/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Pinnelli-Interview.jpg)
Macherla Violence:
మాచర్ల(Macherla) నియోజకవర్గంలో ఘర్షణలకు(Macherla Violence) కారణం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలే అని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఎంపీ లావు ఎన్నికలకు రెండు రోజుల ముందే కమ్మ సామాజిక వర్గానికి చెందిన నారాయణస్వామిని కారంపూడి సీఐగా రప్పించారన్నారు. కారంపూడి సీఐ పరిధిలోని కారంపూడి, రెంటచింతల మండలాల్లోనే టీడీపీ నేతలు రిగ్గింగ్ కు పాల్పడ్డారని ఆరోపించారు. పోలీసులు ఎన్నికలలో టీడీపీ నేతలకు పూర్తిగా సహకరించారన్నారు.
టీడీపీకి అనుకూలంగా ఉన్న గ్రామాల్లో ఒకరిద్దరు పోలీసులను పెట్టారని ఫైర్ అయ్యారు. వైసీపీకి అనుకూలంగా ఉన్న గ్రామాల్లో పెద్దఎత్తున పోలీసులను మోహరించారన్నారు. టీడీపీ నేతల రిగ్గింగ్ పై ఎస్పీకి ఫోన్ చేసినా.. పక్క గ్రామంలో ఉండికూడా స్పందించలేదన్నారు.
కమ్మ సామాజిక వర్గం వారు ఎక్కువగా ఉన్న ఒప్పిచర్ల, చింతపల్లి, తుమృకోట, పాలువాయి గేటు గ్రామాల్లోనే గొడవలు జరిగాయన్నారు. తన గెలుపును అడ్డుకోవాలని కుట్రలు చేశారని.. అయినా గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేశారు పిన్నెల్లి. వైసీపీ నేతలపై దాడులకు పాల్పడిన వారిని వదిలేదిలేదని హెచ్చరించారు.
AP News: జగన్ క్షమాపణ చెప్పాలి లేదంటే.. జనమాల శ్రీనివాసరావు స్ట్రాంగ్ వార్నింగ్!
పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్ క్షమాపణ చెప్పాలని జనమాల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. జగన్ తీరు పోలీసులందరినీ కలవరపాటుకు గురిచేసిందన్నారు. వెంటనే క్షమాపణ చెప్పకపోతే ఆయన మీద న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు.
Janamala Srinivasa Rao shocking comments on jagan
AP News: పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్ క్షమాపణ చెప్పాలని జనమాల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఏపీ పోలీస్ అధికారుల అసోసియేషన్ ప్రెసిడెంట్ గా జగన్ మాట్లాడిన తీరును ఖండిస్తున్నట్లు తెలిపారు. జగన్ తీరు పోలీసులందరినీ కలవరపాటుకు గురిచేసిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి పోలీసులను బట్టలూడదీస్తానని అనడం ఏమిటని మండిపడ్డారు. జగన్ వెంటనే పోలీసులందరికీ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో ఆయన మీద న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు.
ప్రభుత్వాలకు భజన చేయాలా..
ఈ మేరకు పోలీస్ అధికారుల సంఘం ఎప్పుడు ఒకరిపైన విమర్శలు చేయలేదు. ఏ ప్రభుత్వం ఉన్నా.. పోలీసుల మీద తప్పుగా మాట్లాడితే ఖండించాం. మాకు ప్రభుత్వాలకు భజన చేయాల్సిన అవసరం లేదు. పోలీసుల్లో మనోధైర్యాన్ని నింపడానికి మీడియా ముందుకు వస్తున్నాం. వేమగిరి ఎస్సై టీడీపీ నేతలతో తిరిగిన వీడియోలు ఉంటే దానిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.
Also Read: TG Crime: ఖమ్మంలో అమానుషం.. మంత్రాల నెపంతో సొంత బాబాయినే హత్య చేసిన యువకుడు!
ఇదిలా ఉంటే.. వెలిగొండ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు ప్రత్యేక ఫోకస్ పెట్టారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. కానీ గతంలోనే ప్రాజెక్టు పూర్తిచేశామని, జాతికి అంకితం ఇస్తున్నామంటూ జగన్ ప్రజలను మోసం చేశారని విమర్శించారు. నిర్వాసితులకు ఒక్క రూపాయి కూడా పరిహారం ఇవ్వలేదని, చేయని పనులూ చేసినట్లు చెప్పుకోవడంలో ఆయనకు ఆయనే సాటి అంటూ ఎద్దేవా చేశారు.
Also Read: Smartphone export: రికార్డ్ సృష్టించిన ఇండియా.. రూ.2 లక్షల కోట్ల విలువైన స్మార్ట్ఫోన్స్ ఎగుమతి
jagan | police | srinivas | tdp | telugu-news | today telugu news
Harish Rao | రాష్ట్రం కేసీఆర్ వైపు చూస్తున్నది...మాజీమంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు
Assembly: అసెంబ్లీ ముందే పొట్టు పొట్టు కొట్టుకున్న MLAలు (VIDEO)
Manchu Manoj: కత్తులు, గన్లతో మమ్మల్ని చంపేందుకు కుట్ర.. విష్ణుపై మనోజ్ సంచలన ఆరోపణలు!
తిరుమలలో ప్రత్యక్షమైన దువ్వాడ ప్రేమ జంట..| Duvvada Srinivas & Madhuri Visit To Tirumala Temple | RTV
ఈ ఫ్రూట్స్తో ఈజీగా వెయిట్ లాస్