Murder: అక్రమ సంబంధానికి అడ్డొస్తుందని నిండు గర్భావతిని చంపిన భర్త! మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో సంచలనం సృష్టించిన రేష్మా హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆ మహిళను చంపిన హంతకుడు తన భర్తనే అని గుర్తించారు. పోలీసులను తప్పుదోవ పట్టించిన శుభమ్ ను సీసీ పుటేజీ ఆధారంగా అరెస్ట్ చేశారు. By srinivas 08 May 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి Madhya Pradesh: ఇటీవల మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో సంచలనం సృష్టించిన రేష్మా హత్య కొలిక్కి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని పట్టుకున్నారు. ఈ మేరకు శనివారం రాత్రి వారిద్దరూ తమ కారులో మధోతల్ ప్రాంతం గుండా వెళుతుండగా దోచుకోవాలనే ఉద్దేశంతో దుండగులు తనపై దాడి చేశారని శుభమ్ అనే వ్యక్తి పోలీసులకు కంప్లైట్ చేశాడు. అలాగే తన భార్య పర్సు, నగలను దొంగలు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారని చెప్పాడు. ఇది కూడా చదంవండి: KA Paul: తాటి ముంజలు కొట్టిన కేఏ పాల్.. రాష్ట్రం అప్పులు తీరాలంటే ఇలా చేయండి..! మరో మహిళతో అక్రమ సంబంధం.. ఈ మేరకు జబల్పూర్ పోలీసు సూపరింటెండెంట్ ఆదిత్య ప్రతాప్ సింగ్ వెంటనే దర్యాప్తు చేపట్టగా.. సంచలన విషయాలు బయటపడ్డాయి. శుభ్ మన్ గర్భంతో ఉన్న రేష్మను గొతు నులిమి చంపినట్లు గుర్తించారు. నిందితుడు తనపై దాడి జరిగిందని చెప్పిన ప్రాంతంలో సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా తనిఖీ చేపట్టగా అసలు నిజం బయటపడింది. విచారణలో హత్య రహస్యం బయటపడింది. తన భార్యను గొంతుకోసి హత్య చేసినట్లు శుభం పోలీసుల ఎదుట అంగీకరించాడని ఎస్పీ ఆదిత్య ప్రతాప్ సింగ్ తెలిపాడు. నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఇందుకు సహకరించిన అతని స్నేహితులు ప్రహ్లాద్ సింగ్ ఠాకూర్ (27), అనురాగ్ కుష్వాహా (21), శిబ్బు (24)లను కూడా అరెస్టు చేసినట్లు తెలిపారు. శుభమ్ చౌదరి మరో మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నందుకే ఈ దారుణానికి పాల్పడ్డట్లు జబల్పూర్ పోలీస్ సూపరింటెండెంట్ ఆదిత్య ప్రతాప్ సింగ్ తెలిపారు. #reshma-murder-case #madhya-pradesh సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి