వైట్ హౌస్ కొట్టిపడేసింది. టారీఫ్ లను ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. 

New Update
us

White House

 ప్రతీకార సుంకాలను ఆపేది లేదని తేల్చి చెప్పారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, వైట్ హౌస్. ఏది ఏమైనా టారీఫ్ లను కొనసాగిస్తామని చెప్పారు. మా విధానంలో ఎటువంటి మార్పూ ఉండదు అన్నారు. అయితే ఏ దేశమైనా టారీఫ్ ల మీద చర్చకు వస్తే తాము సుముఖంగా ఉన్నామని ట్రంప్ స్పష్టం చేశారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త సుంకాలను 90 రోజుల పాటు నిలిపివేయాలని ఆలోచిస్తున్నారనే వార్తలను వైట్ హౌస్ ఖండించింది. దానిపై వస్తున్న వార్తలన్నీ నకిలీవి అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అన్నారు. 

 

ఒక్క పోస్ట్ తో అంతా తారుమారు..

నిన్న ఎక్స్ లో వాల్టర్ బ్లూమ్ బెర్గ్, నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ డైరెక్టర్ కెవిన్ హాసెట్,  అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా మినహా అన్ని దేశాలకు 90 రోజుల సస్పెన్షన్ గురించి ఆలోచిస్తున్నారని పోస్ట్ లు వచ్చాయి. దీంతో మార్కెట్లో గందరగోళం మొదలైంది.  ఈ ఒక్క పోస్ట్ తో స్టాక్ మార్కెట్ హెచ్ థగ్గులకు గురైంది. దీని గురించే ఈరోజు వైట్ హౌస్  మాట్లాడింది. హాసెట్ చెప్పినదాన్ని జనాలు తప్పుగా అర్ధం చేసుకున్నారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అన్నారు. ట్రంప్ కు అలాంటి ఆలోచన లేదని స్పష్టం చేశారు. అయితే అసలు ఈ చర్చ అంతా బిలియనీర్ హెడ్జ్ ఫండ్ పెట్టుబడిదారుడు, ట్రంప్ మద్దతుదారుడు అయిన బిల్ అక్మాన్ ఆదివారం ట్రంప్ అసమాన సుంకాల ఏర్పాట్లను పరిష్కరించడానికి, దేశానికి గణనీయమైన పెట్టుబడులను ఆకర్షించడానికి "90 రోజుల గడువు" అమలు చేయాలని సూచించిన తర్వాత చర్చ ప్రారంభమైంది.

 today-latest-news-in-telugu | usa | donald trump tariffs | white-house

Also Read: RCB VS MI: ముంబయ్ గెలుస్తుంది అనుకుంటే...బెంగళూరు తన్నుకుపోయింది

Advertisment
Advertisment
Advertisment