అన్నదమ్ములిద్దరూ కూడా ప్యాకేజీ స్టార్లే..వారి మాటలు నమ్మకండి!

పవన్‌ ఓ ప్యాకేజీ స్టార్‌..ఆయనకు సిగ్గు, బుద్ది రెండు లేవు. మందు తాగి వచ్చాడో, డ్రగ్స్‌ కొట్టి వచ్చాడో తెలియదు కానీ ఏదేదో వాగాడు అంటూ జనసేన అధినేత పై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ మండిపడ్డారు.

New Update
అన్నదమ్ములిద్దరూ కూడా ప్యాకేజీ స్టార్లే..వారి మాటలు నమ్మకండి!

పవన్‌ ఓ ప్యాకేజీ స్టార్‌..ఆయనకు సిగ్గు, బుద్ది రెండు లేవు. మందు తాగి వచ్చాడో, డ్రగ్స్‌ కొట్టి వచ్చాడో తెలియదు కానీ ఏదేదో వాగాడు అంటూ జనసేన అధినేత పై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ మండిపడ్డారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన పవన్, చిరుల మీద విరుచుకుపడ్డారు.

మాయావతి కాళ్లు పట్టుకున్నవాడు. పిచ్చికూతలు కూస్తే ఊరుకోను అంటూ విమర్శలు గుప్పించారు. ఇదే క్రమంలో ఆయన చిరంజీవి మీద కూడా విరుచుపడ్డారు. పవన్‌ , చిరంజీవిల పై సీబీఐ ఎంక్వైరీ వేయిస్తానని పాల్‌ తెలిపారు.

స్టీల్‌ ప్లాంట్‌ ని ఆపకుండా నువ్వు అడ్డుకోగలవా..? అంటూ ప్రశ్నించారు. పవన్‌ కి కనీసం మాట్లాడటం కూడా రాదని, ఇంగ్లీష్‌ రాదని అమిత్‌ షా నాకు చెప్పాడు. బుద్ది లేని ఓ మాజీ మంత్రి ఎవరో జనసేనలో చేరిందట..ఏపీ మీద ప్రేమ ఉన్నవాడు ఎవరూ కూడా జనసేనలో చేరాడు.

అన్న చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్‌ లో విలీనం చేస్తే...తమ్ముడు తన పార్టీని బీజేపీలో విలీనం చేస్తాడంటూ ఆయన జోస్యం చెప్పారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని చిటిక వేసి జైలు పెట్టిస్తానని ప్రగల్భాలు పోతున్నాడు.

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అరెస్ట్‌ చేయించడం అంతా తేలిక. ఈ మాత్రం కూడా తెలియకుండా రాజకీయాల్లోకి ఎలా వచ్చారు అంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఇక మీదట అయినా అన్నదమ్ములిద్దరూ పిచ్చి కూతలు కూయడం మానేయాలి.

వైజాగ్ లో స్టీల్ ప్లాంట్‌ అమ్మడం లేదని మోడీతో ఆర్డర్‌ తీసుకుని వచ్చి అప్పుడు వారాహి యాత్ర చేయి అంటూ పేర్కొన్నారు. కొంత కాలం క్రితం బీజేపీ, టీడీపీని తిట్టి బయటకు వచ్చిందే కాక మళ్లీ ఆ 15 సీట్ల కోసం వారితోనే పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. పవన్, చిరంజీవి ఇద్దరు కూడా ప్యాకేజీ స్టార్లు వారి మాటలు నమ్మోద్దు అంటూ కేఏ పాల్‌ అన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు