Gautam Ghattamaneni : మహేష్ కొడుకు ఫస్ట్ స్టేజ్ పెర్ఫార్మెన్స్.. గౌతమ్ యాక్టింగ్ పై నమ్రత పోస్ట్.. గర్వంగా ఉందంటూ!

మహేష్ తనయుడు గౌతమ్ తాజాగా లండన్ లో తన ఫస్ట్ స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అతడిఫెర్పార్మెన్స్ కి అందరూ ఫిదా అయ్యారట. ఈ విషయాన్ని అతని తల్లి నమ్రత సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. గౌతమ్‌ ఫస్ట్‌ థియేటర్‌ స్టేజ్‌ పెర్ఫామెన్స్‌ అద్భుతంగా ఉందని పోస్ట్ లో పేర్కొంది.

New Update
Gautam Ghattamaneni : మహేష్ కొడుకు ఫస్ట్ స్టేజ్ పెర్ఫార్మెన్స్.. గౌతమ్ యాక్టింగ్ పై నమ్రత పోస్ట్.. గర్వంగా ఉందంటూ!

Mahesh Babu's Son Gautam First Stage Performance : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ తనయుడు గౌతమ్ ప్రస్తుతం విదేశాల్లో చదువుకుంటున్న విషయం తెలిసిందే. అయితే మహేష్ ఫ్యాన్స్ వారసుడి సినీ ఎంట్రీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే తన తండ్రి యాక్ట్ చేసిన 'వన్.. నేనొక్కడినే' సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆకట్టుకున్నాడు. ఇక హీరోగా ఎంట్రీ ఇవ్వడమే మిగిలింది. తాజాగా లండన్ లో గౌతమ్ తన ఫస్ట్ స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అతడి ఫెర్పార్మెన్స్ కి అందరూ ఫిదా అయ్యారట. ఈ విషయాన్ని అతని తల్లి నమ్రత సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది.

అద్భుతంగా ఉంది...

గౌతమ్‌ లండన్‌లో ఇచ్చిన తొలి ప్రదర్శన గురించి నమ్రత అభిమానులకు తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేసింది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టింది." గౌతమ్‌ ఫస్ట్‌ థియేటర్‌ స్టేజ్‌ పెర్ఫామెన్స్‌ అద్భుతంగా ఉంది. చూసిన వారంతా ఎంజాయ్‌ చేశారు. చిన్నారుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు ‘జాయ్‌ ఆఫ్‌ డ్రామా’ నిర్వహించే సమ్మర్‌ ప్రోగ్రామ్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. స్నేహితులు, కుటుంబంతో కలిసి ఇక్కడకు రావడం సంతోషంగా ఉంది’" అని రాసుకొచ్చింది.

Also Read : ‘ఇండియన్ 2’ కు ‘A’ సర్టిఫికెట్.. రన్ టైం అన్ని గంటలా?

ఇందుకు సంబంధించి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం తెలిసి ఘట్టమనేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతూ గౌతమ్ మూవీ ఎంట్రీ కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నట్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా గౌతమ్ ఫస్ట్ స్టేజ్ పెర్ఫార్మెన్స్ ను చూసేందుకు మహేశ్‌ బాబు, సితార, నమ్రతా సోదరి శిల్పా శిరోద్కర్‌ తదితరులు హాజరయ్యారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

pahalgam Terror Attack: ఉగ్రదాడి నుంచి త్రుటిలో తప్పించుకున్న బాలీవుడ్‌ జంట!

జమ్మూకశ్మీర్‌ లోని పహల్గం లో జరిగిన ఉగ్రదాడిలో అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.ఈ దాడి నుంచి నటి దీపికాకాకర్‌ తన భర్త షోయబ్‌త్రుటిలో తప్పించకున్నారు.ఈ విషయం గురించి వారు స్వయంగా వెల్లడించారు.

New Update
deeika

deeika

 


జమ్మూకశ్మీర్‌ లోని పహల్గం లో జరిగిన ఉగ్రదాడిలో అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈదాడి నుంచి మరికొందరు వారి ప్రాణాలను అరచేతపట్టుకొని బయటపడ్డారు.నటి దీపికాకాకర్‌ తన భర్త షోయబ్‌ ఇటీవల కశ్మీర్‌ వెళల్లారు. విహార యాత్రకు సంబంధించిన ఫొటోలను ఆదివారం ఇన్‌ స్టాలో పంచుకున్నారు.

కశ్మీర్‌ లోని అందమైన ప్రదేశాలను వీడియోలు తీసి షేర్‌ చేశారు. దాడి జరిగిన తరువాత వీరి అభిమానులు ఆందోళన చెందారు. ఈ ఘటనలో వారు చిక్కుకుపోయారేమో అని మెసేజ్‌ లు పెట్టారు.తాజాగా దీపికా, ఆమె భర్త షోయబ్‌ ఢిల్లీ కి వచ్చేసినట్లు చెబుతూ ఓ పోస్టు పంచుకున్నారు. 

మేం క్షేమంగా ఉన్నాం.మంగళవారం ఉదయమే కశ్మీర్‌ నుంచి బయల్దేరాం. సురక్షితంగా ఢిల్లీ చేరుకున్నాం.ఎవరూ ఆందోళన పడకండి అని ఇన్‌ స్టాలో తెలిపారు. తాము క్షేమంగా ఉన్నామని తెలుపుతూ దీపికా భర్త నటుడు షోయబ్ పెట్టిన పోస్ట్‌ ఇప్పుడు విమర్శలకు దారి తీసింది. వారు ఢిల్లీ చేరుకున్నట్లు నటుడు తెలిపాడు.

ఈ పర్యటన పై వ్లాగ్‌ చేసినట్లు ప్రకటించారు.అది త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు.ఒక వైపు పెనువిషాదం పై దేశమంతా బాధపడుతుంటే ఇప్పుడు వ్లాగ్‌ ప్రచారం చేసుకుంటున్నారా..? అంటూ కొందరు నెటిజన్ లు విమర్శిస్తూ కామెంట్లు పెడుతున్నారు. 

జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లా పహల్గామ్ లో టూరిస్ట్ లపై జరిగిన టెర్రర్ ఎటాక్‌ లో 27మంది మృతి చెందారు.  మరో 20మంది ప్రాణాపాయస్థితిలో ఉన్నారు.  సాధారణ పౌరులపై ఇదే అతిపెద్ద ఉగ్రదాడి కావడం గమనార్హం.  చాలా ఏళ్ల తర్వాత దేశంలో ఇదే భారీ ఉగ్రదాడి కూడా.  పర్యాటకులనే టార్గెట్ చేసుకున్న ఉగ్రవాదులు.. ఆర్మీ డ్రెస్‌లో వచ్చి టూరిస్టులపై కాల్పులు జరిపారు.   వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్మీ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. 

Also Read:BIG BREAKING : జమ్మూకశ్మీర్‌ ఉగ్రదాడిలో 27మంది మృతి!

Also Read: J&K Terror Attack : మీరేం మగాళ్లు రా.. ఆర్మీ డ్రెస్‌లో వచ్చి కాల్పులు!

pahalgam army operation | Pahalgam attack | pahalgam breaking news | pahalgam latest news | bollywood | latest-news

Advertisment
Advertisment
Advertisment