పిల్లలు పుట్టలేదని కోడిపిల్లను మింగి.. ప్రాణం తీసిన మంత్రగాడి ఉపాయం..!

ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపుర్‌లో మూఢనమ్మకంతో ఓ వ్యక్తి బతికున్న కోడిపిల్లను మింగేశాడు. అది గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక చనిపోయాడు. 20 సెంటీమీటర్ల కోడిపిల్ల గొంతులో చిక్కుకు పోవడం వలన గాలి ఆడక ఆనంద్‌ అక్కడికక్కడే మరణించాడని డాక్టర్లు చెప్పారు.

New Update
AP: టీడీపీ నేత దారుణ హత్య.. వేట కొడవళ్ళు, కత్తులతో పొడిచి..

Chhattisgarh

Chhattisgarh: మూఢనమ్మకాల గురించి ప్రస్తుత సమాజంలో అనేక ఘటనలు చూస్తూనే ఉన్నాము. అలాంటివి నమ్మొద్దని చెబుతున్నా... ఎంతోమంది వాటిని నమ్మి ప్రాణాలు పోగొట్టుకోవడమే కాకుండా అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా మూఢనమ్మకాలతో ఓ వ్యక్తి ప్రాణాలు తీసుకున్నాడు. ఛత్తీస్‌గఢ్‌లోని చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనంగా మారింది. తండ్రి కావాలన్న కోరికతో ఏకంగా బతికున్న కోడిపిల్లను మింగి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఇది కూడా చదవండి:  బాబూ పక్కకెళ్లి ఆడుకోమ్మా.. గజరాజు మర్యాద చూడండి

బతికి ఉన్న కోడి పిల్లను మింగేశాడు:

వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం అంబికాపురంలో ఆనంద్ యాదవ్ (35) అనే వ్యక్తి కుటుంబంతో నివసిస్తున్నాడు. గత కొంతకాలంగా వీరికి సంతానం కలగక పోవడంతో తాంత్రికుడిని ఆశ్రయించారు. తండ్రి కావాలన్న కోరికతో అతని చెప్పిన మాటలు విన్నాడు. అతను చెప్పినట్లుగా బతికి ఉన్న కోడి పిల్లను మింగేసాడు. అది గొంతులో ఇరుక్కుపోవడంతో ఊపిరాడక ఆనంద్ యాదవ్ అనే వ్యక్తి అక్కడికక్కడే  కుప్ప కూలిపోయాడు. వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

ఇది కూడా చదవండి: వామ్మో.. 9 నెలల గర్భంతో భరతనాట్యం

వైద్యులు పరీక్షించగా అప్పటికే ఆనంద్‌ మృతి చెందినట్లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం గొంతులో ఇరుక్కున్న కోడి పిల్లలను బయటకు తీశారు. అయితే కోడి పిల్ల బతికి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. 20 సెంటీమీటర్ల కోడిపిల్ల గొంతులో చిక్కుకు పోవడం వలన గాలి ఆడక ఆనంద్‌ అక్కడికక్కడే మరణించాడని డాక్టర్లు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: శీతాకాలంలో ఈ కూరగాయతో ఎంతో ఆరోగ్యం

ఇది కూడా చదవండి: ఎలుకల నిలయాలుగా గురుకులాలు.. విద్యార్థిని పరిస్థితి విషమం

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ఇంట్లోనే ఎండు ద్రాక్షను తయారు చేసుకోవడం ఎలాగంటే?

ఒక పాత్రలో నీళ్లు తీసుకుని మరిగించాలి. ఇందులో కేజీ ద్రాక్ష పండ్లను వేసి ఉబ్బినంత వరకు ఉడికించాలి. ఆ తర్వాత వడబోసి కాటన్ క్లాత్‌లో వేసి ఎండలో ఆరబెట్టాలి. ఇలా నాలుగు రోజుల పాటు ఆరబెడితే హోమ్ మేడ్ కిస్‌మిస్ రెడీ.

New Update
raisins making

raisins making Photograph: (raisins making)

కిస్‌మిస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలోని పోషకాలు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడతాయి. అయితే వీటిని స్వీట్లు, తీపి పదార్థాలు ఇలా ప్రతీ దాంట్లో కూడా వేస్తారు. మరికొందరు వీటిని నానబెట్టి పరగడుపున తింటారు. అయితే మార్కెట్‌లో దొరికే కిస్‌మిస్‌లో కల్తీ ఉంటుంది. వీటివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఎలాంటి కల్తీ లేకుండా సహజంగా ఇంట్లోనే కిస్‌మిస్‌ను ఈజీగా తయారు చేసుకోవచ్చు. అదెలాగో ఈ స్టోరీలో చూద్దాం.

ఇది కూడా చూడండి: BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!

ద్రాక్ష పండ్లు మునిగేంత వరకు..

కిస్‌మిస్‌ను తయారు చేయడానికి కేజీ ద్రాక్ష, నీరు ఉంటే సరిపోతుంది. ఒక వెడల్పు ఉన్న గిన్నెలో ద్రాక్ష పండ్లు వేసి, మునిగేంత వరకు నీళ్లు, ఉప్పు వేసి ఒక 15 నిమిషాల పాటు అలా వదిలేయాలి. ఆ తర్వాత వాటిని శుభ్రం చేసి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి సగానికి పైగా నీళ్లు వేయాలి. నీరు మరుగుతున్నప్పుడు శుభ్రం చేసుకున్న ద్రాక్ష వేసుకుని ఓ 5 నిమిషాల పాటు ఉడికించాలి. 

ఇది కూడా చూడండి: SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా..

అవి కాస్త ఉబ్బిన వెంటనే స్టవ్​ ఆఫ్​ చేసి వెంటనే వడకట్టాలి. వీటిని కాటన్ క్లాత్‌లో వేసుకుని ఎండలో ఉంచాలి. రెండు లేదా ఆరు రోజుల వరకు ఎండలో ఉంచితే అవి ఎండుతాయి. వీటిపై ఎలాంటి దుమ్ము, ధూళీ పడకుండా ఉండటానికి పల్చటి క్లాత్ కప్పాలి. ​అంతే ఇక కిస్‌మిస్ రెడీ అయినట్లే.

ఇది కూడా చూడండి: TS: భూభారతిపై అవగాహనా సదస్సులు..సీఎం రేవంత్ రెడ్డి

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
Advertisment