Madhu Yashki: నీలాగా చిల్లరగాన్ని కాదు.. వారానికి 4సార్లు అక్కడికెళ్తావని తెలుసు: కేటీఆర్‌పై మధుయాష్కీ ఫైర్

వారానికి నాలుగు సార్లు ఫామ్ హౌస్‌కు వెళ్లి కేటీఆర్‌లా ఎంజాయ్ చేసే అలవాటు తనకు లేదని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ అన్నారు. 'నేను ప్రజల్లో ఉండేటోన్ని. అందరిలా సాధారణ జీవితాన్ని లీడ్ చేస్తా. చిల్లర మాటలు మానుకో' అంటూ కేటీఆర్‌కు మధుయాష్కీ వార్నింగ్ ఇచ్చారు.

New Update
Madhu Yashki: నీలాగా చిల్లరగాన్ని కాదు.. వారానికి 4సార్లు అక్కడికెళ్తావని తెలుసు: కేటీఆర్‌పై మధుయాష్కీ ఫైర్

Telangana: అబద్దాలు, చిల్లర మాటలు మాట్లాడడం ఇకనైనా మానుకోవాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌పై పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ లాగా రాజభోగాలు అనుభవించేందుకు తనకు ఫామ్ హౌస్ లేదంటూ సంచలన ఆరోపణలు చేశారు. వారానికి నాలుగు సార్లు జన్వాడలో ఫామ్ హౌస్ వెళ్లి కేటీఆర్ ఎంజాయ్ చేస్తాడని, తనకు అలాంటి అలవాట్లు, వక్ర బుద్ధులు లేవంటూ మండిపడ్డాడు.

బినామీ పేర్లతో మెయింటెన్ చేస్తూ..
ఈ మేరకు మధుయాష్కీ మాట్లాడుతూ.. కేటీఆర్.. 111 జీవోకు వ్యతిరేకంగా ఫామ్ హౌచ్ నిర్మించావు. ఆ ఫామ్ హౌస్ ను బినామీ పేర్లతో మెయింటెన్ చేస్తున్నావ్. నీలాగా నాకు అలా విలాసవంతమైన ఫామ్ హౌస్ లు లేవు కేటీఆర్. నేను ప్రజల్లో ఉండేటోన్ని.. అందరిలా సాధారణ జీవితాన్ని లీడ్ చేస్తాను. మాకు గండిపేట దగ్గర మామిడి తోట, సపోటా తోట ఉన్న మాట వాస్తవమే. కానీ అక్కడ వాచ్ మెన్ కుటుంబం ఉండడం కోసం పాతబడిన చిన్న నిర్మాణం నిర్మాణం తప్పా.. ఫామ్ హౌస్ లేదు. అయినా ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో వ్యవసాయం, తోటల పెంపకం చేయొచ్చు అనే కనీస అవగాహన నీకు లేనట్లుంది. కానీ నాకు ఫామ్ హౌస్ ఉన్నట్లు.. అది ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో ఉన్నట్లు కేటీఆర్ ఇటీవల పలుమార్లు ప్రస్తావించడం సిగ్గుచేటు చర్యగా పేర్కొన్నారు. తన ఫామ్ హౌస్ ఎక్కడ ఉందో.. ఎంత విలాసంగా నిర్మించుకున్నానో కేటీఆరే చూపించాలన్నారు. ఇకనైన చిల్లర మాటలు మానుకోవాలంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు