AP Politics: సొంత గూటికి సుబ్బారాయుడు???

సుబ్బరాయుడు ఎన్ని పార్టీలు మారిన ఇప్పటికీ అతని వెంట నడిచే కార్యకర్తలు అలానే వున్నారు.. గత కొన్నాళ్ళ నుంచి సుబ్బరాయుడు సైకిల్ ఎక్కుతారు అనే ఊహాగానాలు జోరుగా ప్రచారం సాగాయి. స్కిల్ డెవలెప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించారు.ఇదంతా మరోసారి తాను రాజకీయ ఓనమాలు దిద్దిన పార్టీ అయిన టీడీపీలో చేరుతారు అనే ప్రచారం జరిగిపోతుంది.

New Update
AP Politics: సొంత గూటికి సుబ్బారాయుడు???

జిల్లాలో ఆ నియోజకవర్గంలో ఆయనో ప్రముఖ సీనియర్ నాయకుడు. టీడీపీలో ఓనమాలు దిద్ది ఆ తరువాత ప్రజారాజ్యం, కాంగ్రెస్,వైసీపీ పార్టీల్లో చేరి దాదాపు అన్ని పార్టీల తీర్థం పుచ్చుకున్న నాయకునిగా పేరు పొందారు... గతంలో వైసీపీలో కొన్ని కారణాలతో పార్టీ నుంచి తప్పించారు...అయితే ప్రస్తుతం మరోసారి తను ఓనమాలు దిద్దిన సైకిల్ పార్టీ వైపు చూస్తున్నారా..... ...ఆ నేత సైకిల్ ఎక్కుతరా.... ఇంతకు ఎవరీ నేత..

కొత్తపల్లి సుబ్బారాయుడు ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రల్లోనూ సుపరిచితమే..ఉమ్మడి రాష్ట్రంలో కొత్తపల్లి సుబ్బారాయుడు వరుసగా నాలుగు సార్లు నరసాపురం నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యే గా గెలుపొందారు.అంతే కాదు టీడీపీ హయంలో మంత్రిగా సైతం పనిచేశారు. ఆ తరువాత టీడీపీ నుంచి బయటకు వచ్చి 2009 లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం నుంచి నరసాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

Also read: భర్తతో వీడియో కాల్‌ మాట్లాడుతుండగా..పేలిన బాంబు!

అనంతరం 2012లో కాంగ్రెస్ పార్టీలో చేరి అప్పుడే వచ్చిన ఉప ఎన్నికలో నర్సాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్రం విడిపోయాక వచ్చిన 2014ఎన్నికల్లో వైసీపీకి వెళ్ళి నరసాపురం నుంచి ఎమ్మెల్యే గా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి మాధవ నాయుడుపై ఓటమి చెందారు.... కొన్నాళ్లకే మరోసారి టీడీపీకు చేరి కాపు కార్పొరేషన్ చైర్మన్ గా కూడా పనిచేశారు సుబ్బారాయుడు. 2019 ఎన్నికల సమయంలో టీడీపీ నుంచి టికెట్ ఆశించి టికెట్ రాకపోవడంతో నిరుత్సాహపడి వైసీపీ తీర్థం సైతం పుచ్చుకుని వైసీపీ నుంచి ఎమ్మెల్యే గా పోటీ చేసిన ప్రసాదరాజు గెలుపునకు కృషి చేశారు.

కొన్నాళ్ళు పార్టీలో ప్రయాణం బాగనే సాగిన జిల్లా కేంద్రం భీమవరం తరలిపోవడంతో నరసాపురంలో భారీ స్థాయిలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు సుబ్బరాయుడు. నిత్యం వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాలు చేపడుతూ వైసీపీని గెలిపించుకుని చాలా తప్పు చేశాం అంటూ తను చేస్తూన్న నిరసన కార్యక్రమంలో చెప్పుతో కొట్టుకున్నారు. నరసాపురం రావాల్సిన జిల్లా కేంద్రం స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ప్రసాదరాజు వల్లే భీమవరం తరలిపోయిందని అనేక సార్లు విమర్శలు గుప్పించారు. .దీంతో వైసీపీ అధిష్ఠానం సుబ్బరాయుడుని పార్టీ నుంచి బహిష్కరించింది. అప్పటి నుంచి వైసీపీకి అత్యంత దూరంగా వుంటూ ఎప్పటికపుడు వైసీపీ పార్టీనీ విమర్శిస్తూ వస్తున్నారు.

సుబ్బరాయుడు ఎన్ని పార్టీలు మారిన ఇప్పటికీ అతని వెంట నడిచే కార్యకర్తలు అలానే వున్నారు.. గత కొన్నాళ్ళ నుంచి సుబ్బరాయుడు సైకిల్ ఎక్కుతారు అనే ఊహాగానాలు జోరుగా ప్రచారం సాగాయి. స్కిల్ డెవలెప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించారు సుబ్బరాయుడు. నరసాపురంలో ఏకంగా చంద్రబాబుకు మద్దతుగా బైక్ ర్యాలీ చేపట్టడం,టీడీపీ నాయకులు చేస్తున్న నిరసన కార్యక్రమాల్లో సుబ్బరాయుడు పాల్గొనడం ఇదంతా మరోసారి తాను రాజకీయ ఓనమాలు దిద్దిన పార్టీ అయిన టీడీపీలో చేరుతారు అనే ప్రచారం జరిగిపోతుంది.

ఇప్పటికే నియోజకవర్గంలో టీడీపీ నుంచి త్రిముఖ పోటీ నెలకొని ఉన్న కొత్తగా సుబ్బరాయుడు చేరితే పరిస్థితి ఎలా ఉంటుందో అనే ఊహాగానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.మొన్నటి వరకు జనసేనలోకి సుబ్బరాయుడు ఎంట్రీ ఇస్తారు అనుకున్న నియోజవర్గ ప్రజలు సుబ్బరాయుడు అనుసరిస్తున్న విధానాలు చూస్తే సుబ్బరాయుడు చూపు టీడీపీ వైపే వున్నట్టు అనిపిస్తుంది.అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ జిల్లాలో సీనియర్ రాజకీయ నేతగా ఉన్న కొత్తపల్లి ఎటూ వైపు వెళ్తారో కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

#westgodavari #kottapalli-subbarayadu #tdp #bhimavaram #ycp #congress
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

Pawan Kalyan : విద్యార్థులు పరీక్ష అందుకోలేకపోయిన ...

Pawan Kalyan : విద్యార్థులు పరీక్ష అందుకోలేకపోయిన పరిస్థితిపై విచారణ

పెందుర్తి ప్రాంతంలో జె.ఈ.ఈ. పరీక్షకు కొందరు విద్యార్థులు అందుకోలేకపోవడానికి ఉప ముఖ్యమంత్రి కాన్వాయి కారణమని వచ్చిన వార్తా కథనాలను పరిగణనలోకి తీసుకొని వాస్తవ కారణాలను అన్వేషించి విచారణ కు పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈ మేరకు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.

New Update
pawan kalyan

pawan kalyan Photograph: (pawan kalyan)

Pawan Kalyan :పెందుర్తి ప్రాంతంలో జె.ఈ.ఈ. పరీక్షకు కొందరు విద్యార్థులు అందుకోలేకపోవడానికి ఉప ముఖ్యమంత్రి కాన్వాయి కారణమని వచ్చిన వార్తా కథనాలను పరిగణనలోకి తీసుకొని వాస్తవ కారణాలను అన్వేషించి విచారణ కు  పవన్ కళ్యాణ్  ఆదేశించారు. కాన్వాయి కోసం ఎంతసేపు ట్రాఫిక్ ను నిలుపుదల చేశారు.  పరీక్ష కేంద్రం దగ్గరకు విద్యార్థులు చేరుకోవలసిన మార్గాల్లో ఆ సమయంలో ఉన్న ట్రాఫిక్ పరిస్థితి ఏమిటి అనే దానిపై విచారణ చేయాలని ఆదేశించారు.  సర్వీసు రోడ్లలో ఉన్న ట్రాఫిక్ ను ఏమైనా నియంత్రించారా విషయాలను కూడా తెలుసుకోవాలన్నారు.తదితర అంశాలపై విచారించాల్సిందిగా విశాఖపట్నం పోలీసులకు పవర్‌ కళ్యాణ్‌  ఆదేశాలు జారీ చేశారు.

Also read: Rameswaram: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

 తన పర్యటనల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూడాలని ఇప్పటికే పవన్ సూచించారు.కూటమి ప్రభుత్వంలో ముఖ్యుల పర్యటనల సందర్భంలో స్వల్ప వ్యవధి మాత్రమే ట్రాఫిక్ రెగ్యులేషన్ చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా పోలీసులు ట్రాఫిక్ రెగ్యులేషన్ ,హెలికాప్టర్ లో వెళ్ళినా రోడ్డుపై ట్రాఫిక్ నిలవడం, చెట్లు కొట్టడం లాంటివి చేయడం ఆపడం లేదని తెలిపారు.పార్టీ శ్రేణులు, నాయకులకు సైతం క్రేన్ దండలు కార్యక్రమాలు, ట్రాఫిక్ అవాంతరాలు కలిగించే చర్యలు చేపట్టరాదని కేంద్ర కార్యాలయం నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

Also read :  Ram Navami 2025: అయోధ్యలో అద్భుతం. రామ్‌ లల్లాకు సూర్య తిలకం


కాగా ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కారణంగా పరీక్ష కి ఆలస్యం అయిందని కొంతమంది విద్యార్థులు ఆరోపించారు. కన్వాయి వల్ల - పెందుర్తి అయాన్ డిజిటల్  JE అడ్వాన్స్ విద్యార్థులు ఆలస్యంగా పరీక్షా కేంద్రానికి వెళ్ళాల్సి వచ్చిందని వాపోయారు. 30 మంది విద్యార్థులు పరీక్షా కేంద్రానికి వెళ్లి పరీక్ష   రాయకుండా వెనిదిరగాల్సి వచ్చింది. దీనివల్ల - పిల్లల భవిష్యత్తు అగమ్య అవుతుందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.

Also read: Ramnavami: రామాలయంలో అపశృతి.. టెంట్లు కూలీ భక్తుల తలలు పలిగాయి

Advertisment
Advertisment
Advertisment