Kishan Reddy: కేసీఆర్ కుటుంబానికి అహంకారం ఎక్కువ.. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మరోసారి కేసీఆర్ ఫ్యామిలీపై సంచలన కామెంట్స్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అందించిన నిధులతోనే రాష్ట్రంలో మెరుగులు దిద్దిన కేసీఆర్ కుటుంబం.. అహంకారంతో సిగ్గు లేకుండా మాట్లాడుతుందన్నారు. దేశంలో ఏ ఒక్క నాయకుడు అలా మాట్లాడరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

New Update
Kishan Reddy: కేసీఆర్ కుటుంబానికి అహంకారం ఎక్కువ.. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు

BJP Kishan Reddy: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మరోసారి కేసీఆర్ (KCR) ఫ్యామిలీపై సంచలన కామెంట్స్ చేశారు. చంద్రశేఖర్ రావు కుటుంబానికి అహంకారం ఎక్కువగా ఉంటుందని, హద్దు అదుపు లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతూ సిగ్గులేకుండా వ్యవహరిస్తారంటూ మండిపడ్డారు. సోమవారం ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న కిషన్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Govt) తెలంగాణ ప్రజలకు చేసిందేమీ లేదని, కేంద్ర ప్రభుత్వం అందించిన నిధులను తమ పేరు చెప్పుకుందంటూ తీవ్ర విమర్శలు చేశారు.

సహాయక సంఘాల కాన్సెప్ట్ మాదే..
ఈ మేరకు బీజేపీ ప్రభుత్వం చేపట్టిన సహాయక సంఘాల గురించి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. 1998లో స్వయం సహాయక సంఘాల కాన్సెప్ట్ ను వాజ్ పేయ్ ప్రవేశ పెట్టారని చెప్పారు. అదే స్ఫూర్తితో ఇప్పుడు వేలాది స్వయం సహాయక సంఘాల ఏర్పడ్డాయని, ఎన్ని కోట్ల సంఘాలు ఏర్పాటు చేసినా ఆర్థిక సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. బ్యాంకులు కూడా సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని, కరోనా ‌సమయంలో ఆర్థిక సాయం పై మోదీ కీలక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. 'ఎలాంటి డిఫాల్ట్ లేకుండా రుణాలు కడితే వారికి 20లక్షల రుణాలు ఇవ్వాలని నిర్ణయించాం.

కేసీఆర్ వడ్డీ చెల్లించలేదు..
రుణాల (Loans) పై 7శాతం రుణాలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. కానీ అప్పడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ వడ్డీ చెల్లించలేదు. స్వయం సహాయక సంఘాల ఉంటే ఆ ప్రాంతంలో సమస్యలపై మాట్లాడుతారు. ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. స్వయం సహాయక సంఘాలను పెంచాల్సిన అవసరం ఉంది. స్వయం సహాయక సంఘాలు ఒక పెద్ద శక్తి. ఎన్నికలు, రాజకీయాలు పక్కన పెట్టి స్వయం సహాయక సంఘాల పై దృష్టి సారించాలి' అని రాష్ట్రప్రభుత్వానికి సూచించారు.

ఇది కూడా చదవండి: WTC Table: కొంపముంచిన హైదరాబాద్‌ ఓటమి.. బంగ్లాదేశ్‌ కంటే కిందకి పడిపోయిన ర్యాంక్!

మూడున్నర కోట్ల ఇండ్లు ఇచ్చాం..
ఇక దేశంలో మూడున్నర కోట్ల ఇండ్లను బీజేపీ (BJP) ప్రభుత్వం పేద మహిళలకు ఇచ్చిందన్నారు. అంతేకాదు ప్రజలకు ఎన్ని గ్యాస్ కనెక్షన్లు అయినా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని, ప్రతి ఏటా ఒక మహిళకు స్టాండప్ కింద పది లక్షల నుంచి 10కోట్ల వరకు రుణాలు ఇవ్వాలని నిబంధనల పెట్టినట్లు వెల్లడించారు. మహిళలకు అత్యంత గౌరవం ఇచ్చిన వ్యక్తి ప్రధాని మోడీ. మహిళల సైనికులు మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత లో కూడా దేశ రక్షణ కోసం బార్డర్ లో పని చేస్తున్నారు. పాకిస్థాన్ లో జరిగిన ఎయిర్ స్ట్రైక్ ఆపరేషన్ లో మహిళా పైలెట్ పాల్గొందని ప్రశంసలు కురిపించారు.

ఫిబ్రవరి చివరి వారంలో ఎన్నికల షెడ్యూల్..
అలాగే మహిళా స్వయం సహాయక సంఘాల వద్దకు వెళ్ళి కేంద్ర ప్రభుత్వం పథకాలు వివరించాలని, ఫిబ్రవరి చివరి వారంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని, గతంలో తెలంగాణ లో ఏప్రిల్ 14న ఎన్నికలు జరిగాయనే విషయాన్ని గుర్తు చేశారు. గత ఎన్నికలకు వారం రోజుల అటూ ఇటుగా ఎన్నికలు జరగవచ్చు. అందరూ సిద్దం గా ఉండాలి. కాంగ్రెస్ హయాంలో అనేక కుంభకోణాలు జరిగాయి. ఆ కుంభకోణాలు ఉండకూడదనే బీజేపీకి ప్రజలు పట్టం కట్టారు. ఎలాంటి అవినీతి లేకుండా మోడీ పాలన సాగిస్తున్నారు. భారత్ లో కరోనా వస్తే తీవ్ర నష్టం జరుగుతుందని ప్రపంచంలో చాలామంది విశ్లేషకులు చెప్పేవారు. రాపీ కరోనాను సమర్దవంతంగా మోడీ ఆధ్వర్యంలో ఎదుర్కోన్నాం. సమర్దవంతమైన వ్యాక్సిన్ ను తయారు చేశాం. స్వయంగా ప్రధాని వచ్చి వ్యాక్సిన్ తయారు చేసే కంపెనీలను సందర్శించి వారికి ధైర్యం ఇచ్చారు. మాస్క్ లు, పీపీఈ కిట్లు కూడా ఇన్పోర్ట్ చేసుకున్నాం. ఆ తరువాత ఇప్పుడు అన్ని మన దేశంలో తయారు చేసుకుంటున్నాం. మోడీని విమర్శించే ధైర్యం విపక్షాలకు లేదు. ఏదో ఓ రకంగా మోడీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు.విపక్షాలు పెట్టుకున్న కూటమి అప్పుడే విచ్చిన్నం అవుతుందని ఎద్దేవా చేశారు.

కేసీఆర్ కుటుంబానికి అహంకారం..
అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో కనీసం రోడ్లు కూడా ఉండేవి కావని, కానీ తమ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతోందని చెప్పారు. రాష్ట్రంలో 32జిల్లాలకు జాతీయ రహదారులను అనుసంధానం చేశామని, భారతీయులు అంటే గతంలో అవమానించే వారని, ఇప్పుడు భారత పాస్పోర్ట్ ఉంటే పెద్దఎత్తున గౌరవం దక్కుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున బాంబు పేలుళ్లు జరిగేవని, ఇప్పుడు ఎక్కడా బాంబు పేలుళ్లు లేవన్నారు. 2023లో మొదటిసారి కశ్మీర్ లో 2కోట్ల మంది పర్యాటకులు వచ్చారని, ఆర్టికల్ 370రద్దు చేసి శాంతి నెలకొల్పామని తెలిపారు. గతంలో జమ్మూ కశ్మీర్లో జంగిల్ రాజ్ ఉండేదని, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. చివరగా రాష్ట్రంలో బీజీపీ ప్రభుత్వం అందించిన నిధులతో మెరుగులు దిద్దిన కేసీఆర్ కుటుంబం అహంకారంతో సిగ్గు లేకుండా మాట్లాడుతుందని, దేశం లో ఏ ఒక్క నాయకుడు అలా మాట్లాడరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

pahalgam terrorist attack: హిమాచల్ ప్రదేశ్ లో హై అలెర్ట్..ఉగ్రదాడి జరగొచ్చనే హెచ్చరికలు

టెర్రరిస్టులు ఇంకా భారత్ లోనే ఉన్నారు. వారి కోసం భద్రతా దళాల వేట కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పహల్గామ్ తరహాలో మరోసారి ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరించారు. దీంతో హిమాచల్ ప్రదేశ్ లో హై అలెర్ట్ ప్రకటించారు. 

New Update
india

High Alert In Himachal Pradesh

కాశ్మీర్ లో పహల్గామ్ లోని బైసరన్ వ్యాలీలో దాడులు జరిగి రెండు రోజులు అవుతున్నా దాని నుంచి ఇంకా కోలుకోలేదు. యావత్ భారతదేశం శోక సంద్రంలో మునిగిపోయింది. ఉగ్రవాదుల మీద కోపంతో రగిలిపోతోంది. ఉగ్రవాదుల తలలు కావాలని దాడిలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులు అడుగుతున్నారు. కేంద్రం కూడా ఈ ఉగ్రదాడిని తీవ్రంగా తీసుకుంది. ఇందులో భాగంగా నిన్న పాకిస్తాన్ మీద కఠిన చర్యలు తీసుకుంది. ఆ దేశంతో దౌత్యపరమైన సంబంధాలను క్యాన్సిల్ చేసుకున్నారు. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేశారు. 

బార్డర్ దగగర హై సెక్యూరిటీ..

ఇదెలా ఉంటే టెర్రరిస్టుల కోసం భద్రతా బలగాలు తీవ్రంగా గాలిస్తున్నారు. కొంత మందిని అదుపులోకి తీసుకున్నారు. దాడి చేసిన వారిని గుర్తుపట్టారు. వారి ఫోటోల ఆధారంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఉగ్రవాదులు ఇంకా దేశంలోనే ఉన్నారని తెలుస్తోంది.  ఈ నేపథ్యంలో పహల్గామ్ తరహాలో మరో ఉగ్రదాడి జరగొచ్చని అంటున్నారు ఇంటెలిజెన్స్ అధికారులు. హిమాచల్ ప్రదేశ్ లో దాడులకు తెగబడే అవకాశం ఉందని హెచ్చరించారు. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అలెర్ట్ అయింది. హిమాచల్ ప్రదేశ్ లో హై అలెర్ట్ ప్రకటించింది. సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉండాలని సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు పోలీసులును ఆదేశించారు. ముఖ్యంగా జమ్ము, కాశ్మీర్ బార్డర్ ను పంచుకునే హిమాచల్ ప్రదేశ్ లోని చంబా, కంగ్రా జిల్లాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించారు. కాశ్మీర్ నుంచి పారిపోయిన ఉగ్రవాదులు హిమాచల్ ప్రదేశ్ వైపు రావొచ్చనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. 

pahalgam terrorist attack | today-latest-news-in-telugu | himachal-pradesh | high-alert

Also Read: Indus River Agreement: 64 ఏళ్ళ ఒప్పందానికి స్వస్తి..ఎడారిగా మారనున్న పాకిస్తాన్

Advertisment
Advertisment
Advertisment