Kangana: అవును నేను ప్రేమలో ఉన్నాను.. కానీ అతనికి పెళ్లైంది: కంగన

నిషాంత్ పిట్టి అనే వ్యక్తితో డేటింగ్ వార్తలపై కంగనా రనౌత్ స్పందించింది. 'అతనితో ప్రేమలో ఉన్నాననేది తప్పుడు ప్రచారం. నిషాంత్‌కు పెళ్లైంది. అతని వైవాహిక జీవితాన్ని డిస్ట్రబ్ చేయొద్దు. నేను మరొక వ్యక్తిని ప్రేమిస్తున్నా. త్వరలోనే అతనెవరో చెప్పేస్తా' అని తెలిపింది.

New Update
Kangana: అవును నేను ప్రేమలో ఉన్నాను.. కానీ అతనికి పెళ్లైంది: కంగన

Kangana Ranaut: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తన ప్రేమ వ్యవహారం గురించి ఓపెన్ అయింది. కొంతకాలంగా ప్రముఖ వ్యక్తితో కంగన (Kangana Ranaut) డేటింగ్ చేస్తున్నట్లు వార్తలోస్తున్న విషయం తెలిసిందే. కాగా రీసెంట్ గా అయోధ్యలో (Ayodhya) బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరై సందడి చేసింది. ఈ క్రమంలోనే అక్కడొక వ్యక్తితో ఆమె సన్నిహితంగా ఉన్న ఫొటోలు వైరల్ కావడంతో అతనే తన ప్రియుడు అంటూ నెటిజన్లు నానా హంగామా చేస్తున్నారు. దీంతో వెంటనే స్పందించిన నటి లవ్ లైఫ్ గురించి క్లారిటీ ఇచ్చింది.

నిషాంత్‌కు పెళ్లైంది..
ఈ మేరకు ఈజ్‌ మై ట్రిప్‌ (EaseMyTrip) వ్యవస్థాపకుల్లో ఒకరైన నిషాంత్ పిట్టి (Nishant pitti)తో తాను డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరగడం ఆశ్చర్యంగా అనిపించిందని చెప్పింది. 'నిషాంత్ తో ప్రేమలో ఉన్నాననే వార్తలన్నీ వదంతులు మాత్రమే. దయచేసి ఎవరూ తప్పుడు ప్రచారం చేయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నా. నిషాంత్‌కు పెళ్లైంది. ఆయన భార్యతో సంతోషంగా గడుపుతున్నారు. కాబట్టి అతని వైవాహిక జీవితాన్ని డిస్ట్రబ్ చేయొద్దు' అని కోరింది.

ఇది కూడా చదవండి : RTVలో బిగ్ బాస్ రచ్చ.. లైవ్ లో కొట్లాడిన స్వప్నా చౌదరి, తమ్మలి రాజు

ప్రేమలో ఉన్నది నిజమే..
అలాగే తాను మరో వ్యక్తితో డేటింగ్‌లో ఉన్నట్లు చెబుతూ.. 'ఇది అనౌన్స్ చేయడానికి సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నా. దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. ఇద్దరు వ్యక్తులు కలిసి ఫొటోలు దిగినంత మాత్రాన వారి గురించి ఇలా మాట్లాడటం విజ్ఞత కాదు. మళ్లీ ఇలా చేయరని కోరుతున్నా’ అని చెప్పుకొచ్చింది కంగన.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Manchu war: మా అన్న పెద్ద దొంగ.. విష్ణుపై నార్సింగి పీఎస్‌లో మంచు మనోజ్ ఫిర్యాదు!

మంచు ఫ్యామిలీలో మరోసారి విభేదాలు చెలరేగాయి. మంచు విష్ణు అనుచరులు తన కారుతో పాటు కొన్ని వస్తువులను దొంగలించారని మనోజ్ నార్సింగ్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. అలాగే జల్‌పల్లిలోని తన ఇంట్లో 150 మందితో విధ్వంసం సృష్టించారని తెలిపారు.

New Update
manchu brothers war

vishnu manoj

Manchu Family Fight: గత కొద్ది రోజులుగా మంచు ఫ్యామిలీలో కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే.  అయితే తాజాగా మరోసారి మంచు బ్రదర్స్  విభేదాలు రచ్చకెక్కాయి. మనోజ్ అన్న విష్ణు పై దొంగతనం కేసు పెట్టడం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.  విష్ణు అనుచరులు తన కారుతో కొన్ని వస్తువులను దొంగలించారని మనోజ్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అలాగే జల్‌పల్లిలోని తన నివాసంలో 150 మందితో విధ్వంసం సృష్టించారని, విలువైన వస్తువులను దొంగలించారని తెలిపారు. 

telugu-news | cinema-news | latest-news | manchu family fight | manchu family controversy 

Advertisment
Advertisment
Advertisment