Bharat Men: భారతీయ పురుషులకు రొమాన్స్ అంటే ఏంటో తెలీదు..!

భారతీయ పురుషులతో డేటింగ్ చేయను.. అంటూ లైఫ్ కోచ్ చేతనా చక్రవర్తి ఈ కామెంట్లు చేయడం ఇప్పడు హాట్‌ టాపిక్‌ గా మారింది. ఇందుకు కారణాలను ఆమె వినిపించింది. ఏ విషయంలోనైనా వారు తమ వాదనను సరిగా వినిపించలేకపోతే మూగనోము పడతారు.వాళ్లకు రొమాన్స్ అంటే ఏంటో తెలీదు.

New Update
Bharat Men: భారతీయ పురుషులకు రొమాన్స్ అంటే ఏంటో తెలీదు..!

Bharat Men: భారతీయ పురుషులతో డేటింగ్ చేయను.. అంటూ ఓ లైఫ్ కోచ్ అన్న మాటలు ప్రస్తుతం నెట్టింట తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాయి. ఎవరో విదేశీ మహిళ ఈ మాటంటే మన నెటిజన్లు పట్టించుకోకపోదురు కానీ స్వయంగా ఓ భారతీయ మహిళ ఈ మాట అనడంతో ఈ విషయం పెద్ద సంచలనంగా మారింది. తమ జీవితాలను దారిలో పెట్టుకునేందుకు ఎందరికో సాయపడ్డ లైఫ్ కోచ్ చేతనా చక్రవర్తి ఈ కామెంట్లు చేయడం ఇప్పడు హాట్‌ టాపిక్‌ గా మారింది.

అయితే, తన నిర్ణయానికి గల కారణాలనూ ఆమె ఇలా చెప్పుకొచ్చింది. ‘‘భారతీయ పురుషులతో డేటింగ్ చేయడం మానేశా. ఇందుకు మూడు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. ఏ విషయంలోనైనా వారు తమ వాదనను సరిగా వినిపించలేకపోతే మూగనోము పడతారు. మహిళకు పొగరని, మొండిఘటమని అంటారు. వాళ్లకు రొమాన్స్ అంటే ఏంటో తెలీదు. అవతలి వారి కోసం రోజూ చేసే చిన్న చిన్న పనుల్లోనే రొమాన్స్ దాగుంది. భారీ బహుమతులు, హంగామాతో ఉపయోగాలు ఉండవు. భారతీయ పురుషులకు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం తెలీదు. ఇంటి శుభ్రత భాగస్వామి కోసమే కాదని, అక్కడ తాము కూడా నివసిస్తున్నామనే స్పృహ ఉండదు’’ అని అంటూ ఆమె వివరించింది.

సహజంగానే ఈ వీడియోకు నెట్టింట భారీ స్పందన వచ్చింది. కొందరు మహిళలు మాత్రం ఆమెతో విభేదించారు. తాను భారతీయుడినే పెళ్లాడానని, అతనో అద్భుతమైన వ్యక్తి అంటూ ఓ మహిళ కామెంట్ పెట్టగా. కొందరితో చెడు అనుభవాలు ఎదురైనంత మాత్రాన భారతీయ పురుషులందరినీ ఒకేగాటన కట్టకూడదని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇది భారతీయ పురుషులకే ప్రత్యేకం కాదని, లింగవివక్షకు సంబంధించినదని మరికొందరు చెప్పుకొచ్చారు. కొందరు మాత్రం ఆమె అభిప్రాయంతో ఏకీభవించారు.

Also read: జనసేన పార్టీ ఐదుగురు ఎమ్మెల్యేలకు కీలక పదవులు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

PBK VS RR: పంజాబ్ కింగ్స్ ను బోల్తా కొట్టించిన రాజస్థాన్ రాయల్స్

ఐపీఎల్ 2025లో ఈరోజు పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ఆర్ఆర్ ఇచ్చిన టార్గెట్ ను ఛేజ్ చేయలేక పంజాబ్ బోల్తా పడింది. 155 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. 

author-image
By Manogna alamuru
New Update
ipl

PBK VS RR

పంజాబ్ కింగ్స్ కు షాక్ ఇచ్చింది రాజస్థాన్ రాయల్స్. సంజూ శాంసన్ కెప్టెన్సీలో విజయాన్ని నమోదు చేసుకుంది. పంజాబ్ కు 206 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇచ్చింది. ఈ టార్గెట్ ను ఛేదించలేక కింగ్స్ బొక్క బోర్లా పడ్డారు. 155 పరుగులకే ఆలౌట్ అయిపోయి 51 పరుగుల తేడాతో ఓడిపోయింది. పంజాబ్ బ్యాటర్ నేహాల్ వధేరా 62 పరుగులతో హాఫ్ సెంచరీ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇతని తర్వాత మాక్స్ వెల్ ఒక్కడే 30 పరుగులు చేసాడు. నేహాల్ , మ్యాక్స్ వెల్ చాలా సేపు క్రీజులో ఉండి జట్టు విజయానికి పాటు పడ్డారు. కానీ మిగతా బ్యాటర్లు ఎవరూ కనీసం డబుల్ డిజిట్ కూడా కొట్టకపోవడంతో మ్యాచ్ ను చేజార్చుకోవాల్సి వచ్చింది.  కింగ్స్ బ్యాటింగ్ మొదలు పెట్టిన దగ్గర నుంచే వికెట్లను పోగొట్టుకుంటూ వచ్చింది. 50 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, అంతకు ముందు మ్యాచ్ లో బాగా ఆడిన ప్రభ్ మన్ సింగ్ ఎవరూ కూడా ఎక్కువసేపు ఉండలేదు. రాజస్థాన్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌ 3, సందీప్‌ శర్మ 2, మహీశ్ తీక్షణ 2, కార్తికేయ,  హసరంగ చెరో వికెట్‌ తీశారు.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్..

చంఢీఘడ్ వేదికగా పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. జైస్వాల్ 67తో స్కోర్‌తో అదరగొట్టాడు. చివర్లో రియాన్ పరాగ్ 25 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్ లతో 43 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. కెప్టెన్ సంజు శాంసన్ కూడా 38 పరుగులతో రాణించాడు. నితీశ్ రాణా 12, హెట్ మయర్ 20, ధ్రువ్ జురెల్ 13 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.  ఫెర్గూసన్ 2, మార్కో జన్‌సెన్, అర్ష్‌దీప్‌ తలొ వికెట్ తీశాడు. 

 today-latest-news-in-telugu | IPL 2025 | match | cricket

Also Read: RC 16: రామ్ చరణ్ రోరింగ్ టుమారో..పెద్ది గ్లింప్స్ రిలీజ్

 

Advertisment
Advertisment
Advertisment