Kitchen Vastu Tips : వంట గదిలో వీటి విషయంలో జాగ్రత్త పడకపోతే దరిద్రం తప్పదు..

మన పెద్దలు మనకోసం ఎన్నో ప్రత్యేక విషయాలను చెప్పారు. వాస్తు శాస్త్రం మన ఇంటిని ఎలా ఉంచుకోవాలో వివరిస్తుంది. మన పెద్దలు చెప్పిన.. వాస్తు శాస్త్రం వివరించిన వంటింటిలో తప్పనిసరిగా ఉండాల్సిన వస్తువుల గురించి ఈ ఆర్టికల్  తెలుసుకుందాం.  

New Update
Kitchen Vastu Tips : వంట గదిలో వీటి విషయంలో జాగ్రత్త పడకపోతే దరిద్రం తప్పదు..

Kitchen Tips : హిందూ మతం (Hinduism) లో, శ్రీ మహాలక్ష్మి దేవి (Sri Mahalakshmi Devi) ని సంపద, శ్రేయస్సు, ఆనందానికి దేవతగా పిలుస్తారు. లక్ష్మీదేవి కొలువై ఉన్న ఇంట్లో ఆర్థిక సమస్యలు (Financial Problems) ఉండవని నమ్మకం. అన్నపూర్ణ లక్ష్మీ దేవి రూపమని నమ్ముతారు.  ఆమె ఎప్పుడూ వంటగదిలో నివసిస్తుందని పెదాలు చెబుతారు. అయితే, అన్నపూర్ణ వంటగదిలో కొలువై ఉండాలంటే.. ఆమె చల్లని చూపు మనపై ఉండాలంటే, అందుకు కొన్ని వంటగది నియమాలు తప్పనిసరిగా పాటించాలి. ఈ నియమాలను విస్మరించిన ఎవరైనా అన్నపూర్ణ , లక్ష్మీ దేవి అసంతృప్తిని ఎదుర్కొంటారని అంటారు. దీనికి సంబంధించి వాస్తు శాస్త్రంలో కొన్ని నియమాలు ఉన్నాయి. ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే వంటగదిలో ఆహారానికి లోటు ఉండకూడదు. ఎందుకంటే వంటగదిలో ఈ వస్తువులు అయిపోతే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. వంటగదిలో ఎప్పుడూ ఏయే వస్తువులను తప్పనిసరిగా ఉంచుకోవాలో  తెలుసుకుందాం.

Kitchen Vastu Tips : అన్నం: వంటగదిలో బియ్యం తప్పనిసరిగా ఉంటాయి. మన  ప్రధాన ఆహారం వరి. అయితే బియ్యం డబ్బాను ఎప్పుడూ ఖాళీగా ఉంచవద్దు. బియ్యం అయిపోతే.. వెంటనే డబ్బాలో మళ్లీ బియ్యం నింపాలి. బియ్యం పాత్ర ఖాళీగా ఉంటే శుక్ర దోషం వస్తుంది. డబ్బుకు సంబంధించిన సమస్యలను కూడా ఎదుర్కోవలసి వస్తుంది.

Also Read:  తులసి దగ్గర ఈ 6 వస్తువులను ఎప్పుడూ ఉంచొద్దు…జాగ్రత్త!

పిండి: వాస్తు శాస్త్రం ప్రకారం పిండిని ఎప్పుడూ వంటగదిలో సమృద్ధిగా ఉంచాలి. వాస్తు ప్రకారం వంటగదిలో పిండి అయిపోవడం అశుభం. ఒక వ్యక్తి గౌరవం దెబ్బతింటుంది.

పసుపు: వంటగదిలో ఉంచిన పసుపును హిందూ మతంలో పవిత్రమైనదిగా భావిస్తారు. పసుపును పూజకు సంబంధించిన కార్యక్రమాల్లోనే కాకుండా వంట సమయంలో కూడా ఉపయోగిస్తారు. కాబట్టి ఇంట్లో పసుపు ఉండకపోవడం అశుభం. అంతేకాకుండా ఇది జాతకంలో గురు దోషాన్ని కలిగిస్తుంది. శుభకార్యాల్లో కూడా అపజయం వచ్చే అవకాశం ఉంది.

ఉప్పు: వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిలో ఉప్పు పాత్ర పూర్తిగా ఖాళీగా ఉండకూడదు. అది అయిపోయేలోపు దాన్ని రీఫిల్ చేయండి. ఉప్పు లోపిస్తే ఆ ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ వచ్చి వాస్తు దోషం వస్తుంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Omar Abdullah: పాక్‌ ప్రధానిపై ఒమర్‌ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

పాకిస్థాన్ ప్రధానిపై జమ్మూకశ్మీర్‌ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ పాశమిక సంఘటనను పాకిస్థాన్‌ ముందుగా తోసిపుచ్చిందని.. భారత్‌పైనే నిందలు వేసిందంటూ విమర్శించారు. ఈ దాడిని వాళ్లు కనీసం గుర్తించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

New Update
They didn't even recognise, Omar Abdullah on Pak's probe offer into Pahalgam

They didn't even recognise, Omar Abdullah on Pak's probe offer into Pahalgam

పహల్గాంలో ఉగ్రదాడి అనంతరం దీనిపై తటస్థ, పారదర్శక దర్యాప్తునకు తాము రెడీగా ఉన్నామని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై తాజాగా జమ్మూకశ్మీర్‌ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ పాశమిక సంఘటనను పాకిస్థాన్‌ ముందుగా తోసిపుచ్చిందని.. భారత్‌పైనే నిందలు వేసిందంటూ తీవ్రంగా విమర్శలు చేశారు. '' పహల్గాంలో చోటుచేసుకున్న దాడిని వాళ్లు కనీసం గుర్తించలేదు.

Also read: భారత్-పాకిస్థాన్ యుద్ధం డేట్‌ ఫిక్స్‌..! పాక్ మాజీ హైకమిషనర్‌ సంచలన కామెంట్స్‌

ఈ ఘటన వెనుక భారత్ ఉందని వాళ్లే మొదటగా ఆరోపించారు. మనపై ఎప్పుడూ ఆరోపణలు చేసేందుకు ముందుండే వాళ్లకు ఇప్పుడు మనమేమి చెప్పలేం. వాళ్లు చేసిన ప్రకటనలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వాలని అనుకోవడం లేదు. ఈ ఘటన జరిగి ఉండాల్సింది కాదని'' సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఇదిలాఉండగా పహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ దీనిపై స్పందించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తటస్థ, పారదర్శక, విశ్వసనీయ దర్యాప్తులో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అలాగే సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకోవడాన్ని ఆయన ఖండించారు.  

Also Read: వామ్మో.. ఆ రాష్ట్రంలో 5వేల మంది పాకిస్థానీయులు..

ఇదిలాఉండగా.. పాకిస్థాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్‌లోని ఓ వార్తా ఛానెల్‌తో మాట్లాడుతూ భారత్.. పాకిస్థాన్‌పై ఎప్పుడు దాడి చేస్తుందో చెప్పారు. '' భారత్‌ నుంచి కచ్చింతగా ప్రతీకార చర్య ఉంటుందని నాకు ఎలాంటి సందేహం లేదు. ఎందుకుంటే భారత ప్రధాని మోదీ కూడా బిహార్‌లో చర్యలు తీసుకుంటామని ప్రకటన చేశారు. గతంలో పరిశీలిస్తే యూరీ, పుల్వామా దాడుల తర్వాత భారత్‌ చర్యలకు దిగిన సందర్భాలున్నాయి. యూరీ దాడి తర్వాత 89లో భారత్‌ చర్యలకు దిగింది. పుల్వామా దాడి తర్వాత 12 రోజుల్లోనే సర్జికల్‌ స్ట్రేక్ చేసింది. ఏప్రిల్ 22న పహల్గాంలో దాడి జరిగింది కాబట్టి.. మే మొదటి వారంలో లేదా మధ్యన భారత్‌ దాడి చేసే అవకాశం ఉందని'' అబ్దుల్ బాసిత్ అన్నారు.

Also Read: అంతా మారిపోయింది.. వాళ్లు రాజకీయాల్లోకి రావాలి: రాహుల్‌ గాంధీ

Also Read: మీకు దండం పెడతా.. పిల్లలకు గుండె ఆపరేషన్లు ఉన్నాయి.. పాకిస్థానీ తండ్రి ఆవేదన!

telugu-news | rtv-news | national-news | Omar Abdullah 

Advertisment
Advertisment
Advertisment