Mahesh Babu - Balakrishna : మహేష్, బాలయ్య కాంబోలో మల్టీస్టారర్.. లీక్ చేసిన థమన్, డైరెక్టర్ ఎవరంటే?

బాలకృష్ణ, మహేష్ బాబు కాంబోలో మల్టీస్టారర్ రాబోతుంది. ఈ విషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ లీక్ చేశారు. ఇండియన్ ఐడల్ ప్రోగ్రాంలో థమన్ మాట్లాడుతూ..'బాలకృష్ణ, మహేష్ బాబు కలిసి సినిమా చేస్తారు. ఆల్రెడీ నేను కథ విన్నాను' అని చెప్పారు. దీంతో తమన్ వ్యాఖ్యలు వైరలవుతున్నాయి.

New Update
Mahesh Babu - Balakrishna : మహేష్, బాలయ్య కాంబోలో మల్టీస్టారర్.. లీక్ చేసిన థమన్, డైరెక్టర్ ఎవరంటే?

Mahesh Babu - Balakrishna : టాలీవుడ్‌లో ప్రస్తుతం మళ్లీ మల్టీస్టారర్ ట్రెండ్ కొనసాగుతోంది. రీసెంట్ టైమ్స్ లో 'RRR' సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌ స్క్రీన్‌ని షేర్ చేసుకోగా.. 'వాల్తేరు వీరయ్య'లో మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహరాజా రవితేజ కలిసి నటించారు. అలాగే 'బ్రో' మూవీలో పవన్ కళ్యాణ్, సాయి తేజ్ సందడి చేశారు.ఇక తాజాగా ఎవరూ ఊహించని కాంబోలో కొత్త మల్టీస్టారర్ తెరకెక్కనుంది.

ఈ విషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ స్వయంగా లీక్ చేయడం విశేషం. తాజాగా తెలుగు ఇండియన్ ఐడల్ ప్రోగ్రాంలో సింగర్ శ్రీరామచంద్ర మహేష్ బాబు, బాలకృష్ణ ఇద్దరి సినిమాల్లో ఒకేసారి అవకాశం వస్తే ఏ సినిమా చేస్తారు? అని తమన్ ని అడగ్గా.. ఇందుకు తమన్ బదులిస్తూ..' బాలకృష్ణ, మహేష్ బాబు గారు కలిసి చేసే సినిమాకు చేస్తాను. బాలకృష్ణ – మహేష్ బాబు గారి మల్టీస్టారర్ సినిమా రావొచ్చు.


Also Read : నెట్టింట హాట్ టాపిక్ గా మారిన ‘పుష్పరాజ్’ గణేశుడు.. తిట్టిపోస్తున్న నెటిజన్లు

ఆల్రెడీ నేను కథ కూడా విన్నాను' అని చెప్పారు. దీంతో తమన్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. బాలయ్య, మహేష్ ఫ్యాన్స్ ఈ వ్యాఖ్యలని షేర్ చేస్తూ ఈ ఇద్దరి కాంబోలో సినిమా పడితే థియేటర్స్ దద్దరిల్లడం ఖాయం అంటున్నారు. మరి ఈ ఇద్దరి కాంబోను బిగ్ తెరకెక్కించే డైరెక్టర్ ఎవరు? ఆయన ఎలాంటి కథ రాసుకున్నారు? అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

చిత్రనిర్మాత కరణ్ జోహార్ ఇండియన్ క్రికెటర్ ఎం. ఎస్ ధోని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నట్లు వీడియో రిలీజ్ చేశారు. దీంతో ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

New Update
MS DHONI VIDEO

MS DHONI VIDEO

MS Dhoni టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎం. ఎస్ ధోని క్రికెట్ తో పాటు సినిమా రంగంలోకి కూడా అడుగుపెట్టారు. 2023లో  'లెట్స్ గెట్ మ్యారీడ్' అనే సినిమాకు డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశారు. అయితే ఇప్పుడు ధోని హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి కారణం బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ షేర్ చేసిన వీడియో.  ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నారు అంటూ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో ధోని హార్ట్  సింబల్ బెలూన్ చేతిలో పట్టుకొని కనిపించారు. దీంతో ఫ్యాన్స్ ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అని అనుకుంటున్నారు. అంతేకాదు కరణ్ ఈ వీడియోను షేర్ చేయడంతో.. ధోనిని కరణ్ జోహార్ పరిచయం చేయబోతున్నారా అని కామెంట్లు పెడుతున్నారు. కానీ.. ఇంతలోనే అసలు విషయం బయటపడింది.

యాడ్ ఫిల్మ్ షూట్

 ఆ వీడియో ఒక యాడ్ ఫిల్మ్ షూట్ కి సంబంధించినదని తెలిసింది. ఈ వీడియోకి గల్ఫ్ ఆయిల్ కంపెనీని ట్యాగ్ చేయడంతో.. ఇది యాడ్ షూట్ కి సంబంధించిన వీడియో అని అర్థమైంది. ఏదేమైనా మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే గతంలో కూడా ధోని సినిమాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. ఇటీవలే రామ్ చరణ్ - బుచ్చిబాబు rc16 లో ధోని క్యామియో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత చిత్రబృందం అలాంటిదేమి లేదని చెప్పడంతో పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది.  

ప్రస్తుతం ధోని  CSK కెప్టెన్‌గా గా వ్యవహరిస్తున్నారు. వరుసగా ఐదు మ్యాచుల పరాజయాల తర్వాత.. తాజాగా జరిగిన లక్నో సూపర్ జెయింట్స్‌ వర్సెస్ CSK మ్యాచ్ లి చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. ఈ విజయంలో ధోని కీలక పాత్ర పోషించడం విశేషం. 

telugu-news | latest-news | ms-dhoni | karan-johar

Advertisment
Advertisment
Advertisment