UPSC NDA: ప్లస్ 2 అర్హతతో ఉద్యోగాలు.. ఈ రోజే లాస్ట్ డేట్!

UPSC NDA ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఈ రోజే చివరి తేదీ. ఇంటర్ చదువుతున్న, పూర్తయిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మొత్తం 406 పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో చేయాలి. వచ్చే ఏడాది ఏప్రిల్ 13న పరీక్ష నిర్వహించనున్నారు.

New Update
uPSC NDA

uPSC NDA Photograph: (uPSC NDA)

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎన్డీఏ 2025 ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి డిసెంబర్ 31 చివరి తేదీ. సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి. డిసెంబర్ 11న ఈ అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. 12వ తరగతి చదువుతున్న లేదా పూర్తి అయిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.మొత్తం 406 పోస్టులకు వచ్చే ఏడాది ఏప్రిల్ 13న పరీక్ష నిర్వహించనున్నారు. 

ఇది కూడా చూడండి: Kadapa: పోలీస్‌ స్టేషన్‌లోనే ఎస్‌ఐపై దాడి

ఇది కూడా చూడండి: Year Ender 2024: 2024లో కనిపించని పెద్ద హీరోలు

తప్పులు చేస్తే దిద్దుబాటు..

ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లోనూ ఈ పరీక్ష రుసుమును చెల్లించవచ్చు. దరఖాస్తు రుసుము జనరల్/ఓబీసీ అభ్యర్థులకు రూ. 100, ఎస్‌సీ, ఎస్టీ, మహిళలకు ఎలాంటి రుసుము లేదు. అయితే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారు ఏవైనా తప్పులు చేస్తే దిద్దుబాటు కూడా చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారమ్‌‌ను జనవరి 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు. 

ఇది కూడా చూడండి: జనవరి 1 నుంచి ఈ 3 రకాల బ్యాంక్‌ అకౌంట్లు మూతపడనున్నాయి..వీటిలో మీ అకౌంట్‌ ఉందా చూసుకోండి మరి!

ఈ ఎన్డీఏ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాలు, చిరునామా, విద్యార్హతలను నమోదు చేయాల్సి ఉంటుంది. వ్యక్తిగత వివరాల భాగంలో అభ్యర్థులు తమ పేరు, పుట్టిన తేదీ, తండ్రి పేరు, తల్లి పేరు, ఆధార్ నంబర్, జాతీయత, రుసుము ఉపశమనానికి అనుమతి, సంఘం, వైవాహిక స్థితి మొదలైన వాటిని ఫిల్ చేయాలి. upsc.gov.in అనే వెబ్‌‌సైట్‌లో అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

ఇది కూడా చూడండి: Buttermilk: మజ్జిగలో కొన్ని కలిపి తాగితే వ్యాధులు మాయం

అభ్యర్థులు అన్ని వివరాల తమ పూర్తి చిరునామా, ఇ మెయిల్ ఐడీతో రిజిస్ట్రేషన్ కావాలి. ఆ నంబర్‌ను గుర్తు పెట్టుకోవాలి. ఈ పరీక్షకు దాదాపు రెండు నుంచి మూడు లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటారు. రాత పరీక్షలో దాదాపు 8000 నుండి 10,000 మంది అభ్యర్థులను సెలక్ట్ చేస్తారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

All India Civil Services ఇప్పటివరకు ఫోన్ వాడలేదు.. ఆల్ ఇండియా సివిల్స్ లో తెలంగాణ అమ్మాయికి 11వ ర్యాంకు

వరంగల్ కి చెందిన సాయి శివాని అనే విద్యార్థిని ఆల్ ఇండియా సివిల్స్ లో 11వ ర్యాంకు సాధించి సత్తాచాటింది. రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది. ఇటీవలే తెలంగాణ గ్రూప్ 1 ఫలితాల్లోనూ సాయిశివాని రాష్ట్రస్థాయిలో 21వ ర్యాంకు, జోనల్ 1లో 11వ ర్యాంకు సాధించింది.

New Update

All India Civil Services సాధారణంగా చాలామంది సివిల్స్ క్లియర్ చాలా కష్టమని భావిస్తారు. కానీ కస్టపడి చదివితే సాధ్యం కానిది ఏదీ ఉండదు అని మరో సారి నిరూపించింది ఈ అమ్మాయి. తెలుగు తేజం సాయిశివాని ఆల్ ఇండియా సివిల్స్ లో 11వ ర్యాంకు సాధించి సత్తాచాటింది. రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది. 

Also Read: Viral News: ఫోన్ తీసుకుందని.. టీచర్‌ను చెప్పుతో కొట్టి, ల*జే అంటూ దాడిచేసిన విద్యార్థిని: (వీడియో)

సివిల్స్ లో ఆల్ ఇండియా 11వ ర్యాంకు 

వరంగల్ కి చెందిన సాయి శివాని ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది. కడప జిల్లా ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీలో బీటెక్ పూర్తిచేసిన సాయి శివాని.. ఆ తర్వాత సివిల్స్ కోసం ప్రిపేర్ అవడం మొదలు పెట్టింది. కలెక్టర్  కలతో అహర్నిశలు కష్టపడింది. ప్రణాళికతో రోజుకు 12 గంటలు చదివింది. మొదటి సారి విఫలమైనా.. నిరాశ చెందలేదు. మళ్ళీ కష్టపడి చదివింది. రెండో ప్రయత్నంలో ఆల్ ఇండియా స్థాయిలో  11వ ర్యాంకు సాధించి సత్తాచాటింది. రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది.  2023లో ఐదు మార్కులతో సాయిశివాని ప్రిలిమ్స్ మిస్సయింది. తిరిగి 2025లో తన కల నెరవేర్చుకుంది. 

Also Read: Pahalgam Attack: పహల్గాంలో నా బర్త్ డే వేడుకలు, షూటింగ్ కూడా.. విజయ్ దేవరకొండ సంచలన ట్వీట్!

ఈ సందర్భంగా సాయిశివాని మాట్లాడుతూ.. ఇంతవరకు ఫోన్ వాడకపోవడం.. సోషల్ మీడియాకు దూరంగా ఉండడమే తన కల నెరవేరడానికి కారణమని తెలిపింది. కలెక్టర్ కావాలనే లక్ష్యంతో కఠోర సాధన చేశాను. రోజుకు 12 గంటలు చదివాను. ఒత్తిడిని జయించడానికి యోగా, భగవద్గీత చదివేదాన్ని. ఈ విజయంలో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సహకారం మరువలేనిది అని చెప్పింది. 

latest-news

Also Read: AP 10th Result: ఏపీ టెన్త్ ఫలితాల్లో అరుదైన రికార్డ్.. 600 కు 600 మార్కులు!

Also Read: Viral Video అందరి ముందు భుజం పై నుంచి విజయ్ చేయి తీసేసిన విద్యార్ధి.. ఏం జరిగిందంటే

Advertisment
Advertisment
Advertisment