Congress: బెంగళూరులో ఖమ్మం ఎంపీ సీటుపై పంచాయితీ..!

బెంగళూరులో ఖమ్మం ఎంపీ సీటుపై పంచాయితీ నడుస్తోంది. భట్టి విక్రమార్క, పొంగులేటితో ఖర్గే సమావేశం అయ్యారు. తొలుత ఇద్దరితో మాట్లాడిన ఖర్గే ఆ తర్వాత విడివిడిగా మీటింగ్ ఏర్పాటు చేశారు. రాత్రి కల్లా ఖమ్మం అభ్యర్థితో పాటు కరీంనగర్, హైదరాబాద్ అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది.

New Update
Congress: బెంగళూరులో ఖమ్మం ఎంపీ సీటుపై పంచాయితీ..!

Congress: బెంగళూరులో ఖమ్మం ఎంపీ సీటుపై పంచాయితీ నడుస్తోంది. భట్టి విక్రమార్క, పొంగులేటితో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమావేశం అయ్యారు. తొలుత ఇద్దరితో మాట్లాడిన ఖర్గే ఆ తర్వాత విడివిడిగా మీటింగ్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఖమ్మం ఎంపీ సీటు రేసులో ఇప్పటికే చాలా మంది పేర్లు వినిపించాయి.

Also Read: అనపర్తిలో బిగ్‌ ట్విస్ట్‌.. బీజేపీలోకి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి

భట్టి భార్య నందిని, పొంగులేటి తమ్ముడు ప్రసాద్‌రెడ్డి, కొత్తగా తెరపైకి మండవ వెంకటేశ్వర్రావు, రామసహాయం రఘురామిరెడ్డి  పోటీలో ఉన్నారని టాక్ నడుస్తోంది. తాజాగా, ఈ రేసులో రాయల నాగేశ్వరరావు, ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయిన నాగేశ్వరరావు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే, రాత్రిలోపు ఖమ్మం అభ్యర్థితో పాటు కరీంనగర్, హైదరాబాద్ అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు