Malla Reddy: మల్కాజ్‌గిరిలో మైనంపల్లి వర్సెస్ మల్లారెడ్డి

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. అధికార, విపక్ష నేతలు ఢీ అంటే ఢీ అనేలా మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఓవైపు అభ్యర్థుల ప్రకటనతో బీఆర్ఎస్ ప్రచారంలో దూసుకుపోతుండగా.. మరోవైపు టికెట్ రాని అసంతృప్తులు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు.

New Update
Malla Reddy: మల్కాజ్‌గిరిలో మైనంపల్లి వర్సెస్ మల్లారెడ్డి

Malla Reddy: ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. అధికార, విపక్ష నేతలు ఢీ అంటే ఢీ అనేలా మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఓవైపు అభ్యర్థుల ప్రకటనతో బీఆర్ఎస్ ప్రచారంలో దూసుకుపోతుండగా.. మరోవైపు టికెట్ రాని అసంతృప్తులు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు నాయకులు కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మాత్రం టికెట్ వచ్చినా తన కుమారుడు కోసం గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించక ముందే తిరుమలలో మంత్రి హరీష్‌రావు టార్గెట్‌గా తీవ్ర విమర్శలు చేసి సంచలనం రేపారు. అనంతరం పరిణామాలతో కుమారుడు టికెట్ కోసం కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. దీంతో బలమైన మైనంపల్లిని ఢీకొట్టే మల్కాజ్‌గిరి బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

అయితే మల్కాజిగిరి అసెంబ్లీ బరిలో గులాబీ పార్టీ తరపున మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి పోటీకి దిగనున్నారు. అధిష్టానం అధికారికంగా ప్రకటించకపోయినా దాదాపు ఆయన అభ్యర్ధిత్వం ఖరారైపోయింది. ఈ క్రమంలోనే మల్లారెడ్డి తన అల్లుడుతో కలిసి మల్కాజ్‌గిరిలో పర్యటించారు. పర్యటనలో భాగంగా మాట్లాడిన మల్లారెడ్డి.. మైనంపల్లికి సవాల్ విసిరారు. నియోజకవర్గానికి రాముడొచ్చాడు.. రావణసురుడిని కాల్చివేస్తాం అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు మల్లన్న. మైనంపల్లిపై లక్ష ఓట్ల మెజార్టీతో తన అల్లుడు రాజశేఖర్ రెడ్డి తప్పకుండా విజయం సాధిస్తారని ఆయన జోస్యం చెప్పారు. ఇటు మైనంపల్లి.. అటు మల్లారెడ్డి ఇద్దరు ఆర్థికంగా, సామాజికంగా బలమైన నేతలు కావడంతో ఈసారి మల్కాజ్‌గిరి పోరు రసవత్తరంగా ఉండనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరోవైపు మైనంపల్లి రాకను కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నెల 27న మైనంపల్లి తన కుమారుడు రోహిత్‌తో కలిసి మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు. తనకు మల్కాజిగిరి, తన కొడుకు రోహిత్‌కు మెదక్ సీట్ల ఒప్పందంతోనే ఆయన హస్తం తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటూ మరో నలుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని సమాచారం. తండ్రికొడుకులకు సీట్లు ఇచ్చేందుకు అధిష్టానం ఒప్పుకున్నాకే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీ అయ్యారని తెలుస్తోంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Madhya Pradesh:క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!

మధ్యప్రదేశ్‌ లో ఓ వింత దొంగతనం జరిగింది. అప్పుల వాళ్ల బాధలు భరించలేక దొంగతనం చేశాడు ఓ వ్యక్తి.అంతేకాకుండా తనని క్షమించాలని,ఆరు నెలల్లో ఆ డబ్బును తిరిగి ఇచ్చేస్తానని,లేని పక్షంలో పోలీసులకు పట్టించవచ్చని నిందితుడు ఓ లేఖను కూడా ఉంచాడు.

New Update
money

money

అప్పుల వాళ్ల వేధింపులు భరించలేకపోతున్నానంటూ ఓ బాధితుడు దుకాణంలో చోరీకి పాల్పడ్డాడు.అంతటితో ఆగకుండా..తనను క్షమించాలని,డబ్బును ఆర్నెళ్లలో తిరిగి ఇచ్చేస్తానని టైప్‌ చేసి ఉంచిన లేఖను సైతం వదిలి వెళ్లడం గమనార్హం.మధ్యప్రదేశ్‌ లోని ఖర్గోన్‌ జిల్లాల్లో ఓ వింత వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

Also Read: ఐదు విమానాల్లో అమెరికాకు ఐఫోన్లు.. ట్రంప్ సుంకాలకు అలా షాకిచ్చిన యాపిల్!

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ...స్థానికంగా ఓ దుకాణంలో ఆదివారం అర్థరాత్రి దొంగతనం జరిగింది. నిందితుడు రూ.2.45 లక్షలు ఎత్తుకెళ్లాడు.ఈ విషయాన్ని గురించిన యజమాని...ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకుని వెళ్లాడు. ఈ క్రమంలోనే దర్యాప్తు చేపట్టిన పోలీసులకు దుకాణంలో ఓ లేఖ దొరికింది.

Also Read: TRUMP Tariffs: టారీఫ్‌ల విషయంలో వెనక్కి తగ్గిన ట్రంప్.. ఈ దేశాలపై సుంకాలు రద్దు..!

తాను దొంగతనం చేయాలనుకోలేదని, కానీ ...వేరే మార్గం లేకపోయిందని నిందితుడు అందులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.నేను పొరుగు ప్రాంతంలోనే ఉంటాను. కొంతకాలంగా అప్పుల వాళ్ల వేధింపులు ఎక్కువ అయ్యాయి. రామనవమి రోజు చోరీకి పాల్పడినందుకు క్షమాపణలు.నేను దొంగతనం చేయాలనుకోలేదు.

కానీ వేరే మార్గం లేకపోయింది. అవసరమైనంత డబ్బే తీసుకున్నాను. ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను.లేని పక్షంలో పోలీసులకు పట్టించొచ్చు.కానీ ఇప్పుడు మాత్రం ఈ డబ్బు తీసుకుని వెళ్లడం నాకు చాలా ముఖ్యం అని ఆ లేఖలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దుకాణం యజమాని సైతం బ్యాగులో రూ. 2.84 లక్షలు భద్రపర్చగా..అందులో రూ.2.45 లక్షలు కనిపించడం లేదని చెప్పినట్ఉ తెలుస్తుంది.

నిందితుడ్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read: Sharmila fires on YCP :  ప్రజలు చెప్పుతో కొట్టినా పద్ధతి మారలేదు.. వైసీపీపై షర్మిల సంచలన వ్యాఖ్యలు!

Also Read: Trump's another shock : హెచ్ 1బీ, ఎఫ్1 వీసాదారులు, గ్రీన్ కార్డు దరఖాస్తుదారులకు ట్రంప్ మరో షాక్..! హెల్ప్ డెస్క్ సస్పెండ్

 note | madhya-pradesh | madhya pradesh news | apology | steals money | police | letter | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment