Maharashtra: మహారాష్ట్రలో నాలుగేళ్ళ చిన్నారుల పై అఘాయిత్యం.. టాయిలెట్‌కు తీసుకెళ్లి..!

మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. బదలాపూర్‌ ప్రీ ప్రైమరీ స్కూల్‌లో క్లీనింగ్ బాయ్ గా పనిచేస్తున్న 23ఏళ్ల అక్షయ్ షిండే నాలుగేళ్ల చిన్నారులపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆగస్టు 12న ఈ ఘటన జరిగింది. చిన్నారులను టాయిలెట్‌కు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తుంది.

New Update
Maharashtra: మహారాష్ట్రలో నాలుగేళ్ళ చిన్నారుల పై అఘాయిత్యం.. టాయిలెట్‌కు తీసుకెళ్లి..!

Maharashtra: బద్లాపూర్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్ లో 23 ఏళ్ళ యువకుడు అక్షయ్ షిండే క్లీనింగ్ బాయ్ గా పనిచేస్తున్నాడు. ఆగస్టు1 2024న షిండే కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించబడ్డాడు. ఇతను అక్కడ ప్రీ ప్రైమరీ చదువుతున్న విద్యార్థుల సహాయక సిబ్బందింగా, బాలికల టాయిలెట్లను శుభ్రపరిచే విధులను నిర్వహించేవాడు. ఈ క్రమంలో అక్షయ్ షిండే దారుణానికి ఒడిగట్టాడు. నాలుగేళ్ళ చిన్నారులను టాయిలెట్ కు తీసుకెళ్లే నెపంలో వారి పై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

ప్రైవేట్ భాగాలలో నొప్పి ఉందని పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వెళ్లిన ఓ చిన్నారి తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఆమె టాయిలెట్ ఉపయోగించడానికి వెళ్ళినప్పుడు ఆమె ప్రైవేట్ భాగాలను తాకినట్లు వారికి చెప్పింది. దీంతో షాక్‌కు గురైన తల్లిదండ్రులు అదే తరగతికి చెందిన మరో బాలిక తల్లిదండ్రులను విచారించారు. వారు కూడా తమ కూతురు స్కూల్ కు వెళ్లాలంటేనే భయపడుతోందని తెలిపారు. ఆ తరువాత తల్లిదండ్రులు బాలికలను స్థానిక వైద్యునితో పరీక్షించగా, వారిద్దరూ లైంగిక వేధింపులకు గురయ్యారని వెల్లడించారు.

దీంతో ఆగ్రహం చెందిన తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. నిందితుడి పై POCSO చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అయితే విచారణలో పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం, బాలికల టాయిలెట్ విషయంలో మహిళా అటెండర్ నియమించకపోవడం వంటి విషయాలు బయటకు వచ్చాయి.

Also Read: NTR District: NTR జిల్లాలో దారుణం ... భవనంలోకి తీసుకెళ్లి మైనర్ బాలికపై అత్యాచారం - Rtvlive.com

Advertisment
Advertisment
తాజా కథనాలు