Raghunandan Rao: బీజేపీ నేత రఘునందన్రావుపై FIR నమోదు లోక్ సభ ఎన్నికల వేళ బీజేపీ నేత, దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావుకు బీఆర్ఎస్ నేతలు షాక్ ఇచ్చారు. బీఆర్ఎస్ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేశారు. కాగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. By V.J Reddy 02 Apr 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Raghunandan Rao: లోక్ సభ ఎన్నికల వేళ బీజేపీ నేత, దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావుకు బీఆర్ఎస్ నేతలు షాక్ ఇచ్చారు. బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని.. రోజుల క్రితం ఫిర్యాదు చేశారు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్.. ఈ నేపథ్యంలో సంగారెడ్డి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇటీవల జరిగిన బీజేపీ సమావేశంలో రఘునందన్ రావు మాట్లాడుతూ.జ. ఇంకోసారి ఎవరైనా తన పేరు తీసి తప్పుగా మాట్లాడితే ఊరుకునేది లేదని ఫైర్ అయ్యారు. అంగీ, లాగు ఊడదీసి మరి కొడతా అని హరీశ్ రావు తదితర బీఆర్ఎస్ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇంటికి వచ్చి మరి కొడతానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీంతో ఈ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న బీఆర్ఎస్ నేతలు ఎన్నికల కమిషన్ తో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆయనపై సంగారెడ్డి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీంతో ఈ కేసు విషయంలో పోలీసుల నెక్స్ట్ స్టెప్ ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. ఈ వార్త అప్డేట్ అవుతోంది.. #bjp #lok-sabha-elections #raghunandan-rao సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి