INDIA : భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవాలంటే వాళ్లిద్దరూ ఉండాల్సిందే : ఏబీ డివిలియర్స్

విరాట్‌, రోహిత్‌లను టీ20 జట్టులోకి ఎంపిక చేయడం సరైన నిర్ణయమేనని సౌతాఫ్రికా మాజీ ఆటగాడు డివిలియర్స్ అన్నారు. జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉండటం చాలా ముఖ్యం. వాళ్లు భారత్ కు టీ20 ప్రపంచకప్‌ను అందించగలరు’ అంటూ సంతోషం వ్యక్తం చేశారు.

New Update
INDIA : భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవాలంటే వాళ్లిద్దరూ ఉండాల్సిందే : ఏబీ డివిలియర్స్

AB De Villiers : భారత సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ(Rohit), విరాట్ కోహ్లి(Kohli) ని తిరిగి T20 జట్టులోకి తీసుకోవడంపై సౌతాఫ్రికా(South Africa) మాజీ ఆటగాడు ఏ.బీ. డివిలియర్స్(A.B. de Villiers) పాజిటివ్ గా స్పందించారు. వీరిద్దరూ 2022 ప్రపంచకప్(World Cup) తర్వాత T20Iలో పాల్గొనలేదు. దీంతో ఎంతోమంది యువకులను కాదని వీరిద్దరినీ ఎంపికచేయడంపై పలు దానిపై ప్రశ్నలు తలెత్తాయి. ఈ క్రమంలోనే భారత సూపర్ స్టార్లకు మద్దతుగా నిలిచిన డివిలియర్స్.. మెనేజ్ మెంట్ నిబద్ధతను మెచ్చుకున్నారు.

A.B. de Villiers

ప్రపంచకప్‌ అందించగలరు..
ఈ మేరకు భారత టీ20 జట్టులో స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి ఎంపిక ఆశ్చర్యం కలిగించలేదని చెబుతూ.. '2022 నవంబరులో చివరిసారిగా టీ20 ఆడిన కోహ్లీని అఫ్గానిస్తాన్‌(Afghanistan) తో సిరీస్‌కు సెలెక్టర్లు ఎంపిక చేశాయడం నాకెలాంటి ఆశ్చర్యం కలగలేదు. విరాట్‌, రోహిత్‌ ఎంపిక సంతోషాన్ని ఇచ్చింది. టీ20 ప్రపంచకప్‌ గెలవాలంటే అత్యుత్తమ జట్టును తయారు చేసుకోవాలి. యువ ఆటగాళ్లకు అవకాశాలు చేజారుతాయన్న విమర్శల్ని అర్థం చేసుకోగలను. కానీ కెరీర్‌ చరమాంకంలో నాకూ ఇదే పరిస్థితి ఎదురైంది. విరాట్‌, రోహిత్‌లను జట్టులోకి ఎంపిక చేయడం సరైన నిర్ణయం. నాకు 35 ఏళ్లు ఉన్నప్పుడు మా క్రికెట్‌ బోర్డు ఇలానే ఆలోచించి ఉంటే బాగుండేది. జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉండటం ముఖ్యం. వాళ్లు ప్రపంచకప్‌ను అందించగలరు’ అని డివిలియర్స్‌ తన మనసులో మాట బయటపెట్టాడు.

Virat - Kohli

ఇది కూడా చదవండి : Venu Swamy : నయనతార కాపురంలో చిచ్చురేపిన వేణుస్వామి.. విడాకులు తప్పవంటూ

అతని బాడీలో క్రికెట్‌ ప్రవహిస్తుంది..
అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో కోహ్లితో కలిసి ఒక దశాబ్దం పాటు ఆడిన డివిలియర్స్ విరాట్ ఆట పట్ల ప్రశంసలు కురిపించాడు. 'విరాట్ బాడీలో రక్తం కంటే ఎక్కువ క్రికెట్‌ ప్రవహిస్తుంది. అదే అతనిని ఇంతకాలంగా కొనసాగించేలా చేస్తుంది. క్రికెట్ అంటే అతనికి ఎప్పటి నుంచో అభిమానం. అతను తన కుటుంబంతోపాటు తన జీవితంలో అద్భుతమైన అనుభవాలను కలిగి ఉన్నాడని నేను భావిస్తున్నాను' అన్నారు.

తప్పుడు ప్రణాళికలు ..
ఇక భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ పై కూడా మాట్లాడాడు. కేప్ టౌన్‌లోని న్యూలాండ్స్ పిచ్ సంతృప్తికరంగా లేదని, 642 బంతుల్లో మ్యాచ్ ముగియడం తనకు ఆశ్చర్యమేసిందన్నారు. 'న్యూలాండ్స్ పిచ్ నాకు చాలా సాధారణంగా కనిపించింది. ఇది మొదటిరోజు మొదటి సెషన్‌కు మాత్ర సరిపోతుంది. అది చివరల్లో చాలా సులభం అవుతుంది. కానీ రెండు జట్ల పేలవమైన ప్రదర్శన అసంతృప్తినించ్చింది' అని చెప్పారు. 'న్యూలాండ్స్‌లో సెంచరీ చేసి మార్కరమ్ లాగా సానుకూల క్రికెట్ ఆడాలి. కానీ రెండు జట్ల ఆట ప్రణాళికలు తప్పుగా ఉన్నాయి. ఇది కష్టమైన, వేగవంతమైన పిచ్ అని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి : IND vs AFG: ఇలాంటి పరిస్థితుల్లో ఆడటం అంత ఈజీ కాదు : రోహిత్

ఇదిలావుంటే.. 2021లో IPL కెరీర్‌కు ముగింపు పలికిన డివిలియర్స్ RCBకి కోచ్ లేదా మెంటర్‌గా తిరిగి రావాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు. 'RCB నుంచి ఎవరూ నన్ను సంప్రదించలేదు. విరాట్ నన్ను ఒకటి లేదా రెండు రోజులు అక్కడ ఉండమని అడిగితే.. కోచ్‌గా కాకుండా స్నేహితుడిగా జట్టుతో కొంత సమయం గడపడానికి వెళ్తాను. గురువు లేదా అలాంటి ఏదైనా పాత్రలో నా జ్ఞానం లేదా అనుభవాన్ని పంచుకోవడానికి నేను ఇష్టపడతానంటూ చెప్పుకొచ్చారు డివిలియర్స్.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Babu Mohan : రాజకీయాల నుంచి సేవారంగంవైపు... బాబుమోహన్‌ కీలక నిర్ణయం

 ప్రముఖ సినీ నటుడు బాబు మోహన్ తెలియనివారుండరు. తన హాస్యనటనతో ఎందరినో అలరించిన ఆయన ఆ తర్వాత రాజకీయరంగ ప్రవేశం చేశారు. మంత్రిగా కూడా పనిచేశారు. ఈ రోజు సేవా రంగంలోకి అడుగుపెట్టారు. తన కుమారుడి జ్ఞాపకార్థం ‘పవన్ బాబు మోహన్ ఛారిటబుల్ ట్రస్ట్’ను స్థాపించారు.

New Update
Babu Mohan

Babu Mohan

 ప్రముఖ సినీ నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ తెలియనివారుండరు. తన హాస్యనటనతో ఎందరినో అలరించిన ఆయన ఆ తర్వాత రాజకీయరంగ ప్రవేశం చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రఏర్పాటు తర్వాత బీఆర్‌ఎస్‌ లో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ అనుకోని కారణాల వల్ల ప్రస్తుతం ఆయన ఏ పదవిలో లేరు. అయితే ఆయన ఈ రోజు మరో రంగంలోకి అడుగుపెట్టారు. అదే సేవా రంగం. అవును తన కుమారుడి జ్ఞాపకార్థం ‘పవన్ బాబు మోహన్ ఛారిటబుల్ ట్రస్ట్’ను స్థాపించారు. ఈ ట్రస్ట్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న నిరుపేదలకు చేయూత అందిస్తామని ఆయన ప్రకటించారు. సోమవారం బషీర్ బాగ్‌ ప్రెస్ క్లబ్‌లో జరిగిన ఆవిర్భావ సమావేశంలో బాబు మోహన్ ట్రస్ట్ లక్ష్యాలు, కార్యక్రమాలను వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి అనుమతి పొందిన ఈ ట్రస్ట్.. నిరుపేదలకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలను కల్పించడంపై ప్రధానంగా దృష్టి సారిస్తుందని ఆయన తెలిపారు. నిరుద్యోగులకు చేయూత అందించడం కూడా ట్రస్ట్ ముఖ్య లక్ష్యాలలో ఒకటిగా పేర్కొన్నారు.

Also Read :  నీకు తక్కువ జీతం పిల్లనివ్వమని ఒకరు.. సంబంధం కుదరడం లేదని మరోకరు.!
 
బాబు మోహన్ మాట్లాడుతూ.. తన కుమారుడి పేరుతో ఏర్పాటు చేసిన ఈ ట్రస్ట్ ద్వారా సమాజంలోని బలహీన వర్గాలకు సహాయం అందించాలనేది తన చిరకాల కోరిక అని అన్నారు. పేదరికం నుంచి బయటపడటానికి విద్య ఒక ముఖ్యమైన సాధనమని ఆయన నొక్కి చెప్పారు. అందుకే.. ట్రస్ట్ ద్వారా నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు.. వారికి నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు.అలాగే.. సరైన వైద్యం అందక ఇబ్బందులు పడుతున్న వారికి సహాయం అందించడం కోసం.. వైద్య శిబిరాలు నిర్వహించడం, ఆసుపత్రి ఖర్చుల కోసం ఆర్థిక సహాయం చేయడం వంటి కార్యక్రమాలను ఈ ట్రస్ట్ చేపడుతుందని బాబు మోహన్ తెలిపారు. ఉపాధి లేని యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి.. వారు ఉద్యోగాలు పొందేలా సహాయం చేస్తుందన్నారు.

Also Read :  HIT 3 బాహుబలి, RRR రికార్డులను మించి.. ట్రెండింగ్ లో 'హిట్ 3' ట్రైలర్.. ఎన్ని మిలియన్ల వ్యూస్ అంటే!
 
ట్రస్ట్ ద్వారా సహాయం పొందాలనుకునే వారు కోఆర్డినేటర్ రాజ్ కుమార్‌ను 8919511215 నెంబర్‌ ద్వారా సంప్రదించవచ్చని బాబు మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం బండారు గూడెం కోయజాతికి చెందిన సమీప అనే విద్యార్థి ఎంటెక్ చేయడానికి, గ్రూప్స్ కోచింగ్ తీసుకోవడానికి బాబు మోహన్ తన ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం అందజేశారు.

Also Read :  కడుపుతో ఉన్న భార్యను ఎందుకు చంపాడంటే.. షాకింగ్ విషయాలు చెప్పిన విశాఖ పోలీసులు.. !


బాబు మోహన్ కుమారుడు పవన్ కుమార్ 2003 అక్టోబర్ 12న జరిగిన హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. స్పోర్ట్స్ బైక్ అదుపుతప్పి డివైడర్‌ని ఢీ కొట్టడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. కొడుకు మరణంతో బాబు మోహన్ ఎంతగానో కుంగిపోయారు. కొడుకు పేరిట సేవా కార్యక్రమాలు చేపట్టాలని తాను ఎంతో కాలంగా భావిస్తున్నానని.. కానీ రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల కుదరలేదన్నారు. తాను ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండటం వల్ల పూర్తి స్థాయిలో ట్రస్ట్ కోసం పని చేస్తానని ఆయన చెప్పారు.

 Also Read :  ముగ్గురు భార్యలు జంప్.. నాలుగో పెళ్లికి రెడీ.. నీ కష్టం పగోడికి కూడా రావొద్దురా!

Advertisment
Advertisment
Advertisment