Loan App: అప్పు తీసుకున్న పాపానికి అశ్లీల ఫొటోలతో.. ఈ లోన్ యాప్ ఏం చేసిందంటే?

లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలైయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని బోరబండలో చోటుచేసుకుంది. లోన్ యాప్ వేధింపులు తాళలేక విషం తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. లోన్ యాప్ వేధింపులతో తమ కొడుకు బలవన్మరణానికి కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

New Update
Loan App: అప్పు తీసుకున్న పాపానికి అశ్లీల ఫొటోలతో.. ఈ లోన్ యాప్ ఏం చేసిందంటే?

బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. లోన్ యాప్ వేధింపులతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోరబండ, బ్రహ్మ శంకర్‌నగర్ బస్తీకి చెందిన విజయ్ కుమార్ అనే యువకుడు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సూపర్‌​వైజర్‌గా పని చేస్తున్నాడు. అత్యవసరంగా డబ్బులు అవసరం ఉండి ఆన్‌లైన్ లోన్ యాప్‌ల ద్వారా డబ్బులు తీసుకున్నాడు. అయితే.. విజయ్ కుమార్ డబ్బులు సకాలంలో చెల్లించక పోవటంతో లోన్ యాప్ ఆగడాలు ఎక్కువైయ్యాయి.

అసభ్యకర ఫొటోని రిఫరెన్స్ నంబర్లకు

బాధితుడు విజయ్ కుమార్ రిఫరెన్స్ నంబర్స్ అందరికీ ఫోన్‌లు చేసి ఇబ్బంది పెట్టారు ఆన్‌లైన్‌ నిర్వాహకులు. వడ్డీ అధికంగా వేసి చెల్లించాలని ఇబ్బంది పెడుతున్నారు. దీంతో విజయకుమార్ రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో బాధితుడు ఫొటోని ఆశ్లీల ఫొటోతో మార్ఫింగ్ చేశారు. అంతేకాదు ఆ అసభ్యకర ఫొటోని రిఫరెన్స్ నంబర్స్ అందరికీ సెండ్‌ చేశారు. దాంతో శుక్రవారం రాత్రి పాయిజన్ తాగి బాధితుడు విజయకుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించించినా.. ఉపయోగం లేదు. అప్పటికే విజయ్‌కుమార్‌ మరణించాడని డాక్టర్లు నిర్ధారించారు. కుటుంబ సభ్యులు బోరబండ పోలీస్ స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

అనధికారిక యాప్‌లను యాక్సెస్ చేయడం 

అయితే గతంలో ఆన్‍లైన్ రుణ యాప్‌లపై పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. అమాయకులకు అప్పు ఇచ్చి.. అధిక వడ్డీలతో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అప్పు తీర్చినా.. కూడా వేధింపులు ఆపని సంఘటనలు చూస్తూనే ఉన్నాం. తెలిసి తెలియక ఇలా రుణ యాప్ వేధింపులు తాళలేక చాలా మంది ప్రాణాలు తీసుకున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఆన్ లైన్ రుణ యాప్ వేధింపులకు యువకుడు బలయ్యాడు. టెక్నాలజీ పెరిగినా.. లోన్ యాప్ వేధింపులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. లోన్‌ యాప్‌ ఏజెంట్లు బరితెగించి వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అయితే లోన్‌ తీసుకున్న బాధితులు ఎక్కువగా విద్యార్థులతో పాటు.. ఇతరులు కూడా ఉన్నారు. అయితే ఆన్‌లైన్‌ లోన్‌ యాప్‌ ఏజెంట్ల వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.. కొందరు మాత్రం ధైర్యం చేసి..పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు.  నగరంలో పెరుగుతున్న లోన్ యాప్ మోసాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టాలి విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజలు సులభంగా లభించే రుణాల కోసం ఆశపడి మోసపోవద్దని మరికొంత మంది హెచ్చరిస్తున్నారు. అనధికారిక యాప్‌లను  డౌన్ లోడ్ చేయోదని చెబుతున్నారు. తెలియని లింక్ లను యాక్సెస్ వంటివి చేయొద్దని పోలీసులు చెబుతూనే ఉన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: దిల్‌సుఖ్‌నగర్‌ బాంబ్ పేలుళ్లపై హైకోర్టు సంచలన తీర్పు.. ఆ ఐదుగురికి ఉరి శిక్ష!

దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఐదుగురికి ఉరిశిక్ష ఖరారు చేసింది. NIA ప్రత్యేక కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది. అక్తర్, జియా ఉర్ రహమాన్, తహసీన్ అక్తర్, యాసిన్ భత్కల్, అజాజ్‌ షేక్‌కు ఉరిశిక్ష విధించింది.

New Update
Dilsukhnagar bomb blast case High Court sentences five to death

Dilsukhnagar bomb blast case High Court sentences five to death

Dilsukhnagar Bomb Blast | దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు ఊహించని తీర్పు వెల్లడించింది. పేలుళ్లకు పాల్పడిన ఐదుగురికి ఉరిశిక్ష ఖరారు చేసింది. NIA ప్రత్యేక కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది. అక్తర్, జియా ఉర్ రహమాన్, తహసీన్ అక్తర్, యాసిన్ భత్కల్, అజాజ్‌ షేక్‌కు ఉరిశిక్ష విధించింది. 

Also Read: పోలీసులకు లొంగిపోయిన 26 మంది మావోయిస్టులు

ఏం జరిగిందంటే?

2013లో దిల్‌సుఖ్‌నగర్‌‌లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఈ బ్లాస్ట్‌లో 18 మంది మృతి చెందారు. మరో 130 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసును విచారించిన ఎన్‌ఐఏ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు 2016లో మోస్ట్‌వాంటెడ్‌ ఉగ్రవాది యాసిన్‌ భత్కల్‌ సహా ఐదుగురికి మరణశిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. 

Also Read: తెగ తాగేసిన మందు బాబులు..గతేడాది కంటే తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు!

అయితే, కేసులో ప్రధాన నిందితుడు రియాజ్‌ భత్కల్‌ ఇంకా పరారీలోనే ఉన్నాడు. ఈ శిక్షను సవాల్‌ చేస్తూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. నిందితుల పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. నేడు తుది తీర్పు ఇచ్చింది. NIA ప్రత్యేక కోర్టు తీర్పును హైకోర్టు సమర్థిస్తూ వారికి ఉరిశిక్ష ఖరారు చేసింది. 

Also Read: ఆ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోండి..లేదంటే...చైనాకు ట్రంప్ హెచ్చరికలు!

157 మంది సాక్ష్యులు..

21న ఫిబ్రవరి 2013లో దిల్‌సుఖ్‌నగర్‌‌లో పేలుళ్లు సంభవించాయి. ఎన్‌ఐఏ రంగంలోకి దిగి విచారణ జరిపింది. విచారణలో 157 మంది సాక్ష్యాలను రికార్డు చేసింది. ఈ ఘటనలో ఇండియన్‌ ముజాహిద్‌ ఉగ్రసంస్థ సహ వ్యవస్థాపకుడు యాసిన్‌ భత్కల్‌ ప్రధాన నిందితుడిగా తేలింది. ఈ ఘటనలో అసదుల్లా అక్తర్‌, వకాస్‌, తెహసీన్‌ అక్తర్‌, ఎజాజ్‌ షేక్‌, సయ్యద్‌ మక్బూల్‌ని నిందితులుగా గుర్తించారు. 

Also Read: క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!

మూడేళ్లు ఈ కేసులు విచారించిన ఎన్‌ఐఏ స్పెషల్‌ కోర్టు విచారణ తర్వాత నిందితులకు మరణశిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన యాసిన్‌ భత్కల్‌ను 2013లో నేపాల్‌ సరిహద్దుల్లో పట్టుకున్నారు. ఢిల్లీ, దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్ల కేసు సహా పలు కేసుల్లో దోషిగా తేలగా తిహార్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. 

Advertisment
Advertisment
Advertisment