Shanthi-mdan: నేను అమెరికాలో ఉండగానే వాళ్లిద్దరూ.. మదన్మోహన్ మరో సంచలనం! భార్య శాంతి కడుపున పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరో తేల్చాలంటూ మదన్ మోమన్ మరో బాంబు పేల్చాడు. తాను అమెరికాలో ఉండగానే శాంతి, విజయసాయిరెడ్డి కలిశారని ఆరోపించారు. కానీ శాంతి ఐవీఎఫ్ ద్వారా బిడ్డను కన్నానని చెప్పడం ఆశ్చర్యంగా ఉందంటూ సంచలన ఆరోపణలు చేశాడు. By srinivas 19 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Madan mohan: భార్య, దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతితో తనకు చట్టపరంగా విడాకులు కాలేదని మదన్మోహన్ చెప్పారు. గత రెండేళ్లుగా తాను అమెరికాలో ఉండి జనవరిలో ఇక్కడికి వచ్చిన తర్వాత వారి బాగోతం మొత్త బయటపడిందని తెలిపారు. ఇది బడుగు, బలహీనవర్గాల ఆత్మగౌరవానికి సంబంధించిన సున్నితమైన అంశమని, ఐవీఎఫ్ ద్వారానే బిడ్డను కన్నట్లు శాంతి తనకు చెప్పిందంటూ మరోసారి మీడియా సమావేశంలో వివరించాడు. శాంతి విజయసాయిరెడ్డి పేరు చెప్పింది.. 'శాంతి చెప్పిన మాటలు విని నేను షాక్ అయ్యాను. ఐవీఎఫ్ చేయించుకోవాల్సిన అవసరమేంటని నిలదీశాను. ఈ విషయంలో మా మధ్య గొడవ జరిగింది. ఓసారి ఆమే విజయసాయిరెడ్డి పేరు చెప్పింది. ఆయనే తనకు డోనర్ అని.. ఆయన ద్వారానే ఐవీఎఫ్ చేయించుకున్నట్లు తెలిపింది. నాకు ఆమెతో ఇప్పటికే ఇద్దరు కవల ఆడపిల్లలున్నారు. వారికి న్యాయం చేయాలని శాంతిని కోరా. విడాకుల కోసం ఆమె చాలా బెదిరించింది. కుమార్తెలు ఉన్నందున సమాధానం చెప్పాలని నిలదీశా. విశాఖలోని ఓ ఆస్పత్రికి వెళ్లి అడిగితే వివరాలు ఇచ్చారు. అక్కడి కేస్ షీట్లో పోతిరెడ్డి సుభాష్ పేరు ఉంది. ఆ తర్వాత కొన్ని వివరాలు సేకరిస్తే సుభాష్ వైసీపీ హయాంలో హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాది అని తెలిసింది. సుభాష్తో మాట్లాడితే బిడ్డతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. శాంతి మాత్రం తన భర్త సుభాషే అని ఫొటోలు చూపిస్తున్నారని వాపోయారు. అది ఫేక్ డాక్యుమెంట్.. ఇక ఈ సమస్యను వదిలేస్తే భవిష్యత్లో అది మహావృక్షమై కూర్చొంటుంది. అందుకే దీన్ని పరిష్కరించాలి. నాతో పాటు విజయసాయిరెడ్డి, సుభాష్లకు డీఎన్ఏ టెస్ట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఏడాది బాబుకు న్యాయం జరగాలని, ఆ చిన్నారికి తండ్రి ఎవరో తెలియాలన్నారు. భవిష్యత్లో స్కూల్లో చేర్పిస్తే తండ్రి స్థానంలో ఎవరి పేరు రాయాలి?ఇంతవరకు శాంతి కూడా ఆ బాబు బర్త్ సర్టిఫికెట్ తీసుకోలేదని చెప్పారు. ఇక 2016లో తాను విడాకుల డాక్యుమెంట్పై సంతకం చేసినట్లు ఆమె ఆరోపిస్తోంది. అది ఫేక్ డాక్యుమెంట్. కావాలంటే దాన్ని ఫొరెన్సిక్ ల్యాబ్కు పంపించండి. డీఎన్ఏ టెస్ట్ చేసి తండ్రి ఎవరో తేల్చాక రాతపూర్వకంగా ఓ డాక్యుమెంట్ ఇవ్వడమే దీనికి శాశ్వత పరిష్కారం. అలా చేస్తే నాకు భవిష్యత్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఈ విషయంపై ఏపీ హోంమంత్రి, డీజీపీని కలిశాను. నిజానిజాలను తేలుస్తామన్నారని చెప్పారు. #madan-moman #vijayasai-reddy #shanthi సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి