JEE Main 2024 Results: జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల..సత్తా చాటిన తెలుగు విద్యార్థులు! జేఈఈ మెయిన్స్ 2024 ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు తమ సత్తాను చాటా. దేశ వ్యాప్తంగా సుమారు 56 మందికి 100 పర్సంటైల్ రాగా అందులో ఏపీ, తెలంగాణకు చెందిన వారు 22 మంది ఉన్నారు. ఈ ఫలితాలను ఎన్టీఏ బుధవారం అర్థరాత్రి విడుదల చేసింది. By Bhavana 25 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి JEE Main 2024 Results: జేఈఈ మెయిన్స్ 2024 ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు తమ సత్తాను చాటా. దేశ వ్యాప్తంగా సుమారు 56 మందికి 100 పర్సంటైల్ రాగా అందులో ఏపీ, తెలంగాణకు చెందిన వారు 22 మంది ఉన్నారు. ఈ ఫలితాలను ఎన్టీఏ బుధవారం అర్థరాత్రి విడుదల చేసింది. ఈ ఫలితాల్లో దేశ వ్యాప్తంగా 2.5 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్ డ్ కు ఎంపిక చేసింది. 100 పర్సంటైల్ సాధించిన వారిలో ఏపీ నుంచి ఏడుగురు, తెలంగాణ నుంచి 15 మంది విద్యార్థులు ఉన్నారు. జేఈఈ ఫలితాలతో పాటు జాతీయ ర్యాంకులు, రాష్ట్రాల వారీగా టాపర్లు, కటాఫ్ ను జాతీయ పరీక్షల విభాగం వెల్లడించింది. జేఈఈ మెయిన్స్ పరీక్షను ఈ సారి జనవరి, ఏప్రిల్ నెలల్లో రెండు విడతలుగా పెట్టారు. రెండు సెషన్లలలో పాల్గొన్న అభ్యర్థుల స్కోరు ఆధారంగా తుది మెరిట్ జాబితాకు పరిగణనలోకి తీసుకోనున్నారు. రెండు సెషన్లకు కలిపి 9, 24, 636 మంది రిజిస్టర్ చేసుకోగా.. 8,22, 899 మంది పరీక్షలకు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి ... జేఈఈ మెయిన్స్ లో విశాఖ పట్నానికి చెందిన రెడ్డి అనిల్ కు జాతీయ స్థాయిలో 9 వ ర్యాంకు రాగా,... కర్నూలుకు చెందిన కేశం చెన్న బసవరెడ్డికి 14, ఈడబ్ల్యూఎస్ లో మొదటి ర్యాంకు వచ్చాయి. వైయస్ఆర్ జిల్లాకు చెందిన అన్నారెడ్డి వెంకట తనీష్రెడ్డికి జాతీయస్థాయిలో 20వ ర్యాంకు, ఈడబ్ల్యుఎస్లో మూడో ర్యాంకు లభించాయి. ఇదే జిల్లాకు చెందిన తోటంశెట్టి నిఖిలేష్కు జాతీయస్థాయిలో 21వ ర్యాంకు లభించింది. 100 పర్సంటైల్ వచ్చిన విద్యార్థులు... హందేకర్ విదిత్ (తెలంగాణ), ముత్తవరపు అనూప్ (తెలంగాణ), వెంకటసాయి తేజ మదినేని (తెలంగాణ), రెడ్డి అనిల్ (తెలంగాణ), రోహన్సాయి పబ్బ (తెలంగాణ), శ్రీయాశస్ మోహన్ కల్లూరి (తెలంగాణ), కేసం చెన్నబసవరెడ్డి (తెలంగాణ), మురికినటి సాయి దివ్యతేజరెడ్డి (తెలంగాణ), రిషి శేఖర్ శుక్లా(తెలంగాణ), తవ్వ దినేశ్రెడ్డి (తెలంగాణ), గంగ శ్రేయాస్ (తెలంగాణ), పొలిశెట్టి రితీశ్ బాలాజీ (తెలంగాణ), తమటం జయదేవ్రెడ్డి (తెలంగాణ), మరువు జస్విత్ (తెలంగాణ), దొరిసాల శ్రీనివాస్రెడ్డి (తెలంగాణ), చింటు సతీశ్ కుమార్ (ఆంధ్రప్రదేశ్), షేక్ సూరజ్ (ఆంధ్రప్రదేశ్), తోటంశెట్టి నిఖిలేశ్ (ఆంధ్రప్రదేశ్), తోట సాయికార్తిక్ (ఆంధ్రప్రదేశ్), మురసని సాయి యశ్వంత్రెడ్డి (ఆంధ్రప్రదేశ్), మాకినేని జిష్ణుసాయి (ఆంధ్రప్రదేశ్), 2 అన్నారెడ్డి వెంకట తనీష్రెడ్డి (ఆంధ్రప్రదేశ్). Also read: బెంగళూరులో బ్రాంచ్ ఓపెన్ చేస్తున్న సూపర్ స్టార్! #mains #jee #results సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి