TG News: మతిభ్రమించి మాట్లాడుతున్నావ్ డాక్టర్లకు చూపించుకో.. కోమటిరెడ్డిపై హరీష్ రావు ఫైర్!

ఫోన్ ట్యాపింగ్ నిందితుడు ప్రభాకర్ ను కలిసేందుకే అమెరికా వెళ్లినట్లు మంత్రి కోమటిరెడ్డి చేస్తున్న ఆరోపణలకు హరీష్ రావు ఖండించారు. ముఖ్యమంత్రి, మంత్రులు అబద్దాలతో ప్రభుత్వాలు నడుపుతున్నారని చెప్పడానికి ఆ ఆరోపణ ఒక ఉదాహరణ అన్నారు. కుటుంబ సభ్యులతో విదేశాలకు వెళ్లినట్లు చెప్పారు.

New Update
TG News: మతిభ్రమించి మాట్లాడుతున్నావ్ డాక్టర్లకు చూపించుకో.. కోమటిరెడ్డిపై హరీష్ రావు ఫైర్!

Harish Rao Fired On Komatireddy: ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) చేసిన ప్రభాకర్ రావును కలవడానికే అమెరికా వెళ్ళాడంటూ మంత్రి కోమటిరెడ్ది చేసిన ఆరోపణలను హరీష్ రావు ఖండించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మతిభ్రమించిందని, ఆయన డాక్టరుకు చూపించుకోవడం మంచిదని సూచించారు. ముఖ్యమంత్రి, మంత్రులు అబద్దాలతో ప్రభుత్వాలు నడుపుతున్నారని చెప్పడానికి ఆ ఆరోపణ ఒక ఉదాహరణ అన్నారు. నేను నా కుటుంబ సభ్యులతో విదేశాలకు వెళ్ళింది వాస్తవం. అయితే నేను అమెరికా వెళ్లినట్టు, ప్రభాకర్ రావును కలిసినట్టు, ఈరోజు మంత్రి వెంకట్ రెడ్డి మాట్లాడారు. నేను అమెరికా వెళ్లి, ప్రభాకర్ రావుని కలిసినట్లు రుజువు చేస్తే అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాయడానికి నేను సిద్ధం. రుజువు చేయకపోతే వెంకట్ రెడ్డి గారు బహిరంగ క్షమాపణ చెప్పి అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: TG News: ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ అరెస్ట్ తప్పదు.. మంత్రి కోమటిరెడ్డి

నేను ఏ దేశం వెళ్లాను, ఏ హోటల్‌లో ఉన్నాను తదితర వివరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నా పాస్‌పోర్ట్‌తో సహా ఇతర వివరాలు తీసుకొని బహిరంగ చర్చకు వస్తాను. పాస్‌పోర్టులో ఇమిగ్రేషన్ ఇన్ అండ్ అవుట్ వివరాలు ఉంటాయి. కనీస జ్ఞానం లేకుండా పబ్లిసిటీ కోసం కోమటిరెడ్డి గారు మాట్లాడటం చౌకబారుతనం. కోమటిరెడ్డి గారి దగ్గర ఉన్న వివరాలతో రుజువు చేయాలని, ఆధారాలతో రావాలని డిమాండ్ చేస్తున్నాను. ఆధారాలతో రాని పక్షాన బేషరతుగా క్షమాపణ చెప్పాలి.అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాయాలి. కోమటిరెడ్డి గారు చెప్పిన తేదీన, చెప్పిన టైంకి అమరవీరుల స్తూపం వద్దకు నేను వస్తాను, మీ ఆధారాలతో మీరు రండి. టీవీల్లో బ్రేకింగ్ స్క్రోలింగ్‌ల కోసం చిల్లర వ్యాఖ్యలు చేయడం మాని పాలనపై దృష్టి సారించాలి. నిరాధార నిందలు వేసి నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలనుకునే చౌకబారు ప్రయత్నాలు మానుకొని కోమటిరెడ్డి గారు తన హుందాతనాన్ని నిలుపుకోవాలి. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఏది మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడండి. ఆ భగవంతుడు మీకు సద్భుద్ధిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను అన్నారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు.

Advertisment
Advertisment
తాజా కథనాలు