Hacks: మార్కెట్ లో కల్తీ పండ్లు, కూరగాయలను ఇలా గుర్తించండి..?

ప్రస్తుతం మార్కెట్‌లో లభించే పండ్లు, కూరగాయల్లో అనేక రసాయనాలు ఉంటున్నాయి. స్వచ్చమైనవి దొరకరడం చాలా కష్టంగా మారింది. పండ్లు, కూరగాయల్లో కల్తీని ఈ చిట్కాలతో గుర్తించండి. సేంద్రియ కూరగాయలు బలమైన వాసనను కలిగి ఉంటాయి.

New Update
Hacks: మార్కెట్ లో కల్తీ పండ్లు, కూరగాయలను ఇలా గుర్తించండి..?

Hacks: ప్రస్తుతం మార్కెట్‌లో కల్తీ లేకుండా ఏదైనా లభించడం చాలా కష్టంగా మారింది. పండ్లు, కూరగాయల్లో కూడా కల్తీ మొదలైంది. మార్కెట్‌లో లభించే పండ్లు, కూరగాయలను పండించడానికి.. వాటిని చాలా రోజులు తాజాగా ఉంచడానికి వివిధ రకాల రసాయనాలను ఉపయోగిస్తారు. ఈ రసాయనాలు నిండిన కూరగాయలు రుచిగా ఉండవు. అలాగే  ఆరోగ్యానికి కూడా మంచివి కావు. అయితే కూరగాయలు కొనుగోలు చేసేటప్పుడు అవి స్వచ్ఛమైనవా..? కాదా .? ఎలా గుర్తించడానికి ఈ చిట్కాలు పాటించండి.

మచ్చలు ఉన్న కూరగాయలను కొనవద్దు

కూరగాయలను పండించడానికి వాటిని చాలా రోజులు తాజాగా ఉంచడానికి వివిధ రకాల రసాయనాలను ఉపయోగిస్తారు. కూరగాయలు పండించడానికి రసాయనాలు వాడితే వాటిపై కొన్ని మరకలు పడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందువల్ల, మచ్చలు ఉన్న కూరగాయలను కొనడం మానుకోవాలి.

పండ్లను గోరుతో గిల్లడం

కూరగాయ లోపలోకి మీ గోళ్లను తేలికగా గుచ్చండి. కూరగాయలు తాజాగా ఉంటే, గోరు సులభంగా లోపలికి వెళుతుంది. అయితే కూరగాయలు పాతవి లేదా రసాయనంతో నిండి ఉంటే గోరు లోపలికి వెళ్లదు.

వాసన ద్వారా

తాజా, స్వచ్ఛమైన కూరగాయలను గుర్తించడానికి ఉత్తమ మార్గం వాసన. సేంద్రియ పద్దతిలో పండించిన కూరగాయలు, పండ్ల వాసన బలంగా ఉంటుంది. రసాయనాలు కలిగిన పండ్లు, కూరగాయల వాసన భిన్నంగా లేదా వాసన లేకుండా ఉంటాయి.

ఇలా కూరగాయల రంగును

కూరగాయలు తాజాగా కనిపించేందుకు మార్కెట్‌లో వస్తున్న కూరగాయలకు పారాఫిన్‌ హైడ్రోకార్బన్‌ రసాయనాలు కలిపి కల్తీ రంగులు వేస్తున్నారు. కూరగాయలు లేదా పండ్లలో కృత్రిమ రంగును గుర్తించడానికి, కాటన్ గుడ్డను కొద్దిగా తేమ చేసి, కూరగాయలు, పండ్లపై రుద్దండి. కూరగాయలు, పండ్లలో కల్తీ రంగు ఉంటే ఆ గుడ్డకు అంటుకుంటుంది.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read: Health Tips: రోజూ ఒక దానిమ్మపండు తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే! - Rtvlive.com

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Omar Abdullah: పాక్‌ ప్రధానిపై ఒమర్‌ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

పాకిస్థాన్ ప్రధానిపై జమ్మూకశ్మీర్‌ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ పాశమిక సంఘటనను పాకిస్థాన్‌ ముందుగా తోసిపుచ్చిందని.. భారత్‌పైనే నిందలు వేసిందంటూ విమర్శించారు. ఈ దాడిని వాళ్లు కనీసం గుర్తించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

New Update
They didn't even recognise, Omar Abdullah on Pak's probe offer into Pahalgam

They didn't even recognise, Omar Abdullah on Pak's probe offer into Pahalgam

పహల్గాంలో ఉగ్రదాడి అనంతరం దీనిపై తటస్థ, పారదర్శక దర్యాప్తునకు తాము రెడీగా ఉన్నామని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై తాజాగా జమ్మూకశ్మీర్‌ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ పాశమిక సంఘటనను పాకిస్థాన్‌ ముందుగా తోసిపుచ్చిందని.. భారత్‌పైనే నిందలు వేసిందంటూ తీవ్రంగా విమర్శలు చేశారు. '' పహల్గాంలో చోటుచేసుకున్న దాడిని వాళ్లు కనీసం గుర్తించలేదు.

Also read: భారత్-పాకిస్థాన్ యుద్ధం డేట్‌ ఫిక్స్‌..! పాక్ మాజీ హైకమిషనర్‌ సంచలన కామెంట్స్‌

ఈ ఘటన వెనుక భారత్ ఉందని వాళ్లే మొదటగా ఆరోపించారు. మనపై ఎప్పుడూ ఆరోపణలు చేసేందుకు ముందుండే వాళ్లకు ఇప్పుడు మనమేమి చెప్పలేం. వాళ్లు చేసిన ప్రకటనలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వాలని అనుకోవడం లేదు. ఈ ఘటన జరిగి ఉండాల్సింది కాదని'' సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఇదిలాఉండగా పహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ దీనిపై స్పందించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తటస్థ, పారదర్శక, విశ్వసనీయ దర్యాప్తులో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అలాగే సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకోవడాన్ని ఆయన ఖండించారు.  

Also Read: వామ్మో.. ఆ రాష్ట్రంలో 5వేల మంది పాకిస్థానీయులు..

ఇదిలాఉండగా.. పాకిస్థాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్‌లోని ఓ వార్తా ఛానెల్‌తో మాట్లాడుతూ భారత్.. పాకిస్థాన్‌పై ఎప్పుడు దాడి చేస్తుందో చెప్పారు. '' భారత్‌ నుంచి కచ్చింతగా ప్రతీకార చర్య ఉంటుందని నాకు ఎలాంటి సందేహం లేదు. ఎందుకుంటే భారత ప్రధాని మోదీ కూడా బిహార్‌లో చర్యలు తీసుకుంటామని ప్రకటన చేశారు. గతంలో పరిశీలిస్తే యూరీ, పుల్వామా దాడుల తర్వాత భారత్‌ చర్యలకు దిగిన సందర్భాలున్నాయి. యూరీ దాడి తర్వాత 89లో భారత్‌ చర్యలకు దిగింది. పుల్వామా దాడి తర్వాత 12 రోజుల్లోనే సర్జికల్‌ స్ట్రేక్ చేసింది. ఏప్రిల్ 22న పహల్గాంలో దాడి జరిగింది కాబట్టి.. మే మొదటి వారంలో లేదా మధ్యన భారత్‌ దాడి చేసే అవకాశం ఉందని'' అబ్దుల్ బాసిత్ అన్నారు.

Also Read: అంతా మారిపోయింది.. వాళ్లు రాజకీయాల్లోకి రావాలి: రాహుల్‌ గాంధీ

Also Read: మీకు దండం పెడతా.. పిల్లలకు గుండె ఆపరేషన్లు ఉన్నాయి.. పాకిస్థానీ తండ్రి ఆవేదన!

telugu-news | rtv-news | national-news | Omar Abdullah 

Advertisment
Advertisment
Advertisment