KCR సినిమాకు షాక్ ఇచ్చిన ఈసీ.. కారణమిదే!

KCR సినిమాకు ఎన్నికల కమీషన్ షాక్ ఇచ్చింది. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ స్టోరీలో రాకింగ్ రాకేష్ హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రాన్ని ఇప్పట్లో రిలీజ్ చేసేందుకు అనుమతించలేదు. దీంతో మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందంటూ రాకేష్ ఓ వీడియోను షేర్ చేశారు.

New Update
KCR సినిమాకు షాక్ ఇచ్చిన ఈసీ.. కారణమిదే!

ప్రముఖ కమెడియన్ జబర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేష్ హీరోగా నటిస్తూ నిర్మించిన తాజా చిత్రం ‘కేసీఆర్’. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ వాయిదాపడింది. తెలంగాణలో ఈ నెలలోనే పోలింగ్ జరగనుండగా పొలిటికల్ బేస్డ్ సినిమాలకు సెన్సార్ నో చెబుతుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ఆర్జీవీ ‘వ్యూహం’ సైతం ఇంకా సెన్సార్ పూర్తి కాకపోగా.. తాజాగా రాకేష్ మూవీ ‘KCR’ కూడా సెన్సార్ ఆపేశారట. ప్రస్తుతం ఈ సినిమాను విడుదల చేయడానికి వీలులేదని ఈసీ అధికారులు చెప్పేశారట. దీంతో చాలా డిజప్పాయింట్ అయిన కేసీఆర్ ప్రేక్షకుల కోసం ప్రత్యేక వీడియో షేర్ చేశారు రాకేష్.

ఈ మేరకు ‘ఏది జరిగినా మన మంచికే. మీ ఆశీస్సులతో’ అంటూ ఓ వీడియోను ఇన్ స్టా వేదికగా పోస్ట్ చేసిన రాకేష్.. మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్టు. ఈ టైంకే సినిమా రిలీజ్ చేద్దామని పక్కా ప్లాన్‌తో ఉన్నాం. కానీ ఎలక్షన్ కమిషన్ నుంచి కొన్ని ఆర్డర్లు వచ్చాయి. ఇది బయోపికా? ఇది ఏ జానర్ అని రివీల్ చేయడం లేదు. సినిమా గురించి ఏమీ రివీల్ చేయడం లేదు. సెన్సార్ వారికి అన్నీ వివరించాను. ఎన్నికల కోడ్ ప్రకారం ఈ సినిమాను ఇప్పుడు రిలీజ్ చేయకూడదట. ఏది జరిగినా మన మంచికే అని అనుకుంటున్నా. పబ్లిసిటీ చేయడానికి టైం దొరికిందని అనుకుంటాను. మీరంతా నా ప్రతీ పోస్టుకు లైక్ కొట్టండి. ప్రమోట్ చేయండి. నాకు ఎవ్వరూ డబ్బులిచ్చి ఈ సినిమాను చేయమని చెప్పలేదు. సినిమా మీద ప్యాషన్‌తో నా డబ్బులతో నేను తీసుకున్నాను. దీన్ని మీరు గౌరవిస్తున్నారని కోరుకుంటున్నానంటూ చెప్పుకొచ్చారు.

Also read :మృణాల్‌ ఠాకూర్‌తో లవ్ ఎఫైర్.. ఎట్టకేలకు నిజం చెప్పేసిన సింగర్ బాద్‌షా

ఈ క్రమంలోనే సినిమా షూటింగ్ తదితర విషయాల వెల్లడించిన రాకేష్.. ఎన్నికల ముందే రిలీజ్ చేసేందుకు చాలా వేగంగా చిత్రీకరణ జరిపినట్లు తెలిపారు. ఏది ఏమైనా సినిమా కచ్చితంగా వస్తుందని, అద్భుతమైన కథతో రాబోతున్న మూవీ అందరికీ నచ్చుతుందన్నారు. ఈ సినిమా విషయంలో చాలా విమర్శులు ఎదుర్కొన్నట్లు తెలిపిన ఆయన.. ఇదంతా తాను కష్టపడి సంపాదించిన డబ్బుతో తీసిందని, ఎవ్వరూ తనకు డబ్బులివ్వలేదని క్లారిటీ ఇచ్చారు. మూవీని టీఆర్ఎస్ నిర్మిస్తోందని, వారికి బినామీగా ఉన్నానంటూ వచ్చిన రూమర్స్ ను కొట్టిపారేశారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ODELA 2 TRAILER: ప్రేతాత్మతతో భయపెడుతున్న ఓదెల 2 ట్రైలర్.. థియేటర్ లో వణుకే!

తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఓదెల 2 ట్రైలర్ విడుదల చేశారు. హర్రర్, సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. అశోక్ తేజ తెరకెక్కించిన ఈ చిత్రం ఏప్రిల్ 17న థియేటర్స్ లో విడుదల కానుంది.

New Update

ODELA 2 TRAILER: తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఓదెల 2 ట్రైలర్ విడుదల చేశారు. హర్రర్, సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. అశోక్ తేజ తెరకెక్కించిన ఈ చిత్రం ఏప్రిల్ 17న థియేటర్స్ లో విడుదల కానుంది. 2022లో విడుదలైన ఓదెల రైల్వే స్టేషన్ సీక్వెల్ ఈ చిత్రాన్ని రూపొందించారు. తమన్నాతో పాటు హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ, యువ, నాగ మహేష్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజా రెడ్డి తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఈ ట్రైలర్ మీరు కూడా చూసేయండి. 

cinema-news | latest-news | telugu-news

Also Read: Allu Arjun - Atlee Movie: బట్టలు చించుకునే టైం ఆగయా.. హాలీవుడ్ రేంజ్‌లో అల్లు అర్జున్ - అట్లీ మూవీ (వీడియో చూశారా)

Advertisment
Advertisment
Advertisment