Atal Setu Bridge: కారులో వచ్చి.. సముద్రంలో దూకి: వ్యాపారి సూసైడ్ వీడియో వైరల్!

మహారాష్ట్ర డోంబివ్లికి చెందిన కురుటూరి శ్రీనివాస్‌ అనే వ్యాపారి అరేబియా స‌ముద్రంలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధతోనే శ్రీనివాస్ సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు నిర్దారించారు. కారులో వచ్చి బ్రిడ్జిపై నుంచి శ్రీనివాస్ దూకిన వీడియో వైరల్ అవుతోంది.

New Update
Atal Setu Bridge: కారులో వచ్చి.. సముద్రంలో దూకి: వ్యాపారి సూసైడ్ వీడియో వైరల్!

Sucide: ముంబై అట‌ల్ సేతు బ్రిడ్జిపై నుంచి అరేబియా స‌ముద్రంలో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన వీడియో వైరల్ అవుతోంది. బుధవారం మధ్యాహ్నం బ్రిడ్జ్‌పైకి కారులో వేగంగా వచ్చిన అతను కారును పక్కకు ఆపి ఒక్కసారిగా బ్రిడ్జ్‌ రెయిలింగ్‌పైకెక్కి సముద్రంలోకి దూకేశాడు. ఇందుకు సంబంధించిన దృష్యాలు అక్కడున్న సీసీటీవలో రికార్డ్ అవగా మృతుడి వివరాలు ఇలా ఉన్నాయి.

ఈ మేరకు ముంబై పోలీసులు తెలిపిన ప్రకారం.. డోంబివ్లికి చెందిన శ్రీనివాస్‌ కురుటూరి (38) తన కారులో నవీ ముంబై వెపు వెళ్తున్నాడు. అయితే ఉన్నట్టుండి బుధవారం మధ్యాహ్నం 12:24 గంటల సమయంలో కారు బ్రిడ్జిపై ఆపి సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటన సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకొని స్థానికుల సహకారంతో శ్రీనివాస్‌ కోసం తీవ్రంగా గాలింపు చ్యర్యలు చేపట్టాం. వర్షం కారణంగా అలలు ఎగసిపడుతుండటంతో గాలింపు చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడిందని పోలీసులు చెప్పారు.

ఇది కూడా చదవండి: Bandi sanjay: కాంగ్రెస్ హామీలను గాడిద గుడ్డుతో పోల్చిన బండి.. అదో అప్పుల పత్రం అంటూ!

ఇక శ్రీనివాస్‌ విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడని, ఎనిమిది నెలల క్రితమే స్వదేశానికి వచ్చి సొంతంగా వ్యాపారం పెట్టినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే అతడు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TG Crime: కోడలిపై మోజుతో కొడుకును లేపేసిన తండ్రి.. రోకలి బండతో కొట్టి చంపి!

వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. రేపాకపల్లికి చెందిన మొండయ్య కోడలిపై మోజుతో కొడుకు ఓదెలును రోకలిబండతో కొట్టి చంపాడు. అనంతరం ఇంటినుంచి పారిపోగా పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు. ఓదెలు 108 అంబులెన్స్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు తెలిపారు. 

New Update
father killed

Warangal Father kills son

TG Crime: తెలంగాణలో మరో దారుణం జరిగింది. కోడలుపై మోజుతో కనిపెంచిన తండ్రే కొడుకును లేపేశాడు. తన భార్యతో అసభ్యంగా ప్రవర్తించవద్దని హెచ్చరించినందుకు కుమారిడిపై దారుణానికి పాల్పడ్డాడు. రోకలి బండతో కొట్టి కొట్టి చంపాడు. ఈ దారుణమైన ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేపాకపల్లిలో జరగగా ఘటను సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 

కోడలితో అసభ్య ప్రవర్తన..

ఈ మేరకు పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రేపాకపల్లికి చెందిన కాసం ఓదెలు(35), తన భార్య, కొడుకు(2)తో కలిసి తల్లిదండ్రులు సారక్క, మొండయ్యలతో కలిసి నివసిస్తున్నాడు. ఓదెలు 108 అంబులెన్స్‌ డ్రైవర్‌గా పనిచేస్తుండగా 14 ఏళ్ల కిందట పెళ్లైంది. అయితే కొంతకాలంగా మొండయ్య ప్రవర్తన సరిగా లేకపోవడంతో గొడవలు జరుగుతున్నాయి. మొండయ్య కోడలితో అసభ్యంగా ప్రవర్తిస్తుండగా బంధువులు పంచాయితీ పెట్టి హెచ్చరించారు. అయినా మారని మొండయ్య అలాగే ప్రవర్తిస్తున్నాడు. అయితే సోమవారం ఓదెలు తమ పెళ్లిరోజు వేడుకలు జరుపుకున్నాడు. అప్పుడు తాగి ఇంటికొచ్చి తండ్రి మొండయ్య కొడుకుతో గొడవపడ్డాడు. 

Also  read :  AP 10th Result: ఏపీ టెన్త్ ఫలితాల్లో అరుదైన రికార్డ్.. 600 కు 600 మార్కులు!

ఎప్పటినుంచో పగతో రగిలిపోతున్న మొండయ్య కొడుకును చంపాలని ఎదురుచూస్తున్నాడు. ఇందులో భాగంగానే మంగళవారం తెల్లవారుజామున ఇంటి ముందు పడుకున్న కొడుకు ఓదెలు తలపై రోకలి బండతో కొట్టాడు. దీంతో తీవ్ర గాయమైన ఓదెలు అక్కడికక్కడే చనిపోయాడు. అనంతరం మొండయ్య పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు చెప్పిన భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు, చిట్యాల సీఐ మల్లేశ్‌, ఎస్సై సందీప్‌కుమార్‌ తెలిపారు.

Also Read: ఈ సారి సైన్యం కాదు.. పర్యాటకులే టార్గెట్.. ఉగ్రమూకల కొత్త వ్యూహం అదేనా?

father | killed | son | today telugu news

Advertisment
Advertisment
Advertisment